పెదరత్తయ్య రాకపై 'దేశం'లో కలవరం
Publish Date:Mar 29, 2012
Advertisement
మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ వస్తున్నా వార్తలు జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో గల ఆయన వ్యతిరేక వర్గం తీవ్ర ఆందోళన చెందుతోంది. గతంలో పెదరత్తయ్య వల్ల నష్టపోయిన ఈ వర్గం ఇప్పుడు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పెదరత్తయ్యను తిరిగి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే సహించేది లేదని ఆయన వ్యతిరేక వర్గీయులు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. గుంటూరులో మాకినేని పెదరత్తయ్య దిష్టిబొమ్మను సైతం దగ్ధం చేశారు. అయితే పెదరత్తయ్య తెలుగుదేశం పార్టీలో చేరితే తిరిగి జిల్లాలో పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడుతుందని ఆయన వర్గీయులు అంటున్నారు. 2009లో ప్రత్తిపాడు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు సీటుగా మారిపోవటం, అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పెదరత్తయ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన అక్కడ కూడా ఎక్కువకాలం నిలువలేకపోయారు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నించారు. పెదరత్తయ్య అభ్యర్థనను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మన్నించినప్పటికీ జిల్లాలోని ఆయన వ్యతిరేక వర్గీయులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అయితే పెదరత్తయ్య తెలుగుదేశం పార్టీలో చేరడంవల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది వుండబోదని ఆయన వర్గీయులు భరోసా ఇస్తున్నారు. ఎంపి మోదుగుల ఎన్నికలకు రెండునెలల ముందు తెలుగుదేశం పార్టీలో చేరితే పార్టీ ఆయనకు టిక్కెట్ ఇచ్చి ఆదరించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుని తిట్టిన దేవేందర్ గౌడ్ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించలేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/exminister-makineni-pedarattaiah-24-12993.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





