మోడీ శకంలో తొలి కుంభకోణ రహిత సంవత్సరం

Publish Date:May 26, 2015

Advertisement

 

నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా నిన్న గుజరాత్ లోని మధుర పట్టణంలో ఒక భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో దేశ ప్రజలకు మంచి రోజులు వచ్చేయని కానీ గత 60 ఏళ్ళుగా దేశాన్ని దోచుకు తిన్న వాళ్ళకి చెడ్డ రోజులు మొదలయ్యాయని అన్నారు. గత పదేళ్ళుగా దేశంలో జరిగిన అనేక కుంభకోణాల గురించి వార్తలు వినబడేవని కానీ ఈ ఏడాది కాలంలో ఎటువంటి కుంభకోణాలు జరుగలేదని అదే తమ పారదర్శకమయిన పాలనకు నిదర్శనమని అన్నారు.

 

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డిల్లీలో పాతుకుపోయిన శక్తివంతమయిన అవినీతి కేంద్రాలను ఏరి పారేశామని తెలిపారు. తాను ఈ దేశానికి ప్రధాన సేవకుడిని, ప్రధాన ధర్మ కర్తనని మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బొగ్గు గనుల వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఖజానాలో జమా చేసామని తెలిపారు. ఇదివరకు కేంద్రప్రభుత్వం రూపాయి విడుదల చేస్తే అందులో కేవలం 15పైసలు మాత్రమే పేదప్రజలకు చేరేదని స్వయంగా మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అన్నారని కానీ తమ ప్రభుత్వం నూటికి నూరు పైసలు కూడా పేద వాడికే అందేలా ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

 

ప్రధాని మోడీ చెప్పిన మాటలు నూటికి నూరు శాతం వాస్తవమేనని ప్రజలు కూడా అంగీకరిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ప్రతీ నెలకీ రెండు నెలలకీ ఓమారు ఓ భారీ కుంభకోణం బయటపడుతుండేది. వాటిని కనిపెట్టి దోషులను కోర్టు ముందు ఉంచవలసిన సీబీఐ మాజీ డైరక్టర్ రంజిత్ సిన్హా కాంగ్రెస్ సేవలో తరించిపోవడం, అందుకు సుప్రీంకోర్టు ఆయనకు మొట్టికాయలు వేయడం అందరికీ తెలిసిందే. విమానాలు, హెలికాఫ్టర్లు కాంట్రాక్టులు సంపాదించుకొనేందుకు, డిల్లీలో కొంతమంది పెద్ద తలకాయలకు ముడుపులు చెల్లించామని విదేశీ సంస్థలు గొప్పగా చెప్పుకొన్నాయంటే డిల్లీలో అవినీతి ఎంతగా మేటలు వేసిందో అర్ధమవుతుంది.

 

అటువంటి అవినీతి సామ్రాజ్యాన్ని పునాదులతో సహా పెకలించడం కష్టమే. కానీ వాటిపై మోడీ ప్రభుత్వం ఉక్కు పాదం మోపినందునే అవిప్పుడు కనబడకుండా పోయాయి. అందుకే మోడీ ఏడాది పరిపాలనలో ఇంతవరకు ఒక్క కుంభకోణం కూడా జరగకుండా నిలువరించగలిగారు. మోడీ అధికారం చేప్పట్టిన ఏడాది కాలంలోనే ప్రపంచ దేశాలలో భారత్ కు ఒక ప్రత్యేక గుర్తింపును తేగలిగారు. అందుకు ఆయన ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్ధిక, పారిశ్రామిక, విదేశీ విధానాలే కారణమని చెప్పవచ్చును. చాలా వేగంగా తనదయిన శైలిలో దూసుకుపోతున్న మోడీ ప్రభుత్వ పని తీరు వలన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్, దానితో బాటు రాహుల్ గాంధీ భవిష్యత్ కూడా చాలా అగమ్యగోచరంగా, ప్రశ్నార్ధకంగా మారుతోంది. అందుకే తీవ్ర అభద్రతా భావంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మోడీ ధరించిన సూటు గురించి, ఆయన చేస్తున్న విదేశీ పర్యటనల గురించి మాట్లాడుతూ సామాన్య ప్రజలను త్రప్పు ద్రోవ పట్టించేందుకు చవకబారు ప్రయత్నాలు చేస్తోంది. కానీ దేశ ప్రజల నమ్మాకాన్ని వమ్ము చేసిన కాంగ్రెస్ పార్టీ మాటలను ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరు.

 

దేశాభివృద్ధి జరిగేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎవరూ తప్పు పట్టలేరు. కానీ భూసేకరణ చట్టానికి చేసిన సవరణల విషయంలో కాంగ్రెస్ వేస్తున్న ప్రశ్నలకు మోడీ ప్రభుత్వం సరయిన సమాధానం చెప్పలేకపోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బహుశః పారిశ్రామికీకరణ వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతోనే భూసేకరణ చట్టానికి సవరణలు చేసి ఉండవచ్చును. కానీ నేటికీ దేశంలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు కనుక వ్యవసాయ అభివృద్ధికి కూడా మోడీ ప్రభుత్వం అంతే ప్రాధాన్యత ఇచ్చి ఉండవలసిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

 

గత పదేళ్ళ కాంగ్రెస్ పాలనతో పోలిస్తే మోడీ పాలన చాలా సమర్ధంగా, వేగంగా, పారదర్శకంగా సాగుతోందని ప్రజలు కూడా అంగీకరిస్తున్నారు. కానీ అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి లభించి, వారి జీవన ప్రమాణాలు మెరుగవడమే ఎవరి పాలనకయినా గీటురాయిగా నిలుస్తుంది. మోడీ ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న చర్యల వలన సత్ఫలితాలు మున్ముందు విస్పష్టంగా కనబడే అవకాశం ఉంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.