అస‌లే టెన్ష‌న్ టెన్ష‌న్‌.. మ‌రో వంక కేటీఆర్ 

Publish Date:Aug 27, 2022

Advertisement

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను అరెస్టు చేయ‌డం ఆయ‌న‌పై పీడీ యాక్టు విధించ‌డంతో ప‌రిస్థితులు అదుపుత‌ప్పాయి. భ‌జ‌రంగ ద‌ళ్ వీహెచ్‌పీ కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. దీంతో చాంద్రాయ‌ణ‌గుట్ట ప్రాంతం హైటెన్ష‌న్ చోటు చేసుకుంది. ఈ ప‌రిస్థితుల్లో కేటీఆర్ చాంద్రాయ‌ణ‌గుట్ట ఫ్లైఓవ‌ర్ ప్రారంభోత్స‌వానికి పూను కున్నారు. 

ఈనెల 23న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కావాల్సి ఉండగా బీజేపీ నేతల ఆందోళనలతో వాయిదా పడింది. రాజాసింగ్ అరెస్టు అనంతరం ఓల్డ్ సిటీలో ఘర్షణలతో చాంద్రాయణ గుట్టలో పోలీసులు హై అలర్ట్ ప్రక టించారు. భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు అడ్డుకుంటారనే సమాచారంతో భారీగా పోలీసులు మోహ రించారు.

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసి మంగళహాట్ పోలీసులు కోర్టుకు తరలించిన తర్వాత పీడీయాక్ట్ నమోదు చేసిన విషయాన్ని ప్రకటించారు. అంతకు ముందు రెండు పాత కేసుల్లో ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఓ వర్గం మత మనోభావాలను కించ పరిచేలా ఆయన ఓ వీడియో ను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమయింది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. దీంతో  పాతబస్తీలో ఉద్రిక్తత ఏర్పడింది. చివరికి పోలీసులు పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజాసింగ్‌ది పూర్తిగా వివాదాస్పదమైన చరిత్ర. రాజకీయ కారణాలతో ఆయన  ఓ వర్గాన్ని  తీవ్రంగా ద్వేషిస్తూ వ్యాఖ్యలు చేస్తూంటారు. ఈ క్రమంలో  పలు కేసులు నమోదయ్యాయి.  సాధారణంగా రిమాండ్ ఖైదీలను చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. అయితే చంచల్ గూడ కూడా పాతబస్తీ పరిధిలోనే ఉండటంతో భద్రతా కారణాలతో ఆయనను చర్లపల్లి తరలించాలని నిర్ణయిం చారు.  

By
en-us Political News

  
ఏపీలో పోలింగ్ సాగుతోంది . మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు జనం ఓ ఉత్సాహంతో, ఓ జోష్ తో పోలింగ్ బూత్ లకు బారులు తీస్తున్నారు. వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్‌లు కిటకిటలాడుతున్నాయి. ఉత్సాహంగా ఓటు వేయడానికి అన్ని వర్గాల ప్రజలూ ఉత్సాహం చూపుతున్నారు.
ఏపీలో పెరుగుతున్న పోలింగ్ శాతం
వైసీపీ గూండాల పాపం.. పోలింగ్ ఆగింది!
మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ హింసాత్మకంగా జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి కృష్ణారెడ్డి నరరూప రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నారు.
కేంద్ర మంత్రి, సికిందరాబాద్ లోక్ సభ నియోజవర్గ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత చేసిన ప్రసంగంలో కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అధికార వైసీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు పూనకం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆ పార్టీ అభ్యర్థి లేదా కార్యకర్తలు నిబంధనలను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు.
ఏపీ పోలింగ్‌లో వైసీపీ పైశాచికత్వం!
తెలుగుదేశం విజ‌య‌వాడ లోక్ సభ అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) దంప‌తులు వారి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.
భార్యతో కలిసి పవన్ ఓటు వేశారు. కళ్లు తెరిచి చూడు జ‌గ‌న్‌ అంటూ సోష‌ల్ మీడియాలో సైటైర్లు... జ‌గ‌న్‌, పోతిన్ ఆరోప‌ణ‌ల‌కు ప‌వ‌న్ త‌న‌దైన స్టైల్‌లో స‌మాధానం ఇచ్చారు. భార్యతో కలిసి పవన్ ఓటు వేశారు... కాస్త కళ్లు తెరిచి చూడు జ‌గ‌న్‌, పోతిన మహేష్‌ అంటూ జ‌న‌సైనికులు రెచ్చిపోతున్నారు. నెటిజెన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
బైబై వైసీపీ, బైబై జగన్ అంటున్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు.
కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఈ ఉదయం 11 గంటల వరకూ 21.86శాతం పోలింగ్ నమోదైంది. కర్నాలు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ శాతం ఇలా ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.