పీక్స్ కు చేరిన కేశినేని బ్రదర్స్ విభేదాలు.. ఎంపీ చిన్నిపై ఈడీకి నాని ఫిర్యాదు

Publish Date:Jun 13, 2026

Advertisement

విజయవాడ రాజకీయాల్లో  కేశినేని బ్రదర్స్ మధ్య విభేదాలు పీక్స్ కు చేరాయి.  మాజీ ఎంపీ కేశినేని  నాని  ప్రస్తుత విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని  చిన్ని మధ్య నడుస్తున్న రాజకీయ వైరం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తన సొంత తమ్ముడైన చిన్నిపై కేశినేని నాని ఏకంగా ఈడీకి  ఫిర్యాదు చేశారు. 

గత సార్వత్రిక ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమై కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముగిసిన తర్వాత నాని వైసీపీకి దూరంగా జరుగుతూ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ..  తమ్ముడు కేశినేని చిన్నితో  వైరం మాత్రం పెరుగుతూనే ఉంది. 

తాజాగా శుక్రవారం (జూన్ 13) కేశినేని చిన్నిపై ఉన్న పలు అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ నాని ఈడీకి ఒక లేఖ రాశారు. ఈ లేఖ ప్రతులను ఆయన   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూడా పంపించారు. ప్రస్తుతం ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ ఫిర్యాదులో కేశినేని చిన్నిపై నాని అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో చిన్నికి ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. దీనితో పాటు గత ఎన్నికల సమయంలో విజయవాడ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల టిక్కెట్లను ఒక్కొక్కటి రూ. 5 కోట్లకు చిన్ని విక్రయించారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ప్రగతి నగర్ ప్రాంతంలో 112 ఎకరాల భూమిని కబ్జా చేసి, ఆ వ్యవహారంలో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించారని నాని లేఖలో స్పష్టం చేశారు.

వీటితో పాటు హైదరాబాద్ కేంద్రంగా సాగిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ప్రీ-లాంచింగ్ పేరుతో భారీ వసూళ్లకు పాల్పడ్డారని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్  వేదికగా అక్రమ మైనింగ్,  ఉత్సవాల పేరిట పెద్ద ఎత్తున అవినీతి సంపాదన కూడబెట్టారని నాని సంచలన అంశాలను ప్రస్తావించారు. ఇంతకాలం జరిగిన అక్రమాలు చాలని, తక్షణమే పీఎంఎల్‌ఏ చట్టం కింద సమగ్ర దర్యాప్తు జరిపి ఈ అవినీతికి అడ్డుకట్ట వేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు, బెజవాడ ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించిన అన్నాదమ్ములు ఇలా  దర్యాప్తు సంస్థల దాకా వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంచలన ఆరోపణలు,  లేఖపై కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ ఏ విధంగా స్పందిస్తుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

అదలా ఉండగా..  సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఫిర్యాదు మేరకు ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నానిపై విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో  కేసు నమోదైంది.  కేశినేని చిన్ని  ఫిర్యాదు మేరకు..  2025 ఏప్రిల్ 22న కేశినేని నాని సోషల్ మీడియాలో ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. అందులో  ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్  అనే సంస్థ పేరుతో ఎంపీ చిన్ని అక్రమంగా లబ్ధి పొందుతున్నారనీ..  బినామీల పేర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారని   ఆరోపణలు చేశారు. ఈ దుష్ప్రచారంపై గతంలోనే తాను లీగల్ నోటీసులు పంపినప్పటికీ, నాని నుంచి ఎలాంటి సమాధానం రాలేదని.. పైగా తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూనే ఉన్నారని చిన్ని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

By
en-us Political News

  
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.