ఏపీ సీఐడీ మాజీ చీఫ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. కర్మఫలం అనుభవించక తప్పదుగా?

Publish Date:Nov 6, 2024

Advertisement

జగన్ హయాంలో కొందరు ఐపీఎస్ అధికారులు రాజును మించిన రాజభక్తి ప్రదర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం తమ విధులను విస్మరించి ఏలిన వారి సేవలో తరించడమే పరమార్ధంగా భావించారు. జగన్ అధికారం శాశ్వతమన్న భ్రమల్లో ఆయన మెప్పు కోసం నానా గడ్డీ కరిచారు. పనిలో పనిగా సొంత లబ్ధి కోసం అడ్డదారులు తొక్కి అక్రమ సంపాదనకు తెరతీశారు. 

ఇప్పుడు జగన్ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి కొలువుదీరింది. దీంతో వైసీపీ కార్యర్తల్లా వ్యవహరించిన అధికారులు జగన్ అండ చూసుకుని చేసిన అరాచకాలకు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థతి ఏర్పడింది. ఇప్పటికే పలువురు అధికారులకు పోస్టింగులు ఇవ్వలేదు. వారి పాపాలు, అకృత్యాలకు చట్టం ముందు దోషిగా నిలబడక తప్పని పరిస్థితి ఎదురైంది. అలాంటి వారిలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ఒకరు. ఇప్పటికే లూప్ లైన్ లో ఉన్న సంజయ్ ఇప్పుడు కేసులు, విచారణలు ఎదుర్కొని కటకటాలు లెక్కించక తప్పని పరిస్థితిలో ఉన్నారు.  

తాము అఖిల భారత సర్వీసు అధికారులమని మరిచి.. అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లల్లా నడుచుకుని, వాళ్లు చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా రెచ్చిపోయిన అధికారులంతా ఇప్పుడు ఎప్పుడు ఏ కేసులో అరెస్టు అవుతామా అన్న భయంతో వణికి పోతున్నారు. అలాంటి వారిలో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ఒకరు.   కూటమి సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత సంజయ్‌కి పోస్టింగ్ ఇవ్వలేదు.  అంతే కాదు.. పలు అక్రమాల్లో అడ్డంగా దొరికిన ఆయనపై చర్యలకు ఇప్పుడు రంగం సిద్ధం అయ్యింది.  సంజయ్‌ అక్రమాల చిట్టా మామూలుగా లేదు. వివిధ శాఖల అధిపతిగా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు..చేసిన అవినీతి, అక్రమాలు అన్నీ ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి. 

సంజయ్‌ ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పని చేసినప్పుడు..అధికార హోదాను అడ్డుపెట్టుకొని కోటి రూపాయలు దుర్వినియోగం చేశారు. ఆ విషయాన్ని  విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తేల్చింది. సౌత్రిక టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థతో కుమ్మకై ఆ సంస్థకు అప్పనంగా చెల్లింపులు చేసినట్లు తేలింది.  బిడ్డింగ్‌లో రిగ్గింగ్‌ చేయడంతో పాటు టెండర్లు కట్టబెట్టడంలో  నిబంధనలను బేఖాతరు చేసినట్లు  గుర్తించిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ విభాగం ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సంజయ్‌పై కేంద్ర సివిల్‌ సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని  సిఫార్సు చేసింది. 

 ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ గా ఉన్న సమయంలో సంజయ్ ఆ శాఖలో ఐపాడ్‌లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. టెండర్లు, కాంపిటీటివ్‌ బిడ్లు లేకుండానే  తన ఇష్టారీతిగా ఆర్డర్లు ఇచ్చేశారు.  బిల్లులూ సబ్‌మిట్‌ చేయలేదు.  వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్, ట్యాబ్‌ల సరఫరా కోసం భారీగా బిల్లులు చెల్లించేశారు. అంతే కాదు ఎస్సీ, ఎస్టీలకు చట్టాలపై అవగాహన కల్పిస్తానంటూ తనకు తానుగా ఓ భారీ బాధ్యతను తీసుకున్న సంజయ్ అప్పటి జగన్ సర్కార్ నుంచి ఏకంగా కోటి రూపాయలు దండుకున్నారు.  ఆ సొమ్ములో ఆయన ఎస్సీఎస్టీలకు చట్టాలపై అవగాహనా కార్యక్రమాలంటూ ఖర్చు చేసింది కేవలం మూడు లక్షల ర ూపాయలు మాత్రమే.  ఈ విషయాలన్నీ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక తేల్చిన విషయాలే.  

ఇక తనను ఏరి కోరి సంజయ్ ను సీఐడీ చీఫ్‌ పిలిచి పీఠం ఎక్కించిన జగన్ మెప్పు కోసం ఆయన స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు విషయంలో అత్యుత్సాహం చూపిన సంగతి విదితమే.  సరే అడ్డగోలుగా, కనీసం నోటీసు ఇవ్వకుండా, కారణం కూడా చెప్పకుండా చంద్రబాబును అరెస్టు చేసిన తరువాత సంజయ్ వ్యవహరించిన తీరు మరింత దారుణంగా ఉంది. చంద్రబాబు అక్రమ అరెస్టు సక్రమమే అని చెప్పేందుకు నానా రకాలుగా ప్రయత్నించారు. అప్పటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలుతో కలిసి హస్తినలో ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ చంద్రబాబు అరెస్టును సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయంలో ప్రభుత్వోద్యోగిగా తన పరిమితులను కూడా ఆయన అధిగమించేశారు.  ఇప్పుడు నాటి పాపాలకు శిక్ష అనుభవించడానికి ఎదురు చూస్తున్నారు. విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక ప్రకారం ఐపీఎస్ సంజయ్ పై చర్యలకు రంగం సిద్ధమైందంటున్నారు. 

By
en-us Political News

  
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.
తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు.
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.