తానే మారెనా..వ్యూహమే మార్చెనా..? కేసీఆర్ వ్యూహం మార్పు కారణమేంటి?

Publish Date:Apr 30, 2022

Advertisement

టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్ అన్నట్లుగా  బిజెపి ఇటు టిఆర్ఎస్ ని, అటు కాంగ్రెస్ ని ఒకే సారి టార్గెట్ చేసిందని గ్రహించారేమో.. సిఎం కెసిఆర్ తన వ్యూహాన్ని సమూలంగా మార్చేశారు. ప్రశాంత్ కిషోర్ భుజాలపై తుపాకి పెట్టి టిఆర్ఎస్ ను, కాంగ్రెస్ ను రెండింటిని ఏకకాలంలో లక్ష్యం చేసింది బిజెపి. ఈ నేపథ్యంలోనే జాతీయ రాజకీయాలపై దృష్టి పెడితే.. రాష్ట్ర రాజకీయాలలో తమ ఆధిపత్యానికి గండి పడే అవకాశాలు ఉన్నాయన్న బావనతోనే తెురాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన వ్యూహాన్ని మార్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ వ్యూహం గ్రహింపునకు రానంత కాలం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెలుగు వెలగాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచించి, ఆ దిశగా అడుగులు వేసిన కేసీఆర్.. బీజేపీ ఎత్తుగడ గ్రహించిన మరుక్షణమే తన వ్యూహాలను మార్చుకున్నారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని ముందుకు సాగితే..  తెలంగాణలో టిఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న అంచనాకు కేసీఆర్ రావడంతోనే...దిశ మార్చుకుని, వ్యూహాలను మార్చుకుని   రాష్ట్ర రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించాలన్న నిర్ణయానికి వచ్చారన్నది పరిశీలకులు అభిప్రాయం.

2018 ఎన్నికల్లో తెరాసకు అప్పటి రాజకీయ సమీకరణాలు బాగా కలిసి వచ్చాయి. అదును చూసి ముందస్తుకు వెళ్లిన కేసీఆర్ ఆశించిన దాని కన్నా ఎక్కువగా ప్రయోజనం పొందారు. అందుకుకారణం అప్పటి ఎన్నికలలో  కాంగ్రెస్, టిడిపిలు పొత్తు పెట్టుకుని పోటీ చేయడమే. కాంగ్రెస్, తెలుగుదేశంల పొత్తు కేసీఆర్ కు బాగా కలిసి వచ్చింది. ఆయాచితంగా మరోసారి సెంటిమెంట్ అనే బలమైన ఆయుధాన్ని ఆయన చేతికి ఇచ్చింది.

మళ్లీ తెలంగాణను దోచుకునేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి వస్తున్నాయంటూ ప్రచారంతో ఊరూవాడా ఏకం చేసేశారు. మరోసారి తెలంగాణ ఉద్యమం నాటి స్థాయిలో సెంటిమెంటును రగిల్చారు. ఫలితంగా  తెలంగాణలో  కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భారీ మూల్యం చెల్లించుకున్నాయి. 

ఇప్పుడు అలాంటి అవకాశాన్ని బీజేపీ అందిపుచ్చుకునేందుకు ప్రశాంత్ కిశోర్ రూపంలో అవకాశం వచ్చింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏక కాలంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తోనూ, తెలంగాణలో కేసీఆర్ తోనూ చర్చలు జరపడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు కలిసిపోతున్నాయన్న ప్రచారానికి బీజేపీ తెరతీసింది. 2018 ఎన్నికలలో తెరాస ఎలాగైతే కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తును ఉపయోగించుకుని ఎలా రాజకీయ లబ్ధి పొందిందో...సరిగ్గా అలాగే కాంగ్రెస్, తెరాస ములాఖత్ పేరుతో బీజేపీ లబ్ధి పొందేందుకు ఉపయోగించుకోవాలనుకుంది. ఈ ఎత్తుగడను సకాలంలో పసిగట్టిన కేసీఆర్ ఒక్క సారిగా తన వ్యూహాలను మార్చేసి రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టాలన్న నిర్ణయానికి వచ్చేశారు. సరే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు పీకే కాంగ్రెస్ చేరికకు ఆదిలోనే హంస పాదు పడింది. దీంతో పీకే వ్యూహాలను రాష్ట్రంలో అనుసరించడానికి కేసీఆర్ కు ఎలాంటి అభ్యంతరాలు ఎదురు అవ్వని  పరిస్థితి వచ్చింది. అయితే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న కోరికను మాత్రం కేసీఆర్ మరోసారి పక్కన పెట్టక తప్పని రాజకీయ అనివార్యతను బీజేపీ వ్యూహాత్మకంగా కల్పించింది. అందుకే జాతీయ అజెండాకే పరిమితమై.. మారిన తన వ్యూహాన్ని ఇటీవల ప్లీనరీ వేదికగా కేసీఆర్ ఆవిష్కరించారు. 
 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
అమరావతి కేవలం ప్రజా రాజధాని మాత్రమే కాదు..  దేవతల రాజధాని కూడా అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి, ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్ర మట్టి , జలాలను సేకరించి ఇక్కడ పవిత్ర పూజలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ హయాంలో పాలన అంటే పంచడం, పంచుకోవడం అన్న చందంగా పరిస్థితి ఉండేది. దాంతో జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు ఏవీ రాలేదు సరికదా.. ఉన్నవి కూడా తరలిపోయాయి. అసలు అప్పట్లో ఏపీ వైపు చూడాలంటేనే పారిశ్రామిక వేత్తలు భయపడేలా పరిస్థితులు ఉండేవి.
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.