Publish Date:Oct 14, 2019
చెన్నై లోని లలితా జ్యువెలరీ చోరీ కేసులో కొత్త మలుపు వెలుగు చూసింది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న తిరువారూరు మురుగన్ అనూహ్యంగా కోర్ట్ లో లొంగిపోయాడు. మురుగన్ నుంచి పది కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే బంగారం తమదంటే తమదంటూ కర్ణాటక, తమిళనాడు పోలీసులు కుస్తీపడుతున్నారు.
చెన్నై లలిత జ్యువెలరీలో చోరికి సూత్రధారి మురుగన్ నుంచి స్వాధీనం చేసుకున్నబంగారం లలితా జ్యువెలరీ కేసుకు సంబంధించిదేనని తమిళనాడు పోలీసులు చెబుతుండగా కర్ణాటక పోలీసులు మాత్రం కాదంటూ వాదిస్తున్నారు.
దీంతో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య గోల్డ్ వార్ నెలకొంది. మరోవైపు మురుగన్ రూపురేఖలే మార్చేశాడు. ప్లాస్టిక్ సర్జరీ తో స్మార్ట్ గా తయారయ్యాడు. తిరుచ్చి జిల్లా తిరువెరుంబూర్ లోని మురికి నీటిలో నుంచి స్వాధీనం చేసుకున్న ఫోటో ఆధారంగా పోలీసులు స్థానికులను విచారించారు. అయితే అతని తామెప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు. దీంతో ఖంగుతిన్న పోలీసులు తొలినాళ్లలో అనారోగ్యంతో ఉన్న మురుగన్ ఫొటోను ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఫోటోను పరిశీలించగా సర్జరీ చేయించుకున్నట్లు తేల్చారు.
సర్జరీ కారణం గానే మురుగన్ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నట్లు భావిస్తున్నారు. మురుగన్ తన బినామీ పేర్ల తో పది ఏళ్ళల్లో సుమారు వంద కోట్ల వరకు కూడబెట్టినట్లు అనుమనిస్తున్నారు. అందులో అధిక మొత్తాన్ని సినిమాల నిర్మాణాల కోసమే ఖర్చు పెట్టినట్టు గుర్తించారు. లలిత జూలరీలో చోరీ చేశాక ఆ నగలను మధురై వ్యాపారికి ఇచ్చినట్లుగా పోలీసుల విచారణలో బయటపడింది.
దీంతో అక్కడి నుంచి అయిదు కిలోల నగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు మిగితావి మురుగన్ సురేష్ ల వద్ద ఉన్నాయని అనుమనిస్తున్నారు. ఈ నేపథ్యం లో వారిని కస్టడీ లోకి తీసుకుంటే కేసులో అన్ని నిజాలు ఒక కోలిక్కి వస్తాయన్న ఆలోచన లో ఉన్నారు చెన్నై పోలీసులు.మరి ఈ కేసు ఇంకెన్ని కోనాలు తిరగబోతుందో వేచి చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mastermind-of-lalitha-jewellery-robbery-surrenders-before-court-25-90009.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.