ఏపీలో వాడిపోతున్న కమలం.. బీజేపీ హైకమాండ్ ఏం చేస్తోంది?

Publish Date:Nov 6, 2024

Advertisement

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ బ‌లోపేతానికి ఆ పార్టీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాష్ట్రాల వారిగా పార్టీని అధికారంలోకి తీసుకొస్తూ ఒక్కో రాష్ట్రాన్ని త‌మ ఖాతాలో వేసుకుంటున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ.. ద‌క్షిణాది రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ముఖ్యంగా త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బ‌లోపేతం అవుతోంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం నాటికి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా ప్ర‌ణాళిక‌తో ఆ పార్టీ నేత‌లు ముందుకెళ్తున్నారు. త‌మిళ‌నాడులోనూ బీజేపీ బ‌లోపేతానికి వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. మ‌రోవైపు క‌ర్ణాట‌క‌లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేలా బీజేపీ ఇప్ప‌టి నుంచే వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతంపై మాత్రం బీజేపీ పెద్ద‌లు దృష్టి సారించ‌డం లేదు. ఏపీలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ లు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం విదిత‌మే. అయితే, ఎన్నిక‌ల త‌రువాత తెలుగుదేశం, జ‌న‌సేన  అధిష్టానాలు త‌మత‌మ‌ పార్టీల బ‌లోపేతం చేయడంపై దృష్టి సారించాయి. బీజేపీ నేత‌లు మాత్రం ఆ  దిశగా ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. మ‌రోవైపు బీజేపీ అధిష్ఠానం కూడా రాష్ట్రంలో పార్టీ గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం లేదు. 

ఏపీలో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ లు రాష్ట్ర అభివృద్ధిపై ప్ర‌త్యేక దృష్టిసారించారు. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ అరాచ‌క పాల‌న‌తో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుప‌డిపోయింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం హోదాలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చ‌డంతోపాటు.. అభివృద్ధిని పూర్తిగా ప‌క్క‌న‌ ప‌డేశారు. ఫ‌లితంగా ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఒక ప‌క్క అమ‌రావ‌తి రాజ‌ధానిలో భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌పై దృష్టిసారించ‌డంతోపాటు.. పోలవ‌రం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్రంలో ర‌హ‌దారుల నిర్మాణం, మరమ్మతులు ఇలా అన్నిరకాలుగా అభివృద్ధిపై చంద్ర‌బాబు దృష్టిసారించారు. ఇద‌లా ఉంటే చంద్ర‌బాబు, లోకేశ్ పార్టీ బ‌లోపేతంపైనా దృష్టిసారించారు. మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం క్షేత్ర‌స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ నుంచి ప‌లువురిని త‌మత‌మ పార్టీల్లో చేర్చుకుంటున్నారు. ఇప్ప‌టికే వైసీపీ సీనియ‌ర్ నేతలు టీడీపీ, జ‌న‌సేనలలో చేరారు. మ‌రికొంద‌రు ఆయా పార్టీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ విష‌యంలో కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీ మాత్రం వెనుక‌బ‌డిపోయింది. బీజేపీ  పెద్ద‌లు రాష్ట్రంలో పార్టీ ఉందన్న సోయ లేనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

 కూట‌మి ప్ర‌భుత్వంలో బీజేపీ నేత‌ల‌కు అన్యాయం జ‌రుగుతున్నద‌ని బీజేపీ రాష్ట్ర పార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర క్యాబినెట్ లో బీజేపీ ఎమ్మెల్యేకు మంత్రిగా అవ‌కాశం క‌ల్పించి స‌ముచిత న్యాయం చేసిన‌ప్ప‌టికీ.. నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ విష‌యంలో.. ఇటీవ‌ల టీటీడీ పాల‌క వ‌ర్గం ఎంపిక విష‌యంలో బీజేపీకి ఇసుమంతైనా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నెల‌లో ఏపీ ప్ర‌భుత్వం పెద్ద సంఖ్యలో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది. 20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, ఒక వైస్‌ఛైర్మన్‌ను నియమించింది. 7 కార్పొరేషన్లలో 64 మందికి సభ్యులుగా అవకాశం కల్పించింది. ఇందులో బీజేపీ నేత‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. 20 కార్పొరేష‌న్ చైర్మ‌న్ల‌లో కేవ‌లం ఒక్క కార్పొరేష‌న్ (20 సూత్రాల అమ‌లు క‌మిటీ – లంకా దిన‌క‌ర్) ను మాత్ర‌మే బీజేపీకి కేటాయించారు. ఐదుగురు బీజేపీ నేత‌ల‌ను స‌భ్యులుగా నియ‌మించారు. దీనికితోడు ఇటీవ‌ల టీటీడీ పాల‌క వ‌ర్గం నియామ‌కంలోనూ బీజేపీకి అన్యాయం జ‌రిగింద‌ని ఆపార్టీ నేత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తిరుపతికి చెందిన సీనియర్‌ బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డికి పాలక మండలిలో చోటు ద‌క్కించింది. మ‌రొక బీజేపీ నేత‌కు టీటీడీ పాల‌క‌వ‌ర్గంలో అవ‌కాశం క‌ల్పిస్తే బాగుండేద‌న్నభావన బీజేపీ రాష్ట్ర నాయకుల్లో వ్యక్తం అవుతోంది. అయితే, ఎన్టీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్  రాష్ట్ర బీజేపీ నేత‌ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. 

బీజేపీ కేంద్ర పెద్ద‌లుసైతం ఏపీలో పార్టీ బ‌లోపేతంపై పెద్ద‌గా దృష్టిసారించ‌డం లేదు. దీంతో పార్టీలోని ఓ వ‌ర్గం నేత‌లు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల్లోకి ప‌లువురు వైసీపీ నేత‌లు చేరారు. బీజేపీ రాష్ట్ర అధిష్టానం, కేంద్ర అధిష్టానం పెద్ద‌లు మాత్రం పార్టీలో చేరిక‌ల విష‌యంపై అస‌లు ప‌ట్టించుకోవ‌టం లేద‌ని, త‌ద్వారా క్షేత్ర‌ స్థాయిలో పార్టీ క్యాడ‌ర్ లో నిస్తేజం నెల‌కొంటుంద‌ని  పార్టీ రాష్ట్ర నేతలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విష‌యాన్ని కేంద్రం పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లిన‌ప్ప‌టికీ వారు పట్టించుకోలేదు. కేంద్ర పార్టీ పెద్ద‌లు జోక్యం చేసుకొని ప్ర‌భుత్వ నామినేటెడ్ ప‌దవుల్లో రాష్ట్ర‌ బీజేపీ నేత‌ల‌కు వీలైన‌న్ని ఎక్కువ ప‌ద‌వులు ద‌క్కేలా చూడాల్సింది పోయి.. రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితిని సైతం ప‌ట్టించుకోక‌పోవ‌టంతో కొంద‌రు నేత‌లు ఏకంగా పార్టీ మారే ఆలోచ‌న సైతం చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే, త్వ‌ర‌లో మ‌రో విడ‌త నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసేందుకు సీఎం చంద్ర‌బాబు నాయుడు సిద్ధ‌మ‌య్యారు. వ‌చ్చే వారం రోజుల్లోనే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు జోక్యం చేసుకొని.. రాష్ట్రంలోని బీజేపీ నేత‌ల‌కు ఏమేర‌కు ఎక్కువ నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కేలా చూస్తార‌నే విష‌యంపై ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుంది.

By
en-us Political News

  
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.
తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు.
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.