రాజ్ భవన్ కు కేసీర్.. సయోధ్యకు శ్రీకారం?
Publish Date:Jun 27, 2022
Advertisement
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈరోజు (మంగళవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్లో మంగళవారం ఉదయం 10.05 గంటలకు గవర్నరు తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు.అయితే,గత కొంత కాలంగా, గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రి కేసేఆర్ మధ్య దూరం పెరిగిన నేఫ్యంలో, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుపై మొదట అనుమానాలు వ్యక్తమైనా, చివరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవణికి ముఖ్యమంత్రి కేసీఆర్ జహారవుతారని, ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు, ఉన్నతాధికారులు సైతం కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం. అయితే సంవత్సర కాలం పైగా, గవర్నర్ ను కలిసేందుకు ఇష్టపడని ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా, అనివార్యంగానే,రాజ్ భవన్ లో అడుగు పెడుతున్నారని, రాష్ట్ర హై కోర్టు కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారని అంటున్నారు. ప్రొటోకాల్ ప్రకారం హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సి ఉంటుంది, అందుకే ముఖ్యమంత్రి రాజ్ భవన్ వెళుతున్నారని, అధికార పార్టీ నాయకులు అంటున్నారు. అది చాలావరకు నిజమే అయినా, ఇటీవల కొంత కాలంగా, గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య, మంచు కరుగుతోందని రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం తర్గుతోందని వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో, ఇప్పడు ఇది ఆ దిశగా పడుతున్న తొలి అడుగు కావచ్చనే ఉహాగానాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గవర్నర్’తో విభేదాల కారణంగా, ముఖ్యమంత్రి మంత్రి వర్గ విస్తరణ వంటి కొన్ని కీలక నిర్ణయాలను చాల కాలంగా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు, కొన్ని అనివార్య పరిస్థితులు ఏర్పడిన నేపధ్యంలో ముఖ్యమంత్రి ఒకడుగు ముదుకేసి గవర్నర్’తో సయోధ్య కోరుకుంటున్నారని అంటున్నారు. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నేపధ్యంలో అయన స్థానంలో, అదే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్’ను మంత్రి వర్గంలోకీ తీసుకుంటారని అప్పట్లో గట్టి ప్రచారం జరిగింది. అందుకే ఆయన చేత ఎంపీ పదవికి రాజీనామా చేయింఛి, ఎమ్మెల్సీ చేశారని ప్రచారం జరిగింది. అప్పటినుంచి, మంత్రివర్గ విస్తరణ పై ఉహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే గవర్నర్’తో విభేదాలే కారణంగా మంత్రివర్గ విస్తరణ అప్పటి నుంచి వాయిదా పడుతోందని అయితే, ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి, ఎన్నికలకోసం మంత్రి వర్గంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ అంటే గవర్నర్’ అనుమతి తీసుకొనక తప్పుదు. అంతే కాదు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలన్నా, అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి. మరోవంక, మహారాష్ట్ర పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా అయినా, వెనకడుగు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ముఖ్యమంత్రి రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరాన్ని తగ్గించేందుకు, ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక మాజీ కేంద్ర మంత్రితో పాటుగా, కరీంనగర్ జిల్లాకు చెందిన మరో కీలక నేత ఒకరు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. అందుకే, ముఖ్యమంత్రి ఆ దిశగా తొలి అడుగు వేశారని, ప్రోటోకాల్ ఒట్టి సాకు మాత్రమే అంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని రాష్ట్ర పర్యటనల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రోటోకాల్ నిబంధనలను పాటించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సో.. ఈ సయోధ్యకు శ్రికరంగానే భావించవలసి ఉంటుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-39-138580.html





