ఈ సన్నని సముద్ర మార్గాలు.. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రాణవాయువు!

Publish Date:Apr 16, 2026

Advertisement

ప్రపంచవ్యాప్తంగా జరిగే వాణిజ్యంలో సింహభాగం అంటే దాదాపు 80 శాతం పైగా సముద్ర మార్గాల ద్వారానే సాగుతోంది. అయితే, భూగోళంపై ఉండే కొన్ని అత్యంత ఇరుకైన సముద్ర మార్గాలు.. వాటిలో చోక్ పాయింట్స్ అంటారు. ఆ చోక్ పాయింట్లే ఇప్పుడు  ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మార్గాల్లో తలెత్తే అతిచిన్న   లోపం లేదా యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసే  ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా అమెరికా ప్రాబల్యం ఎక్కువగా ఉండే పానామా కాలువ ఆసియా, అమెరికా మధ్య వాణిజ్యానికి వెన్నెముక వంటిది. అయితే వాతావరణ మార్పుల వల్ల నీటి మట్టం తగ్గడం ఇక్కడ ప్రధాన సవాలుగా మారింది. మరోవైపు..  యూరోప్ మరియు ఆసియా ఖండాలను కలిపే సూయజ్ కాలువ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

గతంలో జరిగిన  ఎవర్ గివెన్ నౌక ప్రమాదం ప్రపంచానికి ఒక హెచ్చరికగా నిలిచింది. చైనాకు అత్యంత కీలకమైన మలక్కా జలసంధి ప్రస్తుతం అగ్రరాజ్యాల మధ్య వ్యూహాత్మక పోరాట కేంద్రంగా మారింది. తన ఇంధన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఆధారపడే చైనా, అక్కడ పట్టు సాధించేందుకు దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. ఇక ప్రపంచ చమురు సరఫరాను శాసించే హార్ముజ్ జలసంధి ఎప్పుడూ యుద్ధ మేఘాల మధ్యే ఉంటుంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇక్కడ ఇంధన ధరలను ప్రభావితం చేస్తున్నాయి.ఇటీవలి కాలంలో బాబ్ ఎల్-మందెబ్ మార్గంలో హౌతీ రెబల్స్ దాడుల కారణంగా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఇ

ది కేవలం ప్రాంతీయ పోరాటం మాత్రమే కాదు.. అంతర్జాతీయ సరఫరా గొలుసును దెబ్బతీసే చర్యగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో టర్కీ జలసంధులు  బోస్పరస్, డార్డనెల్స్ ప్రపంచ ఆహార భద్రతలో.. ముఖ్యంగా గోధుమల రవాణాలో కీలక పాత్ర పోషి స్తున్నాయి.భవిష్యత్తులో ఈ 'చోక్ పాయింట్ల పై నియంత్రణ సాధించే దేశాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అవకాశం ఉంది. చమురు ధరల నుంచి స్టాక్ మార్కెట్ల వరకు ప్రతిదీ ఈ మార్గాల భద్రతపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే అగ్రరాజ్యాలు తమ నౌకాదళాలను ఈ ప్రాంతాల్లో మోహరిస్తూ..  ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ సన్నని సముద్ర మార్గాలే ఆధునిక ప్రపంచ ఆర్థిక యుద్ధరంగాలని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

- సీతారాం కంఠమనేని

By
en-us Political News

  
 దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భాగ్యనగరంలో పర్యటించారు
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో సహకరించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.
నేపాలీ పనిమనిషి కల్పన హత్యానంతరం నాగపూర్ రైలెక్కి పారిపోతూ, మార్గమధ్యంలోనే దిగిపోయిన పోలీసులకు టోకరా ఇచ్చింది.
గుజరాత్‌తో సమానంగా తెలంగాణకు నిధులు ఇస్తామని ప్రధాని మోదీ అన్నారు
తెలంగాణ పర్యటనలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
త‌మిళ మార్కు ద్ర‌విడ సంప్ర‌దాయాల‌కు టీవీకే విజ‌య్ చెక్ పెట్టేశారా?
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దళపతి విజయ్‌కు ప్రముఖ హీరోయిన్ త్రిష శుభాకాంక్షలు తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ నగరం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో హై అలర్ట్‌లోకి వెళ్లింది.
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌పై ఫైలుపై తన మొట్టమొదటి సంతకాన్ని చేశారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.
చెన్నై నగరం ఆదివారం ఉదయం నుంచి రాజకీయ, సినీ వర్గాల కదలికలతో కిక్కిరిసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.