మెగా హీరోకు భలే చౌక బేరం..రూ.24 కోట్ల భూమి 3.8 కోట్లకే ధారాదత్తం!

Publish Date:May 2, 2022

Advertisement

జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ హీరో చిరంజీవికి కారు చౌకగా 595 గజాల స్థలాన్ని కట్టబెట్టిన కుంభకోణం వెనుక ఉన్న పెద్దల పాత్రపై రోజుకో  పేరు తెరపైకి వస్తోంది. కుంభకోణం వెనుక పెద్దల హస్తంపై సమగ్ర దర్యాప్తునకు డిమాండ్ పెరుగుతోంది. జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ  గత 20 ఏళ్లుగా   జరుగుతున్న అక్రమాలపై దర్యాప్తునకు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే ఆ దర్యాప్తు ప్రారంభం కాకుండానే మరో భూ బాగోతం వెలుగులోనికి వచ్చింది.  మెగా హీరోకు ‘చిరు’ ధరకే సొసైటీకి చెందని స్థలాన్ని, అదీ ప్రభుత్వ   భూమిని సొసౌటీ  ఉదారంగా విక్రయించేసిన వైనం కలకలం రేపుతోంది.  వివరాలలోకి వెడితే.. చిరంజీవి గతంలో సొసైటీలోనే కొనుగోలు చేసిన స్థలం (ప్లాట్ నం.303 ఎన్)కు ఆనుకుని 595 గజాల స్థలం ఉంది. అయితే అది సొసైటీకి చెందిన స్థలం కాదు. సొసైటీ లే ఔట్ లో కూడా లేదు. అయినా కూడా సొసైటీ దానిని మెగాస్టార్ చిరంజీవికి గత అమ్మేసింది. గత నెల 20న రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది. అదీ అలా ఇలా కాదు కారు చౌకగా... బహిరంగ మార్కెట్ లో ఈ భూమి గజం విలువ నాలుగు లక్షల వరకూ ఉంది. అంటే సొసైటీ చిరంజీవికి అమ్మేసిన 595 గజాల స్థలం విలువ రమారమి 24 కోట్ల రూపాయలు. అంత విలువైన భూమిని సొసైటీ మెగాస్టార్ చిరంజీవికి గజం 64 వేల చొప్పున కేవలం 3.80 కోట్ల రూపాయలకే విక్రయించి రిజిస్ట్రేషన్ కూడా చేయించేసింది. సొసైటీ గత అక్రమాలపై ప్రభుత్వం విచారణకు సన్నద్ధమౌతుండగా కొత్తగా తెరపైకి వచ్చిన ఈ భూ బాగోతం సంచలనం సృష్టించింది. పైగా ఈ బాగోతంలో చిరంజీవి భాగస్వామి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.

గత పాలక మండలి అక్రమాలపై ఫిర్యాదు చేసిన ప్రస్తుత పాలక మండలే నిబంధనలకు గాలికొదిలేసి ‘చిరు’ ధరకు కోట్లాది రూపాలయలు విలువ చేసే భూమిని మెగా స్టార్ కు ధారాదత్తం చేయడం  వెనుక పెద్ద మొత్తంలో సొమ్ము చేతులు మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
  ఈ భూ దందాపై ఇప్పటికే సంబంధిత అధికారులు, పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే ఇప్పుడు కారు చౌకగా మెగాస్టార్ చిరంజీవికి సొసైటీ  ‘చిరు’ ధరకే కట్ట బెట్టిన 595 చదరపు గజాల స్థలం చిరంజీవికి ఇప్పటికే సొసైటీలో ఉన్న 3333 చదరపు గజాల ప్లాట్ కు ఆనుకునే ఉంది.  అయితే చిరంజీవి ఇప్పుడు సొసైటీ నుంచి కొనుగోలు చేసిన 595 చదరపు గజాల స్థలం అసలు సొసైటీ స్థలమే కాదు. అయినా సొసైటీ దర్జాగా దానికి మెగాస్టార్ కు విక్రయించేసింది. ఈ బాగోతం బైట పడటంతో ప్రస్తుత సొసైటీ అది తమ తప్పు కాదు..పాత గవర్నింగ్ బాడీయే అప్రూవల్ చేసిందని చెప్పుకొస్తున్నది. అయితే గత సొసైటీ తప్పిదమైతే  ప్రస్తుత సొసైటీ దానిని రద్దు చేసే అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదన్న ప్రశ్న ఉత్పన్నమౌతున్నది. 


గత 20 ఏళ్లుగా జూబ్లీహిల్స్  కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అక్రమాలపై ఆరోపణలు, విమర్శలూ వెల్లువెత్తుతుంటే...వాటిపై విచారణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత కూడా కొత్తగా మరో కుంభకోణం చోటు చేసుకోవడం వెనుక పెద్దల హస్తం ఉందని అంటున్నారు.  ఇక చిరంజీవికి ఈ భూమి సొసైటీది కాదని తెలియక కొన్నారని కొందరు చేస్తున్న వాదన సబబుగా లేదు.   తాను కొత్తగా కొన్న 595 చదరపు అడుగుల భూమి, తనకు ఇప్పటికే సొసైటీలో ఉన్న స్థలానికి ఆనుకునే ఉంది. ఆ భూమిని ఆయన 1999లోనే కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ ఏడాది ఏప్రిల్  20న ఈ తాజా రిజిస్ట్రేషన్ జరిగింది. ఇంత కాలం తన స్థలానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలం సొసైటీదో కాదా ఆయనకు తెలియదంటే నమ్మశక్యం కాదని సొసైటీ సభ్యులు అంటున్నారు. అన్నీ, అందరికీ తెలిసే ఈ అక్రమ భూ బాగోతం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ మొత్తం వ్యవహారంలో అక్రమాలు జరిగాయని   సొసైటీ సభ్యులు, న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.      

By
en-us Political News

  
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. 
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్‌ల సౌండ్‌తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.