జగన్ కాక్రోచ్ అయితే జనం ‘హిట్’ అవుతారు!

Publish Date:Jun 12, 2026

Advertisement

నలుగురికి నచ్చినది
నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది
ఆ రూట్లో నే నడిచెదరో

ఇది ఒక సినిమాలో పాట.. ఇప్పుడీ పాట ప్రస్తావన ఎందుకంటే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మెగా డీఎస్సీని తన హయాంలో ఇచ్చిన సచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్ తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు, ఏపీలో తానే కాక్రోచ్ ని అవుతానన్న మాటలూ చూస్తుంటే... ఆయన రూటే సెపరేటు అని నెటిజనులు ఎద్దెవా చేస్తున్నారు. నలుగురికి అవసరమైనది కాకుండా, ఆయనకు ఏది తోస్తే అది చేస్తారనీ, ఎది అనిపిస్తే అది మాట్లాడతారని అంటున్నారు.  2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ  కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన   శైలిలో  ఇసుమంతైనా మార్పు రాలేదు.   ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.  ఆయన మీడియా సమావేశంలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా.. క్షేత్రస్థాయి వాస్తవాలకు పట్టించుకోకుండా.. ఆవు కథలాంటి ఊకదంపుడు ప్రసంగం చేసి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.  

తెలుగుదేశం కూటమి   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  మెగా డీఎస్సీ పై ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి పాత పల్లవినే వినిపించారు. ఇప్పటికే ఈ నియామకాలు పూర్తై..  అభ్యర్థులు  విధుల్లో చేరినప్పటికీ.. పాతచింతకాయ పచ్చడి లాంటి ధోరణిలోనే జగన్  ఆరోపణలు గుప్పించడంపై సొంత పార్టీ నేతలలోనే ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  ఎందుకంటే డీఎస్సీ  నియామక ప్రక్రియకు సంబంధించి గతంలో జగన్, వైసీపీ చేసిన ఆరోపణలపై  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం   పబ్లిక్ డొమైన్‌లో సాక్ష్యాధారాలతో సహా స్పష్టమైన వివరణ  ఇచ్చింది. అయినప్పటికీ జగన్ పాత ధోరణిలోనే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా గతంలో చేసిన ఆరోపణలే మళ్లీ చేయడం గమనార్హం. 

 ఇక జగన్ యువతను ఉద్దేశించి  చేసిన కొన్ని వ్యాఖ్యలపై రాజకీయవర్గాలలోనే విస్మయం వ్యక్తం అవుతున్నది.  నిరుద్యోగ యువత తిరగబడుతుందంటూ.. ఆయన  "ఇది జెన్-జీ , జెన్-ఆల్ఫా, రాష్ట్రంలో కాక్రోచ్‌లు లేస్తాయి.. తాను కూడా కాక్రోచ్ నే అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనను నవ్వుల పాటు చేశాయి. నెటిజనులైతే జగన్ వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. జగన్ కాక్రోచ్ అయితే జనం ‘హిట్’ అవుతారు అంటూ బొద్దింకలను హిట్ నిర్మూలించినట్లే.. జనం జగన్ ను ఛీ కొడతారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అన్నిటికీ మించి రాజకీయవర్గాలలో జగన్ పరిపక్వతపైనే సందేహాలు వ్యక్తమయ్యేలా ఆయన కాక్రోచ్ వ్యాఖ్యలు ఉన్నాయి.  

వ్యవస్థలపై కనీస అవగాహన లేకుండా..  కేవలం  ప్రభుత్వాన్ని దూషించడమే పరమావధిగా పెట్టుకుంటే.. జగన్ ను జనం మరింత దూరం పెట్టడం ఖాయమని పరిశీలుకులు అంటున్నారు.  తన ఐదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలురపాలనలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అప్పట్లో అధినేత విధానాలను గుడ్డిగా సమర్థించిన కీలక నేతలు ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పార్టీ నుంచి ముఖ్య నేతలు వరుసగా వలసలు పోతుంటే, ఉన్నవారైనా వాస్తవ పరిస్థితులను అధినేతకు వివరించే ధైర్యం చేయలేకపోతున్నారు. తప్పులను తెలుసుకుని సరిదిద్దుకునే నైజం ఆ పార్టీ లీడర్‌షిప్‌లో లోపించిందనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

తాజా ప్రెస్‌మీట్‌తో వైసీపీ శ్రేణులకు మరియు మిగిలిన నాయకులకు తమ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా ఇదే పంథాను నమ్ముకుని వెళ్తే రాజకీయంగా మరింత నష్టపోవడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ప్రజల నాడిని పసిగట్టడంలో విఫలమవుతున్న వైఖరిని గమనించిన తర్వాత, సొంత పార్టీ నేతల్లోనే అంతర్మథనం మొదలైనట్లు సమాచారం. తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు వైసీపీ నేతలు ఇప్పటికైనా ఒక నిశ్చయానికి రావడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.

రాబోయే రోజుల్లో ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ఎంతవరకు నష్టం చేకూరుస్తాయో వేచి చూడాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాకుండా, కేవలం ఊహాజనిత ఆరోపణలతో కాలం గడిపితే ప్రజల్లో ఉన్న కనీస ఆదరణ కూడా కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. రాబోయే కాలంలోనైనా వైసీపీ అధినాయకత్వం ప్రజా క్షేత్రంలోని వాస్తవాలను గ్రహించి ప్రవర్తిస్తుందా లేదా అనే అంశంపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటున్నారు పరిశీలకులు.

By
en-us Political News

  
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.