రాజ‌ప్ప.. మీరు గ్రేట‌ప్ప.. 40 ఏళ్ల టీడీపీ ప్ర‌స్థానం..

Publish Date:Mar 31, 2022

Advertisement

తెలుగుజాతి ఆత్మగౌరం అంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు నిజమైన సైనికుల్లా పలువురు నేతలు ఉన్నారు. అలాంటి వారిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్ప ముందు వరుసలో ఉంటారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం దివంగత ఎన్టీ రామారావు నేతృత్వంలో ఎంతటి వినయ విధేయతలు, విశ్వాసంతో పని చేశారో.. ప్రస్తుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితోనూ కించిత్తు కూడా తేడా లేకుండా అంతే విశ్వాసంతో పనిచేస్తున్న వ్యక్తుల్లో నిమ్మకాయల చినరాజప్ప ప్రథముడిగా ఉంటారు. టీడీపీతోనే మమేకమై కొనసాగుతున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడి ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తానని, పార్టీలో ఎవరైనా సరే ఆయన నిర్ణయాలకే కట్టుబడి ఉంటారని చెబుతుంటారు చినరాజప్ప. పార్టీ అధినేత తనకు అప్పగించిన ఎంత చిన్న బాధ్యత అయినా.. పెద్ద బాధ్యత అయినా ఏమాత్రం బేషజం లేకుండా క్రమశిక్షణ గల సైనికుడి మాదిరిగా నిర్వర్తించడంలో ఆయనకు ఆయనే సాటి అంటారు టీడీపీ నేతలు, శ్రేణులు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా తూర్పుగోదావరి జిల్లా. అలాంటి జిల్లాలో టీడీపీ బరువు బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసిన పార్టీ సైనికుడు చినరాజప్ప. 1992 నుంచి 2014 వరకు సుదీర్ఘంగా 22 ఏళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా చినరాజప్ప సేవలందించారు. టీడీపీలో ఇది ఓ రికార్డు అనే చెప్పాలి. టీడీపీకి తొలి నుంచీ తూర్పుగోదావరి జిల్లా పెట్టనికోటలా మారటానికి చినరాజప్ప చేసిన కృషి ఎంతో ఉందంటారు. రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా చినరాజప్ప పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారంటారు.

తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం పెదగాడపల్లిలో 1953 అక్టోబర్ 1వ తేదీన నిమ్మకాయల చినరాజప్ప జన్మించారు. సాధారణ రైతు నిమ్మకాయల వెంకట రంగయ్య, కొండమ్మ దంపతులకు చినరాజప్ప పుట్టారు. తండ్రి నుంచి వ్యవసాయాన్ని వారసత్వంగా కొనసాగిస్తున్నారు చినరాజప్ప. చినరాజప్ప ఎం.ఏ చదివారు. చినరాజప్పది ఎవరినీ నొప్పించని మనస్తత్వం. వినయం, విధేయత లాంటి లక్షణాలు కలగలిసిన చినరాజప్ప అజాతశత్రువు అని ప్రజలు కొనియాడుతుంటారు. ఎంతటి స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండడం చినరాజప్ప సహజ లక్షణం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్వయంగా వెళ్లి పరిష్కరించడం ఆయన నైజం. కోనసీమలో పుట్టిన తనకు ఘన విజయం అందించిన పెద్దాపురం నియోజకవర్గం ప్రజలకు రుణపడి ఉంటానంటారాయన. హోంమంత్రి అయినా.. నియోజకవర్గంలో సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు చినరాజప్ప.

1983లో ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. క్రియాశీలక పార్టీ సభ్యునిగా కొనసాగారు. చినరాజప్ప 1986లో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆపైన 1987లో ఉప్పలగుప్తం ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఉప్పలగుప్తం మండలాన్ని ఉత్తమ మండలంగా తీర్చిదిద్దారు నిమ్మకాయల. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఎన్నికై తన సమర్ధత ఏంటో నిరూపించుకున్నారు చినరాజప్ప. ఏపీలో పలు పదవులు చేపట్టి వాటిని సమర్థవంతంగా నిర్వహించారు. చట్టసభల్లో అడుగుపెట్టానే చినరాజప్ప ఆకాంక్ష నెరవేరేందుకు రెండు దశాబ్దాల పాటు ఓపికగా నిరీక్షించాల్సి వచ్చింది. 2007 నుంచి 2013 వరకు ఎమ్మెల్సీగా బాధ్యతలను ఎంతో చక్కడా నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు జిల్లాలోని మెట్ట ప్రాంతమైన పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసిన చినరాజప్ప భారీ మెజార్టీతో విజయం సాధించారు. తొలి నుంచి చినరాజప్ప పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నారు. నవ్యాంధ్ర తొలి ప్రభుత్వంలో చంద్రబాబు కేబినెట్ లో చినరాజప్పను కీలకమైన ఉప ఉఖ్యమంత్రి, హోంమంత్రి, విపత్తు నివారణశాఖ మంత్రి పదవులు వరించాయి. ఎన్టీరామారావు పిలుపుతో టీడీపీ ఆవిర్భావం నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన చినరాజప్ప ఇప్పటికీ ఆ పార్టీకి వీర విధేయుడి కొనసాగుతుండడం విశేషం. 2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైనప్పటికీ చినరాజప్ప విజయం సాధించడానికి ఆయన కృషి, పట్టుదల, నిబద్ధత, అజాతశత్రువుగా ప్రజల్లో సంపాదించుకున్న ప్రేమాభిమానాలే కారణం అంటారు.

ఎంతటి అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నప్పటికీ ప్రస్తుత సీఎం అనాలోచిత నిర్ణయాలపై నిప్పులు చెరుగుతూనే ఉంటారు చినరాజప్ప. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ తీసుకునే అనాలోచిత నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటారు. అధికార పార్టీ నేతలు టీడీపీపై బురదజల్లేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ చినరాజప్ప తమ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని విరుచుకుపడుతూనే ఉంటారు. కరోనా సమయంలో బాధితులను పట్టించుకోని వైసీపీ సర్కార్ తీరును, సీఎం జగన్ వ్యవహారాన్ని తూర్పారపట్టారు.

By
en-us Political News

  
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.