ఎస్సీ సంక్షేమ కమిటీకి దిశానిర్దేశం చేసిన స్పీకర్?
Publish Date:Sep 23, 2012
Advertisement
నిన్నటిదాకా అంటరానితనం...నేడేమో అత్యాచారాలు, బెదిరింపులు...వంటి పలు సంఘటనలు ఎదుర్కొంటున్న ఎస్సీ(షెడ్యూల్డుకులా)లు సంక్షేమం కోసం రాష్ట్రప్రభుత్వం శాసనసభ్యులతో కమిటీ నియమించింది. ఈ కమిటీి జిల్లాల్లో పర్యటించనున్నది. ఈ నేపథ్యంలో కమిటీలోని సభ్యులకు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ కమిటీ సేవలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ప్రతీచోటా పబ్లిక్హియరింగ్ పెట్టాలని సూచించారు. అర్జీలు తీసుకోవటమే కాకుండా అవసరమైతే అత్యాచారబాధితులను, సాక్షులను పిలిపించి మాట్లాడాలని కూడా కోరారు. ఎస్సీ ఉప ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం 11వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిపారు. ప్రజాప్రతినిధులు జిల్లాల్లోని సంక్షేమవసతిగృహాల్లోనే బస చేయాలని సూచించారు. వేదనభరితమైన పరిస్థితులు చక్కదిద్దేందుకు కమిటీ కృషి చేయాలన్నారు. కమిటీ ఛైర్మను అబ్బివెంకటస్వామి, మంత్రులు శ్రీధర్బాబు, శైలజానాధ్, ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క, డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ తదితరుల సమక్షంలో కమిటీ సభ్యులకు స్పీకర్ నాదెండ్ల క్లాసు పీకారు. రాష్ట్రానికే కీలకమైన కమిటీ ఇదంటూ స్పీకర్ చేసిన హడావుడి ఎస్సీ ఓట్లకు కాంగ్రెస్ పార్టీ వేసే గేలంలా ఉందని పలువురు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బిసి డిక్లరేషను ప్రకటించినందున కాంగ్రెస్ పార్టీ ఈ కమిటీ కార్యకలాపాలను సీరియస్గా తీసుకుంటున్నారట.
http://www.teluguone.com/news/content/-nadendla-manohar-24-17601.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





