మోగని మంత్రి గంటా
Publish Date:Sep 23, 2012
Advertisement
అనుకున్నట్లే అయింది. ఓడరేవు మంజూరులో విశాఖ జిల్లాకు అన్యాయం జరిగింది. నక్కపల్లిలో రెండో ఓడరేవు నిర్మిస్తారని విశాఖజిల్లావాసులు ఆశపడ్డారు. ఈ మేరకు కృషి చేస్తానని అనకాపల్లికి చెందిన మంత్రి గంటాశ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఏమి చూసుకుని ఈ హామీ ఇస్తున్నారని మంత్రిని తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా నాయకులు నిలదీశారు. అంతేకాకుండా వాస్తవం ఆయనకు అర్థం కావటం లేదని జిల్లా అభివృద్థి సమావేశాన్ని కూడా దేశం నేతలు బహిష్కరించారు. దీనితో పాటుగా తమ నిరసనను కూడా తెలియజేశారు. దీనికి తోడు వారు ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి మానుగుంట మహీధరరెడ్డి పట్టుదలగా రెండోఓడరేవు సాధిస్తారని కూడా అప్పట్లో తెలుగుదేశం నేతలు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వారు హెచ్చరించినట్లే మంత్రి గంటా హామీ నెరవేరలేదు. తెలుగుదేశం నేతలు చెప్పినట్లే మంత్రి మానుగుంటమహీధరరెడ్డి పట్టినపట్టుకు రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తలవొంచక తప్పలేదు. మహీధరరెడ్డి నియోజకవర్గంలోని రామాయపట్నంలో రెండో ఓడరేవు నిర్మించాలని సిఎం కిరణ్ షిప్పింగ్కార్పొరేషనుకు లేఖ రాశారు. దీంతో రాష్ట్రప్రభుత్వ పరంగా ఓ నిర్ణయానికి వచ్చారన్న సంకేతం షిప్పింగ్కార్పొరేషనుకు అందింది. కార్పొరేషను ఛైర్మన్ పి.మోహన్ మాట్లాడుతూ సిఎం ఖరారు పూర్తయినందున కేంద్ర కేబినెట్ ముందు ఈ విషయాన్ని ఉంచి అనుమతి పొందాక ఓడరేవు నిర్మిస్తామన్నారు. ఈ విషయం తెలిసిన విశాఖజిల్లా తెలుగుదేశం నేతలు మరోసారి తమ నిరసనను మంత్రి గంటాకు తెలియజేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ప్రకాశం జిల్లాలో నేతలు మాత్రం మానుగుంట కృషిని అభినందిస్తున్నారు. రెండో ఓడరేవు సాధించటం వల్ల వెనుకబడిన జిల్లాకు మరింత ఆర్థికప్రయోజనం ఓనగూరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/minister-ganta-srinivasa-rao--24-17593.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





