Publish Date:Jun 19, 2022
మచిలీపట్నం లోక్సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని.. స్వపక్షంలోనే విపక్షంగా తయారైన ఎమ్మెల్యే పేర్ని నానికి ఝలక్ ఇచ్చారని బందరు వైసీపీ శ్రేణుల్లో ఒక చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల బందరులో ఎంపీ బాలశౌరి పర్యటన.. ఈ సందర్భంగా పేర్ని నాని ప్రధాన అనుచరుడి హంగామా ఎపిసోడ్ని వైసీపీ హైకమాండ్ చాలా సీరియస్గా తీసుకుందని తెలుస్తోంది. ఆ క్రమంలో ఈ పంచాయతీపై పేర్ని నాని.. పార్టీలో కీలక నేతలకు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా... వారు పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు.మాకంతా తెలుసు మీరు చెప్పాల్సిందీ, చెప్పుకోవలసిందీ ఏమీ లేదంటూ నానిని నోరెత్తనీయలేదని పార్టీ శ్రేణులో అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నాయి.
అయితే బందరులో తన పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అందుకు సంబంధించిన వీడియోను..వైసీపీ పెద్దలకు ఎంపీ బాలశౌరి చూపించినట్లు సమాచారం. అంతేకాకుండా.. మంత్రిగా ఉండగా.. పేర్ని నాని అవినీతికి జాబితాను సైతం బాలశౌరి వైసీపీ అగ్రనాయకత్వానికి అందజేసినట్లు చెబుతున్నారు. దీంతో సీఎం జగన్ సహా, పార్టీలోని కీలక నేతలకు ఇంత కాలం పేర్ని నానిపై ఉన్న సానుకూలత ఆవిరైపోయిందని అంటున్నారు. ఆ కారణంగానే ఎంపీ వల్లభనేని బాలశౌరి వర్గంలో జోష్ పెరిగిందని అంటున్నారు. మచిలీపట్నంలో బాలశౌరి పర్యటన సందర్భంగా సంభవించిన పరిణామాలన్నీ కూడా పేర్ని నాని ఆయన అనుచరవర్గం వల్లేననీ, జగన్ కు అవగతమయ్యేలా వివరించడంలో ఎంపీ విజయవంతం అయ్యారన్న టాక్ వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితోవల్లభనేని బాలశౌరికి ఉన్న అనుబంధం, సీఎం జగన్ తో ఉన్న వ్యాపార సంబంధం కూడా వైసీపీ హైకమాండ్ కు పేర్ని నాని పట్ల వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని బాలశౌరి.. బందరు పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను,ఈ మూడేళ్లలో జరిగిన పలు అంశాలను సీఎం జగన్కు ఉదాహరణలతో సహా వివరించారని అంటున్నారు. మంత్రి పదవి పోయిన తరువాత పేర్ని నాని అనుచరగణంలోని పలువురు బాలశౌరి పంచన చేరి, మాజీ మంత్రిగారి లొసుగులను అక్కడ చేరవేయడం వల్లే నాని బలహీన పడ్డారనీ, అధిష్ఠానం వద్ద పలుచన అయ్యారనీ కూడా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో సైలంట్ గా ఉండటమే మంచిదని పేర్ని పట్ల అంతో ఇంతో సానుకూలత ఉన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆయనకు సూచించారని అంటున్నారు. అందుకే పేర్ని నాని, ఆయన అనుచరగణం ప్రస్తుతం మౌనం వహించడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mp-balasouri-shock-to-perni-nani-25-137995.html
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.