ఆజాద్ కు టీ-కాంగ్రెస్ ఎంపీల హెచ్చరిక
Publish Date:Mar 28, 2012
Advertisement
న్యూఢిల్లీ: లోక్ సభ సజావుగా సాగడానికి సహకరించాలని తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చేసిన సూచనను తాము తిరస్కరించామని, ఇక ముందు కూడా తిరస్కరిస్తామని, తెలంగాణపై స్పష్టమైన హామీ వచ్చే వరకు లోక్ సభ సమావేశాలను అడ్డుకుంటామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు చెప్పారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని బలరాం నాయక్ విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు దురదృష్టకరమైన పరిణామమని సిరిసిల్ల రాజయ్య అన్నారు. తాము ఆజాద్ మాట వినకుండా లోక్ సభను స్తంభింపజేశామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమైక్యవాదులు అడ్డుపడవద్దని, అలా అడ్డుపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు. తెలంగాణను సాధించే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు వద్దని, పోరాడి తెలంగాణను సాధించుకుందామని ఆయన యువతకు పిలుపునిచ్చారు.
రేపు మరోసారి తమతో మాట్లాడుతామని ఆజాద్ చెప్పారని రాజయ్య అన్నారు. అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గ్రూపులు, సబ్ గ్రూపులు ఏర్పాటు చేసి కాంగ్రెసు పార్టీని బలహీనపరుస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశం మరుగునపడిందని, రెండు సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, కానీ అలా జరగలేదని ఆయన అన్నారు. తెలంగాణపై వాయిదాలు పెడుతున్నారని, వాయిదాలు పెడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం లేదని, దీంతో కాంగ్రెసుపై నమ్మకం సన్నగిల్లుతోందని, అందుకే ఆరు స్థానాల్లో కూడా కాంగ్రెసు ఓడిపోయిందని మందా జగన్నాథం అన్నారు. తెలంగాణపై తేల్చే వరకు పార్లమెంటును స్తంభింపజేస్తామని ఆయన చెప్పారు.
http://www.teluguone.com/news/content/newdelhi-24-12965.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





