Publish Date:Oct 14, 2019
మేఘా కంపెనీల్లో వరుసగా నాలుగో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, కంపెనీ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు మేఘా కంపెనీ యజమానులు ఇళ్లల్లోనూ, కార్యాలయాల్లోనూ ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా, దేశవ్యాప్తంగా మేఘా కంపెనీ కార్యాలయాలు అన్నింటిలోనూ తనిఖీలు జరిపారు. అయితే, ఈరోజు మాత్రం కేవలం హైదరాబాద్ కార్యాలయాలు, అలాగే మేఘా కృష్ణారెడ్డి నివాసంలో మాత్రమే సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మేఘా లావాదేవీలు, కంపెనీ చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, ఫైనాన్షియల్ డీల్స్ పైనే ఐటీ అధికారులు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. అలాగే, మేఘా ఆర్ధిక గతినే మార్చేసిందని చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా మేఘా చేపట్టిన మిషన్ భగీరథ, పట్టిసీమ, ఇతర ప్రాజెక్టుల వివరాలను కూడా ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఆయా ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియలో ఆయా ప్రభుత్వాలు అనుసరించిన విధానం, మేఘా కంపెనీకి కాంట్రాక్టు దక్కిన తీరుపై దృష్టిపెట్టారు.
ఇక, మూడ్రోజుల సోదాల్లో, మేఘా కంపెనీ బ్యాంకు అకౌంట్లు, అలాగే మేఘా కృష్ణారెడ్డి, అతని కుటుంబ సభ్యుల అకౌంట్లు, లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలించారు. అదేవిధంగా బ్యాంకుతో నిమిత్తం లేకుండా సాగించిన ఇతర ఆర్ధిక లావాదేవీల వివరాలపై కూడా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా మేఘా ఫ్యామిలీ బ్యాంకు లాకర్లపైనా ఐటీ ఆఫీసర్లు ఫోకస్ చేశారు. అలాగే, ఎన్నికల సమయంలో జరిపిన లావాదేవీలపైనా కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/megha-krishna-reddy-gave-funds-to-political-party-25-90011.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.