Publish Date:Apr 24, 2026
కవిత కొత్త పార్టీ పేరేంటి? గుర్తు ఎలాంటిది? ఆమె పార్టీ జెండా, అజెండా ఎలా ఉండబోతున్నాయ్? అన్న సస్పెన్స్ నడుస్తోంది. అయితే కవిత పార్టీ జెండా పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో లేదా వీటిలో ఏ రెండు రంగులతోనైనా ఉంటుందని అంటున్నారు. ఇక ఆమె సర్వోదయ గురించి మాట్లాడతారు. అంటే , సబ్బండ వర్ణాల వారని అర్ధం. ఆపై ఇంకా కొందరు ఉద్యమకారులకు న్యాయం జరగలేదనీ చెబుతున్నారు. బీసీ, మహిళ, యువత సంగతి సరే సరి. వీటన్నిటిని బట్టి చూస్తే.. కవిత అందరికీ న్యాయం, ధర్మం జరగాలని కోరుకుంటున్నట్టుగా భావించవచ్చు. అందుకే ధర్మగంట ఆమె తన గుర్తుగా ఎంపిక చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అందుకే కవిత పార్టీ గుర్తు ధర్మగంట, ఇక రంగులు పసుపు, నీలం, పచ్చల కాంబినేషన్లో ఉండొచ్చని తెలుస్తోంది.
పసుపు ఒక మహిళకు ఎంత ముఖ్యమో తెలిసిందే. ఆపై నీలం అంటే దళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుపచ్చ అంటే అది భారత జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీలను ఏకం చేసేది. కాబట్టి కవిత జెండా రంగుల్లో ఇవి ప్రముఖంగా ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో కవిత ప్రకటించబోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. బేసిగ్గా అయితే ఆమె ఒక్కరోజు ఆగండి.. తినబోతూ రుచులెందుకు అని అంటున్నారు కవిత. కానీ కొందరు కార్యకర్తలు అత్యుత్సాహం కొద్దీ వీటిని ముందుగానే సోషల్ మీడియాలో తిప్పేస్తున్నట్టు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kavitha-new-party-39-218135.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!