సొమ్ము ప్రజలది సోకు సర్కార్’ ది పంజాబ్ ‘పందారం’ పై జనాగ్రహం

Publish Date:May 22, 2022

Advertisement

తెలంగాణ సాధన కోసం సుమారు పుష్కర కాలానికి పైగా సాగిన మలి దశ ఉద్యమంలో 1200 మందికి పైగా తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేశారు. అమరులయ్యారు. మరో వారం పది రోజులలో (జూన్ 2 తేదీ) తెలంగాణ రాష్ట్రం అవతరించి ఎనిమిది (8) సంవత్సరాలు పూర్తవుతాయి. అయినా, రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన ఆ 1200 మంది అమర వీరుల కుటుంబాలలో సగం కుటుంబాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం పూర్తిగా అందలేదు. అందులో సగం మందిని తెలంగాణ ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది. మరి కొందరి చిరునామాలే లేవని ఫైల్స్ క్లోజ్ చేసింది. అందుకే అమర వీరుల కుటుంబాలను గుర్తించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలే కాదు అమరుల కుటుంబాలు,సైతం ఆరోపిస్తున్నాయి. 

అంతే కాదు, ఈరోజుకు కుడా  నిధులు, నీళ్ళు, నియామకాల కోసం ఉద్యమించిన యువత కలలు నెరవేరలేదు. రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు, రైతులు ఆత్మహత్యలు ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగానే సాగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 7,500 మంది రైతులు చనిపోయారు. అనధికారిక లెక్కల ప్రకారం 40 వేల మంది చనిపోయారు. ఆ కుటుంబాలకు ఇవ్వవలసిన పరిహారం ఇవ్వ‌లేద‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకసారి కాదు, అనేక సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు.పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే, నిరుద్యోగ యువకులు ఇక తమకు ఉద్యోగ యోగం లేదనే నిరాశకుగురై, ముఖ్యమంత్రికి లేఖలు రాసి మరీ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు.  

అయితే, జాతీయ రాజకీయాల్లో స్థానం కోసం తహతహ లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన ఆరు వందల మంది పంజాబ్ రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. మూడు లక్షల చొప్పున దాదాపుగా రూ. పద్దెనిమిది కోట్లను నష్టపరిహారంగా అందించేందుకు పంజాబ్’ కు పయనమయ్యారు. మంచిదే, పొరుగు వారికి సహాయం చేస్తామంటే, వద్దనే వారుండరు. అయితే, తెలంగాణ అమరవీరులకు, అదే విధంగా తెలంగాణలో బలవన్మరణాలకు పాల్పడిన  రైతులు, నిరుద్యోగ యువకులకు మొండి చేయి చూపించిన ప్రభుత్వం, పంజాబ్ రైతులకు పరిహారం చెల్లించడం ఏమిటని, ప్రశ్నిస్తున్నారు.ఇది అమ్మకు అన్నం పెట్టని వాడు, పిన్నమ్మకు వడ్డాణం చేయిస్తానని, అన్నట్లుగా ఉందని అంటున్నారు. 
అదే సమయంలో రాజకీయ వర్గాల్లోనూ ముఖ్యమత్రి కేసీఆర్ ‘దాతృత్వం’ పై చర్చ జరుగుతోంది. విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఓ వంక తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు సాయం కోసం ఎదురు చూస్తుంటే, వారిని పట్టించుకోకుండా… ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్’లో చనిపోయిన రైతులను  ఆదుకుంటామని బయలుదేరారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేందుకు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని సామాన్య  ప్రజలు కూడా గుర్తించారు. 

ఓ వంక కేంద్ర ప్రభుత్వానికి చెల్లించిన పన్నుల లెక్కలు తీస్తున్న తెరాస ప్రభుత్వం,  తెలంగాణ రైతుల వద్ద నుంచి  బాయిల్డ్ రైస్ కొనేందుకు నిరాకరించి, కేంద్రంతో కయ్యానికి కాలు దువ్విన ముఖ్యమంత్రి, పంజాబ్ రైతులకు తెలంగాణ ప్రజలు చెల్లించిన పన్ను పైసలు ఎలా పందారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.  దేశంలో 28 రాష్ట్రాలున్నాయి, అయినా మరే రాష్ట్రం కూడా పంజాబ్ రైతులను ఆదుకుంటామని ముందుకు రాలేదు. నిజానికి ఆ అవసరం కూడా లేదు. అందుకే, మరో రాష్ట్ర ప్రభుత్వమే కాదు , పంజాబ్ ప్రభుత్వం కూడా ఢిల్లీ ఆందోళనలో చని పోయిన రైతులకు పరిహారం చెల్లించలేదు. చివరకు పంజాబ్’లో అధికారంలో ఉన్న ఆప్’ ఢిల్లీలోనూ అధికారంలో ఉంది,

అయినా పంజాబ్ రైతులకు పైసా సాయం చేయలేదు. అలాంటప్పుడు  తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధమన్న వాదన వినిపిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్ వంద కోట్లకు చేరిన తెరాస నిధుల నుంచి పంజాబ్ రైతులకు అడుకోవచ్చని, కానీ,   తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల సొమ్ముతో రాజకీయం చేస్తున్నారని.. అక్కడ మైలేజీ కోసం ప్రజా ధనం వాడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. విపక్ష పార్టీలు అదే విమర్శలు చేస్తున్నాయి. రైతు కుటుంబాలను ఆదుకోవడాన్ని ఎవరు తప్పు పట్టరు కానీ.. ముందుగా సొంత రాష్ట్ర రైతుల్ని ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. అది ఎవరి సొమ్ము.. ఎవరు, ఎందుకోసం దానం చేస్తున్నారు? అనే ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాదానం చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు

By
en-us Political News

  
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.