ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఏ మంత్రికి లేని అధికారాలు ఆయనకే ఉన్నాయని.. సాక్షాత్తు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు కూడా ఆయనకే రిపోర్ట్ చేస్తారని గుసగుసలు వినిపిస్తాయి. అయన కనుసన్నలలోనే రాష్ట్ర హోమ్ శాఖ పని చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటాయి. అయన మరెవరూ కాదు సీఎం జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి.
తాజాగా సజ్జల రామకృష్ణ రెడ్డి గారిపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవీ హర్షకుమార్ విరుచుకుపడ్డారు. "ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడండీ? మరీ ఓవరేక్షన్ ఎక్కువైంది. అయ్యా మినిస్టర్లూ మీరు కొంచెం ఆత్మగౌరవంతో బతకండి. ఎందుకు ఈ వెధవ పదవులు. కనీసం మీలో ఒక్కడికి కూడా సీఎం జగన్ అప్పాయింట్మెంట్ ఇవ్వడు. అన్ని వ్యవహారాలపై సజ్జలతోనే మాట్లాడి, సజ్జలతోనే మీడియా సమావేశాలు నిర్వహిస్తాడు. ఎందుకు మీకు ఈ వెధవ బతుకులు, కొద్దిగానైనా గౌరవం పెంచుకోండి" అని మాజీ ఎంపీ, రాష్ట్ర మంత్రులను హర్షకుమార్ ఎద్దేవా చేశారు.
ఫేస్బుక్ లైవ్లో మాట్లాడిన హర్షకుమార్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఆయన సలహాదారుల గురించి ప్రజలకు తెలిసేది కాదన్నారు. అప్పట్లో సీఎం ముఖ్య సలహాదారు కేవీపీ రామచంద్రరావుతో సహా అందరూ వెళ్లేవారు. అయితే అన్ని విషయాలు కేవీపీతో చర్చించిన తర్వాతే వైఎస్ ఫైనల్ గా నిర్ణయం తీసుకునేవారన్నారు. అయితే కేవీపీప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వ విధానాలను ఎపుడు బయటకు చెప్పేవారు కాదని చెప్పారు. కానీ ఈ సజ్జల ఎవరండీ బాబు, ప్రజల డబ్బు తింటూ.. ప్రభుత్వ విధానాలను ప్రకటిస్తాడు.. ప్రతిపక్షనేతలను విమర్శిస్తాడూ అని హర్షకుమార్ మండి పడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cong-leader-harsha-kumar-hot-comments-on-sajjala-ramkrishna-reddy-39-111020.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.