గల్లా దూకుడుకు చింతా కళ్ళెం
Publish Date:Mar 29, 2012
Advertisement
చిత్తూరుజిల్లాలో గల్లా అరుణకుమారి దూకుడుకు ఎంపి డాక్టర్ చింతా మోహన్ కళ్ళెం వేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఏకు మేకైన గల్లా అరుణకుమారి ఒకవేళ తన కొడుకు గల్లా జయదేవ్ కు తిరుపతి టిక్కెట్ ఇప్పిస్తే జిల్లాలో వారి ఆధిపత్యానికి తిరుగు ఉండదని చింతా మోహన్ కలవరపడుతున్నట్లు తెలిసింది. దీంతో ఆయన గల్లా జయదేవ్ కు టిక్కెట్ రాకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఆయన గల్లా కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. గల్లా అరుణకుమారి కుటుంబానికి చెందిన అమరరాజా ఫ్యాక్టరీల కోసం అటవీ భూములను ఆక్రమించుకున్నారని, కొండలను తోలిచేసి అక్కడ శాశ్వత కట్టడాలు కట్టారని, పలు గ్రామాలకు రహదారులు లేకుండా చేశారని, చింతా మోహన్ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ఆయన పార్టీ అధిష్టానానికి కూడా పంపి ఇటువంటి కుటుంబానికి టిక్కెట్ ఇస్తే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల జిల్లాలోని రైతాంగం గల్లా కుటుంబానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనల వార్తలు, ఫోటోల క్లిప్పింగులను కూడా ఆయన పార్టీ అధిష్టానానికి పంపినట్లు తెలిసింది. చింతా మోహన్ చర్యలతో గల్లా కొంత కలవరపాటుకు గురయినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/mp-drchinta-mohan-24-12994.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





