కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన ఘటన జరిగి దెగ్గర దెగ్గరగా నెల కావోస్తున్న బోటు మాత్రం ఇంకా బయటకు రాలేదు. గోదావరి తీరం వద్ద బోటు వెలికితీత పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కచ్చులూరు దగ్గర ఆపరేషన్ నిర్వహించేదుకు వాతావరణం అనుకూలించట్లేదు. వర్షం కారణంగా పనులకు ఆటంకం ఏర్పడింది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి మళ్లీ వరద ప్రవాహం పెరుగుతుంది. దాంతో బోటు వెలికితీత పనులకు ఆటంకం వచ్చిపడింది.
కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు వెలికితీత పనులకు ఆటంకం కలుగుతోంది. మూడు రోజలుగా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడం వరద ఉధృతి మరింత పెరగడంతో వెలికితీత పనులను నిలిపివేశారు. బోటు మునిగి పోయిన చోట సుడులు తిరుగుతున్నాయి. వరద ప్రవాహం తగ్గాకే మళ్లీ ఆపరేషన్ షురూ చేసే అవకాశం కనిపిస్తోంది. బోటును వెలికితీసేందుకే ధర్మాడి సత్యం బృందం మూడు రోజుల పాటు తీవ్రంగా శ్రమించింది. ఇరవై ఐదు మంది సిబ్బందితో ఒక పంటు ప్రొక్లయిన్ ఎనిమిది వందల మీటర్ల ఇనుప రోప్ తో వారు రంగంలోకి దిగారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి పదిహేను మీటర్ల ఎగువున మూడు యాంకర్లు వేశారు. ఆ చివరి నుంచి ఇటు ఒడ్డుకు యాంకర్లను లాగారు. మధ్యలో యాంకర్లు కొండరాయిని పట్టుకున్నాయి. రెండవరోజు ప్రయత్నం చేయగా నీటిలో ఉన్న నాలుగు వందల మీటర్ల ఇనుప రోప్ తెగి గోదావరిలో పడిపోయింది. అలా నీటిలో పడి పోయిన రోప్ విలువ నాలుగు లక్షల వరకు ఉంటుందంటున్నారు.
గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు బరువు నలభై టన్నులు. నీటిలో నాని, బురదలో కూరుకుపోయి ఉండటం వల్ల యాభై టన్నులకు పైగా బరువు పెరిగి ఉంటదని భావిస్తున్నారు. ఒకసారి కొక్కెం తగిలితే బోటును అటూ ఇటూ కదిలిస్తే బరువు తగ్గుతుందని అంచనా. గోదావరి నదీ గర్భంలో రెండు వందల పది అడుగుల లోతులో బోటు ఉన్నట్టు సత్యం టీమ్ చెబుతోంది. కిందటి నెల పదిహేనున గోదావరిలో బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇంకా పదిహేను మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి జాడ కోసం బంధువులు కళ్లుకాయలుకాచేలా ఎదురు చూస్తున్నారు. ఆశలు వదిలేసుకున్న కొందరు కనీసం డెత్ సర్టిఫికెట్లు అయిన జారీ చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే భౌతికంగా మృతదేహం దొరకనందున ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం చూస్తోంది. గోదారమ్మ కొంచం కరునిస్తే కానీ మళ్ళీ వెలికితీత పనులు మొదలు పెట్టగలమని బృందం తెలియజేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/operation-vasishta-to-retrieve-capsized-boat-in-godavari-called-off-temporarily-25-89715.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.