అధికారమే పరమావధిగా రాజకీయాలు

Publish Date:May 25, 2015

Advertisement

 

డిల్లీ, బీహార్, తమిళనాడులలో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. డిల్లీలో అఖండ మెజార్టీతో గెలిచిన ఆమాద్మీ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేయవలసివస్తోంది. ప్రధాన కార్యదర్శి తాత్కాలిక నియామకంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు మొదలయిన యుద్ధం, ఎన్డీయే ప్రభుత్వం గవర్నర్ కే పూర్తి అధికారాలున్నాయని నోటిఫికేషన్ జారీ చేయడంతో, ఇప్పుడది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి, ఎన్డీయే ప్రభుత్వానికి మధ్య యుద్ధంగా మారింది. దీనిపై చర్చించేందుకు 26, 27 తేదీలలో అత్యవసరంగా అసెంబ్లీని సమావేశపరుస్తున్నారు. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి రాష్ట్రపతికి పంపాలని ఆమాద్మీ ప్రభుత్వం భావిస్తోంది.

 

“ఇది రాజకీయ సమస్య ఎంత మాత్రం కాదని, రాజ్యాంగ సమస్య గనుకనే తాము కలుగజేసుకొని వివరణ ఇచ్చేమని, తద్వారా ఇకపై డిల్లీ ప్రభుత్వం సజావుగా పరిపాలన చేసుకోవచ్చని” ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కానీ అది తన ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేయడమేనని కేజ్రీవాల్ వాదన. ప్రస్తుతం తనకు జవాబుదారిగా ఉన్న అవినీతి నిరోధక శాఖను త్వరలోనే గవర్నర్ తన చేతుల్లోకి తీసుకొనే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తున్న వార్తలపై కేజ్రీవాల్ స్పందిస్తూ “అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న మా ప్రభుత్వాన్ని గవర్నర్ ద్వారా నియంత్రించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని” ఆరోపించారు.

 

ప్రభుత్వంలో వివిధ వ్యవస్థలను నడిపించే ఉన్నతాధికారులపై గవర్నర్ కి అధికారాలుంటాయా? లేక ప్రజలెన్నుకొన్న ప్రభుత్వానికా? అనేది రాజ్యాంగ నిపుణులు తేల్చాల్సిన విషయం. కానీ దాని కోసం అఖండ మెజార్టీతో ప్రజలెన్నుకొన్న మోడీ ప్రభుత్వం, ఆమాద్మీ ప్రభుత్వం పోరాడుకోవడం చాలా బాధాకరం.

 

ఇక ఈ ఏడాది చివరిలో జరుగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆరు జనతా పార్టీలు విలీనం అయ్యేయి. కానీ అధికారం కోసం తహతహలాడిపోతున్న లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ కారణంగా ఇంతవరకు విలీన ప్రక్రియ పూర్తి కాలేదు. పైగా వారిప్పుడు మెల్లగా విమర్శలు గుప్పించుకోవడం మొదలుపెట్టారు కూడా.

 

ప్రధానమంత్రి అయ్యేందుకు తనకు అర్హత లేదని పైకి చెప్పుకొనే నితీష్ కుమార్, అందుకోసం ఇదివరకు కూడా ఇటువంటి ప్రయోగాలకు సిద్దపడ్డారు. కానీ అవేవీ ఫలించకపోవడంతో ఇదివరకు తను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన జితన్ రామ్ మంజీని బలవంతంగా దింపేసి తను ఆ కుర్చీ ఎక్కారు. తమ జె.డి.యు. పార్టీని జనతా పరివార్ లో విలీనం చేయడానికి అంగీకరించినప్పటికీ తననే ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబట్టడంతో, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తహతహలాడిపోతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తన ఆర్.జే.డి.ని ఆ పేరులేని కొత్త పార్టీలో విలీనం చేయకుండా బిగుసుకు కూర్చొన్నారు. వారిద్దరూ చేస్తున్న రాజకీయాలతో కొత్త పార్టీని పుట్టక ముందే చంపేశారు.

 

ఇక అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా ప్రకటించినప్పటి నుండి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన పన్నీర్ సెల్వం, తన చేతిలో పూర్తి అధికారాలున్నప్పటికీ కేవలం సాధారణ పరిపాలనకే పరిమితమయ్యారు తప్ప ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. ఒకవేళ ఏదయినా కీలక నిర్ణయం తీసుకొన్నట్లయితే అది అమ్మ (జయలలిత) అధికారాలను ప్రశ్నించడం, ఆమెను ధిక్కరించడం, ఆమె పట్ల అవిధేయత ప్రదర్శించినట్లేననే భావన అధికార అన్నాడీయంకే పార్టీలో బలంగా నెలకొని ఉంది. అందుకే ప్రతిపక్ష పార్టీలు ఎంతగా విమర్శిస్తున్నా పట్టించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో సహా మంత్రులు అందరూ కూడా జయలలిత నామ స్మరణంలోనే గత 8 నెలలూ గడిపేశారు. వారందరికీ అందుకు తగ్గ ప్రతిఫలం దక్కింది కూడా. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన జయలలిత వారందరినీ తన మంత్రివర్గంలోకి మళ్ళీ తీసుకొన్నారు. ఇంతకాలంగా జయలలిత కోసం ఆయన పక్కన పెట్టి ఉంచిన అన్ని ఫైళ్ళ మీద ఆమె చకచకా సంతకాలు చేసేసారు.

 

మంత్రిగా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎదగడం సర్వసాధారణమయిన విషయమే. కానీ ఇంతకాలం ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్ సెల్వం ఇప్పుడు ఆర్దికమంత్రిగా చేయవలసిరావడం...అందుకు ఆయన ఏ మాత్రం సిగ్గుపడకపోవడం రెండూ కూడా విచిత్రమే. ఈ మూడు చోట్ల జరుగుతున్న రాజకీయ పరిణామాలు పైకి వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ వాటి అంతిమ గమ్యం మాత్రం అధికారం కోసం జరుగుతున్న ఆరాటం...పోరాటాలేనని చెప్పవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.