చిరంజీవి వియ్యండుకిపై ఐ.టి. దాడుల వెనుక కిరణ్ హస్తం?
Publish Date:May 18, 2012
Advertisement
చెన్నైలోని చిరంజీవి వియ్యంకుడిపై జరిగిన ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల దాడి వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హస్తం ఉందా? అంటే ఉండనే అంటున్నారు పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అనుచరులు. మరో రెండేళ్ళపాటు తానే అధికారంలో ఉంటానని ఇటీవల ప్రకటించిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తమ నాయకుడు బొత్సను బద్నాం చేశాడని, తనకు పోటీగా ఉంటాడనుకున్న చిరంజీవిని కూడా బలిపశువు చేయడానికి ఐ.ట్. దాడులు జరిపించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన చిరంజీవి ఐ.టి. దాడులు జరిగిన వెంటనే ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను కలిసి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. చిరంజీవికి పార్టీ అధిష్టానం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. పార్టీ పరిశీలకుడు వాయిలార్ రవి చిరంజీవి ఇంటికి విందు భోజనానికి కూడా వెళ్ళారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవిపై కన్నేసి ఉంచాడని, ఈ నేపథ్యంలో చిరంజీవికి చెందిన సొమ్ము తన వియ్యంకుడి ఇంట్లో ఉంచినట్లు సమాచారం అందడంతో తన సహచరుల ద్వారా ఐ.టి. అధికారులకు ఉప్పు అందించి దాడి చేయించారని వారు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం అసాధ్యమని అందువల్ల తనను మార్చి చిరంజీవికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశం ఉందని కిరణ్ అనుమానిస్తున్నారు. అందుకే ఆయన పరువుకు భంగం కలిగించడం ద్వాటా తన పబ్బాన్ని గడుపుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు బొత్స ముఖ్యమంత్రి పదవిపై కన్నేసి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న తరుణంలో ఆయనపై మద్యం సిండికేట్ దెబ్బ వేశారు. ఈ దెబ్బతో విలవిలలాడిన బొత్స ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అధిష్టానం చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయనపై ఐ.టి.దాడుల అస్త్రాన్ని ప్రయోగించారు. ఐ.టి.దాడుల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను మరో రెండేళ్ళపాటు అధికారంలో ఉంటానని, ఈ విషయంపై ఎవరికీ ఎటువంటి సందేహం అక్కరలేదని ప్రకటించడం విశేషం.
http://www.teluguone.com/news/content/kiran-kumar-reddys-hand-in-chiranjeevi-inlaws-it-raids-24-14120.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





