Publish Date:Oct 14, 2019
తన డ్రీమ్ ప్రాజెక్టు సైరా నరసింహారెడ్డి సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోన్న మెగాస్టార్ చిరంజీవి... సినిమా ప్రమోషన్లో బిజీబిజీగా గడుపుతున్నారు. మీడియాకి ఇంటర్వ్యూస్ ఇస్తూనే, సినీ రాజకీయ ప్రముఖులను కలుస్తూ సైరా సినిమాను చూడాలని కోరుతున్నారు. ఇటీవల తెలంగాణ గవర్నర్ ని కలిసి... సైరా సినిమాను వీక్షించాలని కోరిన చిరంజీవి... తమిళిసై ఫ్యామిలీ కోసం ప్రత్యేక షో వేసి చూపించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ కోసం సైరా సినిమా ప్రత్యేక షో వేయాలని మెగాస్టార్ భావిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవనున్న చిరంజీవి... సైరా సినిమాను వీక్షించాలని కోరనున్నారు. అలాగే, సైరా సినిమా ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపనున్నారు.
అయితే, జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తినెలకొంది. ఒకవైపు తమ్ముడు పవన్ కల్యాణ్... జగన్ కు రాజకీయ ప్రత్యర్ధిగా ఉండటం, అలాగే జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో... వీరిద్దరి భేటీ ఆసక్తిరేపుతోంది. అయితే, జగన్ అండ్ చిరు మధ్య పెద్దగా సత్సంధాలైతే లేవని అంటారు. ఎందుకంటే, వైఎస్ మరణం తర్వాత... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావాలనుకున్న జగన్.... అప్పట్లో 18మంది ఎమ్మెల్యేలున్న చిరంజీవి మద్దతు కోరారని, అందుకు మెగాస్టార్ ఒప్పుకోలేదని, పైగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారని అంటారు. దాంతో అప్పట్నుంచి చిరంజీవితో జగన్ దూరం మెయింటైన్ చేస్తూ వచ్చారని చెబుతారు. మరోవైపు, జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి వైపు నుంచి కూడా పెద్దగా సత్సంధాలు లేకపోయినప్పటికీ, కేవలం సైరా సినిమా ప్రమోషన్, అలాగే జగన్ ఫ్యామిలీకి సినిమాను చూపించాలనే ఉద్దేశంతోనే కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా జగన్-చిరంజీవి భేటీ అటు రాజకీయ వర్గాల్లో... ఇటు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-politics-heat-up-due-to-chiranjeevi-and-ys-jagan-meeting-25-90008.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.