Publish Date:Sep 13, 2022
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి నిప్పులు చెరిగారు. నవ్యంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రకు ఆమె సంఘీ భావం ప్రకటించారు. అందు కోసం సోమవారం అమరావతి వచ్చిన ఆమె రైతులు కూర్చున్న ట్రాక్టర్ను స్వయంగా నడిపి.. పాదయాత్రలో పాల్గొన్న రైతులు, మహిళల్లో నయా జోష్ నింపారు.
అనంతరం రేణుకా చౌదరి ఓ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యలో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఓ ముర్ఖుడు అని అభివర్ణించారు. ఆయనకు పాలన చేతకాదన్నారు. ప్రజలతో ఎలా మాట్లాడాలో కూడా ఆయనకు తెలియదనీ, అసలు ఆయనకు ఎందుకు ఓట్లేశామా అని రాష్ట్ర ప్రజలు నిత్యం బాధపడుతున్నారని రేణుక అన్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు చాలా మంది తెలుసునని... వాళ్లను ఎప్పుడు పలకరించినా.. జగన్ ఎప్పుడు దిగి పోతాడా? అని ఎదురు చూస్తున్నామని చెబుతున్నారని రేణుకా చౌదరి పేర్కొన్నారు. రాజధాని అమరావతి రైతుల వెయ్యి రోజుల ఉద్యమం ఓ చరిత్రగా రేణుకా చౌదరి అభివర్ణించారు. అమరావతి రైతులకు మద్దతుగా న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర చేసినప్పుడు వచ్చానని.. అలాగే ఇప్పుడూ అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర చేస్తున్నారని.. వారికి మద్దతు చెప్పడానికి వచ్చానని.. మళ్లీ, మళ్లీ వస్తానని రేణుకా చౌదరి స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ ది మూర్ఖపు పాలన అన్న రేణుకా చౌదరి ఏపీ రాజధాని అమరావతేననీ, అది ఎక్కడికీ పోదని, అక్కడే ఉంటుందని అన్నారు. హైకోర్టు.. ప్రజలు.. రైతులకు అండగా ఉన్నారనీ, ఉంటారనీ రేణుక అన్నారు. మరి కొన్ని నెల్లలోనే జగన్ పాలన అంతమై పోతుందని... అనంతరం నిర్విఘ్నంగా అమరావతి నిర్మాణం సాగుతుందని ఆమె జోస్యం చెప్పారు.
మరోవైపు భారతీయ జనతా పార్టీపైనా సైతం రేణుకా చౌదరి విరుచుకుపడ్డారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారని.. ఈ ప్రాంతానికి అండగా ఉంటామని నాడు ఆయన చెప్పారని.. ఇప్పుడు ఆయన ఏమయ్యారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు అమరావతికి అండగా నిలుస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారని.. మరి గత మూడేళ్లుగా వీళ్లంతా కళ్లుమూసుకున్నారా? అని నిలదీశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-dont-know-how-to-rule-says-renuk-chaudary-25-143660.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.