రాహుల్ ఆలోచనా పరిమితికి అదే గొప్ప ఉదాహరణ

Publish Date:May 27, 2015

Advertisement

 

పదేళ్ళు దేశాన్ని, సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎన్నికల తరువాత మరింత దయనీయంగా మారింది. అటు కేంద్రంలో కానీ ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలోగానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి పార్టీని బయటపడేయాలంటే అందుకు మంచి సమర్దుడయిన నాయకుడిని ఎన్నుకోవలసి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో చాలా ఘోరంగా విఫలమయిన సోనియాగాంధీ, పార్టీ భవిష్యత్ కంటే కొడుకు రాజకీయ భవిష్యత్తే చాలా ముఖ్యమని భావిన్నారేమో తెలియదు. పుత్రవాత్సల్యంతో ఆమె తన కొడుకుకే పార్టీ పగ్గాలు కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీ అధినేతకుండే నాయకత్వ లక్షణాలు, రాజకీయ చతురత కూడా లేని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేప్పట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అందుకు ఆయనకున్న ఏకైక అర్హత ఏమిటంటే నెహ్రు కుటుంబ వారసత్వమే. ఆ విషయం గురించి ఇదివరకు ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు కూడా. పార్టీలో కొందరు సీనియర్ నేతలు రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలను చేప్పట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ‘రాహుల్ గాంధీ ఈ ఏడాదిలోనే పార్టీ పగ్గాలు చేపడతారని’ జైరామ్ రమేష్ వంటి సీనియర్ నేతలు ద్రువీకరిస్తున్నారు.

 

పార్టీ పగ్గాలు చేప్పట్టాలని ఉవ్విళ్ళూరుతున్న రాహుల్ గాంధీ అందుకు అవరోధాలు ఎదురవుతుంటే, వాటిని ఎదుర్కొని పరిష్కరించుకొని తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకొనే ప్రయత్నం చేసి ఉండి ఉంటే అందరూ హర్షించేవారు.నరేంద్ర మోడీ కూడా ఒకప్పుడు సరిగ్గా ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొని దైర్యంగా నిలబడి పోరాడి పార్టీపై పట్టు సాధించారు. నిజం చెప్పాలంటే ఆయన ఇప్పుడు రాహుల్ ఎదుర్కొంటున్న దాని కంటే చాలా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని, విజయం సాధించి తన నాయకత్వ లక్షణాలను, సమర్ధతను చాటుకొన్నారు. కానీ రాహుల్ గాంధీ అటువంటి ప్రయత్నాలేవీ చేయకుండా పార్టీ మీద అలిగి రెండు నెలల పాటు విదేశాలలో చక్కర్లు కొట్టివచ్చేరు. అప్పుడు మీడియా అడిగే ప్రశ్నలకు, ప్రతిపక్షాల అవహేళనతో కాంగ్రెస్ పార్టీ తలదించుకోవలసి వచ్చింది. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేందుకు తనను తాను సిద్దం చేసుకొనేందుకు, కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం చేసేందుకు అవసరమయిన భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేసుకొనేందుకే శలవు తీసుకొన్నారని పాపం సమర్దించుకోవలసివచ్చింది.

 

అదే నిజమనుకొన్నా ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరులో, అధికార బీజేపీపై చేస్తున్న విమర్శలలో కాంగ్రెస్ ట్రేడ్ మార్క్ కొట్టవచ్చినట్లు కనబడుతోంది తప్ప ఆయన రెండు నెలలు విదేశాలలో కొత్తగా నేర్చుకొని వచ్చిందేమీ కనబడటం లేదు. కాంగ్రెస్ పార్టీని సంస్కరించాలనుకొంటున్న ఆయన అది సాధ్యం కాదని గ్రహించారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు తనే కాంగ్రెస్ స్టైల్ కి మారిపోయారు. ఆయన ప్రతీ మాటలో ఇప్పుడు అచ్చమయిన కాంగ్రెస్ ట్రేడ్ మార్క్ విస్పష్టంగా కనిపిస్తోంది. కానీ నేటికీ పార్టీలో చాలా మంది సీనియర్లు ఆయనకు ఇంకా దూరంగా ఉండటం గమనిస్తే వారికి ఆయన నాయకత్వంపై ఏమాత్రం నమ్మకం ఏర్పడలేదనే విషయం అర్ధమవుతుంది.

 

అయినా రాహుల్ గాంధీ ఇదేమీ గమనించనట్లు పాదయాత్రలు చేసుకొంటూపోతున్నారు. ఆయన విదేశాల నుండి తిరిగి రాగానే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తన కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసి, పార్టీకి జవజీవాలు కల్పించే ప్రయత్నాలు చేసి ఉండి ఉంటే, ప్రజలలో, పార్టీ శ్రేణులలో ఆయనపై కొంచెం గురి కుదిరి ఉండేదేమో. కానీ ఆయన మోడీ సూటుపై తను చేసిన వ్యాఖ్యలు బాగా ప్రేలడంతో, దేశంలో మరే సమస్యలు లేవన్నట్లుగా  పదేపదే దాని గురించే ప్రస్తావిస్తూ తన అసమర్ధతను, ఆలోచనా పరిమితులను స్వయంగా చాటుకొంటున్నారు. మోడీ ఆ సూటును విడిచి చాలా కాలమే అయినప్పటికీ రాహుల్ గాంధీ మాత్రం ఇంకా దానినే పట్టుకొని వ్రేలాడుతున్నారని రాజకీయ నాయకులు ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు. 

 

ఒక ప్రాంతీయ పార్టీ అధినేతతో కూడా సరితూగలేని వ్యక్తి, తన సమర్ధతను నిరూపించుకొని అఖండ మెజార్టీతో కేంద్రంలో అధికారం చేప్పట్టి సువిశాలమయిన భారతదేశాన్ని ప్రగతి పధం వైపు నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి సున్నా మార్కులు వేస్తున్నట్లు గొప్పగా ప్రకటించినప్పుడు, ‘జీరో వాల్యూ ఉన్నవాళ్ళు జీరోలనే గుర్తించగలరు తప్ప అంతకంటే పెద్ద సంఖ్యలను గుర్తించలేరని’ వెంకయ్యనాయుడు చమత్కారంగా చెప్పిన చిన్న జవాబుతో మరింత నవ్వులపాలయ్యారు. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ రక్షిస్తారని ఎవరూ అత్యాశకు పోవడంలేదు. కానీ ఆయనని రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీని, దానిపైనే ఆధారపడిన లక్షలాది కార్యకర్తలను, నేతల జీవితాలను పణంగా పెట్టాల్సిన అవసరం ఉందా? అని కాంగ్రెస్ పార్టీయే ఆలోచించుకోవాలి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.