అమెరికా ఆర్మీడేకి చీఫ్ గెస్ట్ పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

Publish Date:Jun 13, 2025

Advertisement

భార‌త్ కి దౌత్య‌ప‌ర‌మైన దెబ్బ‌.. కాంగ్రెస్ ఆందోళన 

పాక్ అమెరికా లు  సంప్ర‌దాయ మిత్ర దేశాలు. అయితే  911 దాడుల త‌ర్వాత  పాక్ కి దూరం జ‌రుగుతూ వ‌చ్చింది అమెరికా.  అప్ప‌ట్లో జార్జి బుష్ కి లాడెన్ కుటుంబానికి వ్యాపార సంబంధాలుండేవి. నేడ‌దే సీన్ రిపీట్ అవుతూ వ‌స్తోంది. మీకు తెలుసో తెలీదో గానీ మునీర్ కి ట్రంప్ కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయ్.  ట్రంప్ పిల్ల‌ల‌కు చెందిన వ‌ర‌ల్డ్ లిబ‌ర్టీ ఫైనాన్షియ‌ల్ అనే బిట్ కాయిన్ సంస్థ తో మునీర్ నాయ‌క‌త్వంలో పాకిస్తాన్ ఒప్పంద ప‌త్రాల మీద సంత‌కాలు చేసింది. ఈ సంస్థ పాక్ భూభాగం కేంద్రంగా బిజినెస్ చేస్తోంది. ఈ ఒప్పందం ఎప్పుడు కుదిరిందో తెలిస్తే ఎవరైనా సరే షాక్ కాక తప్పదు. ఒక ప‌క్క పాక్,  భార‌త్ మధ్య  భీక‌ర‌మైన యుద్ధ వాతావ‌ర‌ణం ఏర్ప‌డి ఉన్న స‌మ‌యంలోనే ఈ ఒప్పందం కుదిరింది. ఆ మాట‌కొస్తే ప‌హెల్గాం దాడుల‌కూ మునీర్ వ్యాఖ్య‌ల‌కు సంబంధ‌ముంద‌ని అంటారు కాంగ్రెస్ క‌మ్యూనికేష‌న‌ల్ హెడ్ అయిన జైరామ్ ర‌మేష్. మునీర్ రెచ్చ‌గొట్టిన త‌ర్వాతే ఉగ్ర‌వాదులు కాశ్మీర్ లో రెచ్చిపోయి 26 మందిని హ‌తం చేశారు. 

ఇప్పుడు కాశ్మీర్ ప‌ర్యాట‌కం లేక విల‌విల‌లాడుతోంది.  దానికి తోడు ఆ స‌మ‌యంలో అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ సైతం భార‌త్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.  వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తే ఈ దాడిలో ఇన్ డైరెక్టుగా అమెరికా  పాత్ర ఉన్న‌ట్టు కూడా అనుమానించాలి.  మొన్న ఇదే మునీర్ ఏదో సాధించేసిన‌ట్టు.. అత‌డికి ఫీల్డ్ మార్ష‌ల్ ప‌ద‌వినిచ్చి స‌త్క‌రించింది పాకిస్తాన్. ఇప్పుడు చూస్తే అమెరికా ఆర్మీ పెరెడ్ కి మునీర్ కు అనూహ్య ఆహ్వానం. దీనంత‌టి వెన‌క అస‌లేం న‌డుస్తోందన్నది స‌స్పెన్స్ గా మారింది. ఈ ఆర్మీడే ఆహ్వానానికి ముందు యూఎస్ జ‌న‌ర‌ల్ ఒక‌రు పాకిస్తాన్ ను  ఉగ్ర‌వాద నియంత్ర‌ణ‌లో అత్యుత్త‌మ భాగ‌స్వామిగా అభివ‌ర్ణించ‌డం కొస‌మెరుపు. అంతే కాదు రెండేళ్ల‌లో ఈ ఇద్ద‌రు.. అంటే    అమెరికా, పాక్ జ‌న‌ర‌ల్స్ మూడు సార్లు క‌లిసిన‌ట్టు రిపోర్టులున్నాయి.  హ‌ఫీజ్ స‌యీద్, మ‌సూద్ అజ‌ర్ వంటి వ‌ర‌ల్డ్స్ మోస్ట్ వాంటెడ్ ట్రెర్ర‌రిస్టుల‌కు ర‌క్ష‌ణ, శిక్ష‌ణ‌తో పాటు వారి కోసం నిధుల సేక‌ర‌ణ కూడా చేసే పాక్ ప్ర‌భుత్వం ఉగ్ర‌వాద నియంత్ర‌ణ‌లో భాగ‌స్వామి ఎలాగ‌య్యిందో అమెరికాకు తప్ప ఇంకెవ‌రికీ అర్ధం కాదు.

గ‌తంలో ఇదే పాక్ ర‌క్ష‌ణ మంత్రి తాము గ‌తంలో యూఎస్ కోసం ర‌ష్యాకు వ్య‌తిరేకంగా ఎన్నో చెత్త ప‌నులు చేసిన మాట వాస్త‌వం అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మ‌ళ్లీ ఏ కొత్త చెత్త ప‌నులు యూఎస్ కోసం పాక్ చేస్తుందో అర్ధంకాని అగ‌మ్యగోచ‌రం.  ఇక్క‌డ పాకిస్థాన్ ఉచ్చులో అమెరికా చిక్కిందా.. లేక అమెరికా ఉచ్చులో పాక్ చిక్కిందా? అన్న‌దొక స‌స్పెన్స్. గ‌ త కొంత కాలం నుంచి పాకిస్థాన్ కి ఏకైక ఆర్ధిక ఆద‌రవు చైనా. చైనా పాక్ భూభాగాన్ని ఆశించి.. చైనా పాక్ కారిడార్ పేరిట ఒక ప్ర‌పంచ ర‌హ‌దారి నిర్మాణం చేయ‌డ‌మే కాదు.. హైబ్రిడ్ రోడ్లు, సీపోర్టులు, ఎయిర్ పోర్టులు నిర్మిస్తోంది. 

అయితే బ‌లూచిస్తాన్ స్వేచ్చా పోరాటం చేయ‌డంతో పాటు త‌మది స్వతంత్ర దేశమని  ప్ర‌క‌టించుకుంది. ఆ దేశం గానీ రేప‌టి  రోజున అధికారికంగా పాక్ నుంచి డిటాచ్ అయితే చైనాతో పాక్ సంబంధాలు పూర్తిగా  చెడిపోయే ప‌రిస్థితి. ఇప్ప‌టికే బ‌లూచీలు త‌మ భూభాగంలోని చైనీయుల‌ను త‌రిమి త‌రిమి కొడుతున్నారు. ఈ  సిట్యువేష‌న్లో చైనా కూడా ఆలోచ‌న‌లో ప‌డింది. దానికి తోడు సింధ్ లో నీటి క‌ట‌క‌ట  కార‌ణంగా  ఏకంగా హోం మంత్రి ఇంటికే నిప్పు పెట్టిన ప‌రిస్థితి.

ప‌రిస్థితులు ఎంత మాత్రం స‌జావుగా లేక పోవ‌డంతో.. మునీర్ నాయ‌క‌త్వంలో అమెరికాకు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేలా ప‌థ‌క  ర‌చ‌న చేసింది పాక్. అంతే కాదు అమెరికాకు కూడా పాక్ సాయం అవ‌స‌రం.  కార‌ణ‌మేంటంటే చైనాతో యూఎస్ విప‌రీతమైన వాణిజ్య యుద్ధం చేస్తోంది. అందులో భాగంగా  చైనా ఇటీవ‌ల అరుదైన ఖ‌నిజాల‌ను అమెరికాకు స‌ర‌ఫ‌రా చేయ‌డాన్ని ఆపేసింది. దీంతో అమెరికా చైనాను క‌ట్ట‌డి చేయ‌డానికంటూ పాక్ ని ద‌గ్గ‌ర‌కు చేర్చుకుంటోందని తెలుస్తోంది.

అందుకే వ‌ద్ద‌న్నా ఐఎంఎఫ్ లోన్లు, వ‌ర‌ల్డ్ బ్యాంకు అప్పులు పాక్ కి ఇప్పిస్తోంది అమెరికా. దానికి తోడు మునీర్ కి కూడా ఏదో ఒక  అగ్ర‌దేశం అండ కావాలి. వారి ద్వారా దేశాన్ని ముందుకు న‌డ‌పాల్సిన  ప‌రిస్థితి  ఉంది. భార‌త్  ఇటు బలూచీల‌ను రెచ్చ‌గొడుతూ.. అటు   ఆఫ్ట‌న్ల‌తో చెలిమి చేస్తోంది.  దీంతో అన్ని  ర‌కాలుగా తిరిగి అమెరికాకు ద‌గ్గ‌ర‌వ్వ‌డ‌మే ల‌క్ష్యంగా పాక్ పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా మునీర్ కు అమెరికా ఆర్మీడేకు ఆహ్వానం అన్నది దౌత్య ప‌రంగా  భార‌త్ కి భారీ ఎదురుదెబ్బ‌ అంటోంది కాంగ్రెస్. 

ఇక్క‌డ విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే పాక్ డ‌యాస్పోరా సైతం ఈ ఆహ్వానానికి వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తోంది. ఇప్ప‌టికే పాక్ మాజీ  ప్ర‌ధాని ఇమ్రాన్ పార్టీ అమెరికాలోని పాక్ ఏంబ‌సీ ముందు నిర‌స‌న  కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. అమెరికాతో ఏ ఒప్పంద‌మైనా స‌రే పాక్ కి న‌ష్ట‌మేనంటోంది ఇమ్రాన్ పార్టీ. ఇన్నేసి  దుశ్శ‌కునాల  మ‌ధ్య అసీం  మునీర్ ఏం సాధిస్తాడో తెలియాల్సి ఉంది.

ఇక్క‌డో మ‌రో గుర్తించాల్సిన విష‌య‌మేంటంటే..  అమెరికా  జూన్ 14న త‌న 250వ ఆర్మీడే జరుపుకుంటోంది.. సరిగ్గా అదే రోజు ట్రంప్ 79వ బ‌ర్త్ డే కూడా. దానికీ మునీర్ హాజ‌ర‌వుతున్నాడు. స‌రే.. మ‌రి  అమెరిక‌న్ సోల్జ‌ర్స్ ని ఉద్దేశించి ఆయ‌నెలా వారికి ప్రేర‌ణ‌గా  నిలుస్తాడ‌న్న‌ది అర్ధం కావ‌డం లేదెవ‌రికీ. కార‌ణ‌మేంటంటే ప్లాన్స్ లేవు- ప్రేయ‌ర్స్ త‌ప్ప అంటూ ఆప‌రేష‌న్ సిందూర్ లో చేతులెత్తేసిన మునీర్ వీరికెలా ఇన్ స్పిరేష‌న్ అవుతాడో అర్దం కాక బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకుంటున్నారు ఒక్కొక్క‌రూ.

By
en-us Political News

  
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.