ఈ అయిదు జబ్బులకు మందులు అస్సలు అక్కర్లేదు.. కేవలం ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలు..!

Publish Date:Jan 21, 2024

Advertisement

ఆహారమే ఔషదం అని అంటారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం,  అనారోగ్యానికి గురి కావాలంటే అనారోగ్యకర ఆహారం కారణం అవుతాయి. సాదారణంగా ఏదైనా జబ్బు చేయగానే చాలామంది మందులు తీసుకుని సమస్యను తగ్గించుకుంటారు. ఆరోగ్యం మీద భయంతో కొన్నిసార్లు వైద్యులను సంప్రదించేవారు కొందరైతే.. చీటికి మాటికి చిన్న జబ్బులకు కూడా మెడికల్ స్టోర్ నుండి మందులు తెచ్చుకుని వాడేవారు కొందరు.  కానీ సాధారణంగా అందరికీ వచ్చే అయిదు రకాల జబ్బులకు అస్సలు మందులు వాడాల్సిన అవసరమే లేదని ఆహార నిపుణులు అంటున్నారు. ఈ జబ్బులను లైఫ్ స్టైల్ డిసీజ్ అని అంటారు. ఇవి ఆహారంలో మార్పులు చేసుకోగానే తగ్గిపోతాయి.  ఆ జబ్బులు ఏంటో.. దానికి తీసుకోవలసిన ఆహారం ఏంటో పూర్తీగా తెలుసుకుంటే..

ప్రస్తుతం ఎవ్వరిని గమనించినా ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటూనే ఉంటుంది. పూర్తీ ఫిట్ గా ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు. కానీ ప్రమాదం అనుకునే అయిదు రకాల వ్యాధులు మాత్రం ఆహారంతోనే తగ్గిపోతాయనే షాకింగ్ నిజం బయటపడింది.

ఆహారంతో తగ్గిపోయే వ్యాధులలో టైప్ 2 మధుమేహం ఒకటి. మధుమేహం ఉన్నవారు జీవితాంతం ఇన్సులిన్ ను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది జీవనశైలి కారణంగా వచ్చే సమస్య. ఆహారంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మధుమేహాన్ని తిప్పికొట్టవచ్చట.

ప్రపంచ వ్యాప్తంగా అధికశాతం మరణాలకు కారణమవుతున్న జబ్బులలో గుండె జబ్బు మొదటిది. గుండె జబ్బులు వాటి సిరలకు వచ్చే సమస్యలతో ముడిపడి ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్, బిపి,  అధిక బరువు గుండె జబ్బులకు ప్రధాన కారణం అవుతాయి. కాబట్టి వీటిని నియంత్రణలో ఉంచుకుంటే గుండె జబ్బులు, గుండెకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా నయమవుతాయి.

గుండె పోటు, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ మూడు కలిసి మెదడుమీద ప్రభావం చూపిస్తాయి. ఇవి స్ట్రోక్ కు కారణం అవుతాయి. మెదడు నరాలు పగిలినప్పుడు లేదా మెదడుకు రక్తప్రసరణ మందగించినప్పుడు స్ట్రోక్ వస్తుంది. దీన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి ముఖ్యం. అవే ప్రధాన పాత్ర పోషిస్తాయి.

రక్తం సిరల్లో అధిక వేగంతో ప్రసరించినప్పుడు దాన్ని హైపర్ టెన్షన్ అని అంటారు. ఇలా  జరిగినప్పుడు గుండె ఎక్కువ శ్రమకు గురవుతుంది. నరాలు బలహీనపడతాయి.   బిపి 120/80mmHg కంటే తక్కువ లేదా ఎక్కువ ఉండకూడదు.

శరీరంలో పుట్టెడు జబ్బులకు కేవలం ఉబకాయం మాత్రమే ప్రధాన కారణం అవుతుంది. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అధికబరువు ఉన్నవారు కూడా ఆహారంలో మార్పులు, వ్యాయామం రెండూ చేస్తే బరువు తగ్గుతారు. చాలామంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు కానీ నిజానికి తాము ప్రయత్నాలు చేస్తున్నట్టు బయటకు వ్యక్తం చేస్తారు, మరోవైపు ఆహారం, వ్యాయామం విషయాల్లో సీరియస్ గా ఉండరు. అందుకే బరువు తగ్గరు.

పై అయిదు సమస్యలకు కేవలం ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది.

                              *నిశ్శబ్ద. 

By
en-us Political News

  
మూత్రం పోయే సమయంలో మంట, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలను చాలా మంది సాధారణంగా తీసుకుంటారు.
శరీరంలో కొవ్వు పెరగడం అనేది చాలామంది చూస్తూనే ఉంటారు.  కొందరికి శరీరంలో కొన్ని ప్రదేశాలలో కొవ్వు పెరిగి, ఆ ప్రదేశాలు చాలా లావుగా కనిపిస్తూ ఉంటాయి.
బిఎమ్ఐ.. దీన్నే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఎత్తుకు తగ్గ బరువు  ఉన్నారా లేదా తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. నేటి కాలంలో అన్ని వయసుల వారిలో అధిక బరువు , ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది.
ఇష్టమైన ఆహారం తింటూనే సులభంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ సూచించిన అట్కిన్స్ డైట్ ప్లాన్ విశేషాలు తెలుగులో తెలుసుకోండి.
రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
టి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు.
మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక  వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం.
వర్షాకాలం వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, వర్షం, నీరు నిలవడం, వరదలు వంటివి  వివిధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది పెద్దవారికే వచ్చే వ్యాధి అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ సమస్య పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే..
గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం సమస్యలకు ఇంట్లోనే వాము, ధనియాలు, జీలకర్ర, సోంపుతో ఆయుర్వేద చూర్ణం ఎలా తయారు చేయాలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించిన పూర్తి వీడియో.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.