Publish Date:Aug 12, 2022
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో.. తెలుగు రాష్ట్రాల్లో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనిపై ఎంపీ గోరంట్ల మాధవ్ చెబుతున్న మాటలు.. ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటికి రెండు సార్లు మీడియాతో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేకుండా ఉన్నాయని జనం అభిప్రాయపడుతున్నారు.
అలాగే వారి మాటల్లోని తేడాను సామాజిక మాధ్యమం సాక్షిగా నెటిజన్లు ఏకి పడేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఈటెలలాంటి ప్రశ్నలు సంధిస్తూ వైసీపీపి ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఈ వ్యవహారంలో వైసీపీ సర్కార్ లోని ఇద్దరు మహిళా మంత్రులూ కూడా గోరంట్లకు మద్దతుగా మాట్లాడటంతో నెటిజన్లు ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. అయినా జగన్ సర్కార్, వైసీపీ పార్టీ అంతా నాఇష్టం.. ఏం చేసినా అడిగేదెవరు అన్న రీతిలో వ్యవహరిస్తోంది. అయితే ఇక గోరంట్ల వ్యవహారంలో ఇక ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంలో కేంద్ర పెద్దలకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసిందని హస్తిన నుంచి అందుతున్న సమాచారం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ జస్పీర్ సింగ్ గిల్ ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
ప్రధానికీ, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూ లేఖలు రాశారు. అక్కడితో ఆగకుండా గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కారణంగా ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అని అందరూ అనుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభమైన పార్లమెంట్లో ఇటువంటి వ్యక్తులు అడుగు పెట్టడానికి అనర్హులని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారని అంటున్నారు. ఈ వీడియో వ్యవహారంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ గిల్ కోరారని అంటున్నారు.
ఎంపీ గిల్ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పిందించి, న్యూఢ్ వీడియో కాల్ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ లేఖ రాసినట్లు తెలిసింది. అలాగే ఈ వ్యవహారంపై స్వతంత్ర్య దర్యాప్తు జరిపి.. సాధ్యమైనంత త్వరగా మహిళా కమిషన్కు నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి రేఖా శర్మ లేఖ రాశారు. దీంతో జగన్ ప్రభుత్వం తమ పార్టీ ఎంపీ అని చూసీ చూడనట్లు ఊరుకుందామనుకున్నా.. ఎదురుదాడితో ఈ వ్యవహారంలో విపక్షాల నోరు నొక్కుద్దామనుకున్నా ఇక వీలయ్యే అవకాశం లేదు. సాంకేతికంగా వీడియో ఒరిజనలా, ఫేకా అని తేల్చడం సాధ్యం కాదంటూ అనంతపురం ఎస్పీతో ప్రభుత్వం చెప్పించినా.. కేంద్రం తలచుకుంటే ఎస్పీ మాటల డొల్ల తనం కూడా వెల్లడైపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం న్యూడ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని నిగ్గు తేల్చాని బావిస్తే వైసీపీ బుకాయింపులకు అవకాశం ఉండదని పరిశీలకులు అంటున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీకి, జగన్ సర్కార్ లో మాధవ్ కు మద్దతుగా మాట్లాడిన వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/national-women-comission-orders-indipendent-probe-into-gorantla-nude-video-issue-25-141798.html
దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు, ఒకప్పటి టీడీపీ కంచుకోటగా వున్న సూళ్లూరుపేటలో సంచలన విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికలలో ఇప్పటి వరకూ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ తమ మద్దతు ఫలానా పార్టీకి, ఫలానా అభ్యర్థికి అంటూ బాహాటంగా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరి ఆ పార్టీకి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
మళ్ళీ జగన్ అధికారంలోకి రావడం అనేది అసంభవం. అయినప్పటికీ ఇంకా చాలా కొద్దిమంది జగన్ మాయలో వుండే అవకాశం వుంది. వాళ్ళు మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడేమో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రముఖులను ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేయడం సాధారణమైపోయింది.
జగన్ నోట ఓటమి మాట వచ్చేసింది. ఔను ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోంది. తనను అడ్డుకోవడానికి వాళ్లు సొమ్ములు నిలిపివేస్తున్నారు. అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు అంటూ జగన్ మాట్లాడారు.
వీళ్ళకి అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వున్నప్పుడు బెయిల్ కోసం జగన్ ఎవరి కాళ్ళ బేరానికి వెళ్ళాడో, గత పదేళ్ళుగా ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో అందరికీ తెలిసిందే. కనీసం కోర్టు హియరింగ్కి కూడా హాజరు కాకుండా హాయిగా తిరుగుతున్నాడు.
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అడ్డు ఎవరు వచ్చినా వారిని టార్గెట్ చేయడం ఆనవాయితీ. స్వంత బాబాయి వివేకానందరెడ్డి హత్య చేసినట్టు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్వంత బాబాయిని హత్య చేయించిన ఘనుడు జగన్ అని చెల్లెలు వైఎస్ షర్మిల విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆమెను చిక్కులు తెచ్చి పెట్టింది.
ఉత్తరాంధ్రలో అధికార వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నది. ఈ ప్రాంతంలోని మూడు జిల్లాలలోనూ వైసీపీ అభ్యర్థులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విశాఖలో అయితే ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గత ఎన్నికలలో వైసీపీ నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. ఆ జిల్లాలోని మొత్తం పదికి పది అసెంబ్లీ స్థానాలలోనూ విజయకేతనం ఎగుర వేసింది. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి వైసీపీ పరిస్థితి జిల్లాలో పూర్తిగా దిగజారింది. పరిశీలకుల విశ్లేషణలైతే జిల్లాలో గత ఎన్నికలలో వచ్చిన ఫలితం ఈ సారి రివర్స్ అయినా ఆశ్చర్యం లేదన్నట్లుగా సాగుతున్నాయి.
తమకంటే వేరే ఎవరూ గొప్పగా, ఛరిష్మా కలిగిన వ్యక్తుల్లా వుండటం ఇష్టం వుండదు. అలా ఎవరికైనా తనకంటే ఎక్కువ ఛరిష్మా వుంటే, అలాంటి వాళ్ళని తన కాళ్ళ దగ్గరకి రప్పించుకుంటాడు.
సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 93 నియోజకవర్గాలలో ఈ విడతలో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాటు చేసింది.
జనసేనాని పవన్ కల్యాణ్ కు పిఠాపురంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని పరిశీలకులు నియోజకవర్గ పరిస్థితులను ఉటంకిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. మరో వైపు పవన్ కల్యాణ్ ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ దాడులకు పాల్పడుతూ తన పరపతిని మరింత దిగజార్చుకుంటోంది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం (మే7) ఉదయం శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్ లో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులను డైరెక్ట్ లైన్ ద్వారా అనుమతిస్తున్నారు.