సూపర్ పవర్ సంతోష్! కేటీఆర్, కవిత నారాజ్!   

Publish Date:Mar 3, 2021

Advertisement

రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకం సచివాలయం. ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంవోనే సూపర్ పవర్. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలన్ని సీఎంవోలోనే  ఫైనల్ అవుతుంటాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ తర్వాత పవర్ సెంటర్ ఎవరిదీ అంటే అంతా మంత్రి కేటీఆరే పేరే చెబుతారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆరే.. పాలనలోనూ చక్రం తిప్పుతున్నారని అనుకుంటున్నారు. సీఎంవోలో ఆయన చెప్పిందే వేదమని భావిస్తుంటారు. అయితే అసలు సంగతి మాత్రం విస్తుపోయేలా ఉంది. ప్రస్తుతం తెలంగాణ సీఎంవోలో అంతా ఎంపీ సంతోష్ కుమార్ హవానే సాగుతుందని తెలుస్తోంది. 

సీఎం కేసీఆర్ ను ఎవరూ కలవాలన్నా ముందు సంతోష్ ను ప్రస్ననం చేసుకోవాల్సిందేనట. కేసీఆర్ ఫాంహౌజ్ లోకి సంతోష్ కు తప్ప ఎవరికి ఎంట్రీ లేదని తెలుస్తోంది. ఫామ్ హౌజ్ లోకి మంత్రి కేటీఆర్ , కవిత వెళ్లాలన్న ముందు సంతోష్ ఓకే చేస్తేనే సాధ్యమవుతుందనే చర్చ తెలంగాణ భవన్ లోనే జరుగుతుంది. కేటీఆర్, కవితకే అలా ఉంటే... మిగితా టీఆర్ఎస్ నేతల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. కేసీఆర్ వ్యక్తిగత విషయాలతో పాటు పాలనా పరమైన అంశాల్లోనూ ఇప్పుడు సంతోష్ కీలకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. రాష్ట్ర ఇంటలిజెన్స్ అధికారులు సైతం తమ నివేదికలను సంతోష్ కే ఇస్తున్నారని తెలుస్తోంది. రోజువారి నిఘా వర్గాల వివరాలు కూడా సంతోష్ కు వెళుతున్నాయంటే ఆయన పవర్ ఏ రేంజ్ లో ఉందో ఊహించవచ్చు.  

టీఆర్ఎస్ తో పాటు ప్రభుత్వంలో సంతోష్ పవర్ ఫుల్ సెంటర్ గా మారిపోయారనే చర్చ కొంత కాలంగా జరుగుతోంది. అందుకే కేసీఆర్ కలవాలనుకునే నేతలు..  మంత్రులైనా సరే ముందు సంతోష్ ను బతిమాలిడుకోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. సీఎంవోలో ప్రస్తుతం సీఎం కేసీఆర్ కు మాజీ సీఎస్ రాజీవ్ శర్మ, సీనియర్ ఐఏఎస్ నర్సింగ్ రావు సలహాదారులుగా ఉంటూ కీలకంగా ఉన్నారు. వారితో పాటు మరికొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉన్నారు. వీళ్లతో పాటు సీఎంవోలో ప్రస్తుతం సంతోష్ టీమ్ కూడా పని చేస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో సీఎం కేసీఆర్ పర్యటనలు, ఆయన వ్యక్తిగత నిర్ణయాల వరకే సంతోష్ కుమార్ చూసేవారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు ఉండేవారు. అయితే రాజ్యసభకు పంపించాక ఆయనలో మార్పు వచ్చిందంటారు. ఇప్పుడు కేసీఆర్ కార్యక్రమాలు చూడటంతో పాటు పార్టీ, ప్రభుత్వ  పాలనా వ్యవహరాల్లోనూ సంతోష్ సర్వస్యం అయ్యారని తెలుస్తోంది. 

గతంలో ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ లు పోస్టింగులు, ప్రమోషన్ల కోసం కేటీఆర్ ను కలిసివారు.. ఇప్పుడు వాళ్లంతా సంతోష్ దగ్గరకు వెళుతున్నారట. ఉద్యోగ సంఘాలు కూడా సంతోష్ ను పవర్ సెంటర్ గా చూస్తున్నాయని తెలుస్తోంది. ప్రమోషన్లు, బదిలీల కోసం కేటీఆర్ తో పాటు సంతోష్ కు కలుస్తున్నారనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మంత్రి కేటీఆర్ చుట్టూనే తిరిగేవారు. తమకు ప్రభుత్వం నుంచి ఏ సాయం కావాలన్నా, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు రావాలన్నా, సర్కార్ నుంచి రాయితీలు అడగాలన్నా అందరూ కేటీఆర్ దగ్గరకే వచ్చేవారు. కాని ఇప్పుడు కొందరు వ్యాపార, సినీ ప్రముఖులు ఎంపీ సంతోష్ ను  ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు.

ఎంపీ  సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కూడా ఆయనకు బాగా ఉపకరిస్తుందని చెబుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సినీ, వ్యాపర దిగ్గజాలతో సంతోష్ కు పరిచయాలు పెరిగాయని, దీంతో ఆయన ఇమేజీ కూడా పెరిగిందనే చర్చ జరుగుతోంది. మీడియాను కూడా సంతోష్ మ్యానేజ్ చేస్తున్నారని, అందుకే ఆయన కార్యక్రమాలకు మంచి కవరేజ్ లభిస్తుందని చెబుతున్నారు. మొత్తానికి సంతోష్ కేసీఆర్ సీఎంవోలో పవర్ ఫుల్ కావడంపై టీఆర్ఎస్ వర్గాల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతుందని తెలుస్తోంది. కేటీఆర్ వర్గం కూడా ఈ పరిణామాలపై అసహనంగా ఉన్నారని చెబుతున్నారు. సంతోష్ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతుండటంతో... భవిష్యత్ లో కేటీఆర్ కు గండంగా మారవచ్చనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.