Publish Date:Jun 27, 2022
అవధానాలలో అప్రస్తుత ప్రసంగి అని ఒకరుంటారు. అవధానం రంజుగా సాగుతుండగా.. అప్రస్తుత ప్రశ్నలు వేస్తూ అవధాని దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తుంటారు. సరిగ్గా అంబటి రాంబాబు అలాంటి అప్రస్తుత ప్రసంగాలు చేయడంలో దిట్ట. తన వ్యాఖ్యలు, విమర్శలతో లేనిపోని వాదనలకు తావిచ్చే యత్నం చేస్తారు. తద్వారా అసలు విషయం పక్కకు పోతుందన్నది ఆయన ఉద్దేశం. విజయవాడలో జరిగిన వైసీపీ సమావేశంలో కూడా ఆయన అలాంటి ప్రస్తావనే తీసుకు వచ్చారు.
ఇష్టారీతిన దబాయించడం.. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లనడంలో ముఖ్యమంత్రి జగన్ అడుగుజాడల్లో నడుస్తున్న మంత్రులలో అంబటి రాంబాబు ముందువరుసలో ఉంటారనడంలో సందేహం లేదు. మంత్రిగా తన శాఖపై ఏ మాత్రం అవగాహన లేని అంబటి పోలవరంపై చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. పోలవరంపై ప్రశ్నించిన జర్నలిస్టును మీడియా సమావేశం నుంచి బయటకు పంపిన ఘనత అంబటిది. అటువంటి అంబటి తాజాగా రానున్న ఎన్నికలలో ఏపీలో 175కు 175 స్థానాలలోనూ వైసీపీ విజయం ఖాయమన్నధీమా వ్యక్తం చేశారు. దీనిని పరిశీలకులు అంబటి పగటి కలల ప్రసంగంగా అభివర్ణిస్తున్నారు. ఆయన ఇదేదో కార్యకర్తలలో ఉత్సాహం నింపడానికో, క్యాడర్ ను కార్యోన్ముఖులను చేయడానికో అయితే అర్ధం చేసుకోవచ్చు.
కానీ ఆయనీ మాటలు మాట్లాడిన వేదిక.. ఆ వేదికపై ప్రస్తావించిన అంశాలూ చూస్తుంటే.. ఆయన భ్రమలలో ఉన్నారనీ, గాలిలో కట్టిన ఇంద్రభవనాల్లో నివసిస్తున్నారనీ అనిపించక మానదు. వైసీపీ ప్లీనరీ సన్నాహకాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాలలో భాగంగా విజయవాడలో జరిగిన సమావేశంలో అంబటి మాటలు కోటలు దాటేశాయి.
గడప గడపకూ కార్యక్రమానికి జనం బ్రహ్మరథం పట్టారని చెప్పారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలన్నిటినీ అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చారని అంబటి అన్నారు. కానీ ఆయనీ మాటలు చెప్పిన రోజే అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్యలో బాగా కోతపెట్టినట్లు జగన్ శ్రీకాకుళంలో ప్రకటించారు. కరోనా కల్లోలం నుంచి రాష్ట్రం బయటపడిందంటే అది జగన్ చలవేనని కూడా సలవిచ్చారు.
గడప గడపకూలో జనం నిరసన సెగలు, సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర తుస్సు మన్న సంగతిని ఉద్దేశ పూర్వకంగా విస్మరించారు. తెలుగుదేశం మహానాడుకు వచ్చిన స్పందన గురించిన ప్రస్తావనే లేదు. జనం ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలనూ, మంత్రులనూ సమస్యలపై నిలదీస్తున్న విషయాన్ని పట్టించుకోనే లేదు. ముఖ్యమంత్రి అన్నారు కనుక తాను కూడా మొత్తం 175 స్థానాలలో విజయం సాధిస్తామని ఓ ప్రకటన చేసేశారు అంబటి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ambati-day-dreams-at-peak-39-138578.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.