సిదిరి అప్పలరాజు కుమారుడి హిట్ అండ్ రన్ కేసు.. కాశీబుగ్గ సీఐ, ఎస్ఐలపై సస్పెన్షన్ వేటు.!

Publish Date:Jul 19, 2026

Advertisement

వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో సంచలన వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కుర్రోడు చిన్న యాక్సిడెంట్ చేస్తే అరెస్టు చేసేస్తారా? అంటూ వైసీపీ అధినేత జగన్ వెనకేసుకు వచ్చిన సిదిరి అప్పలరాజు కుమారుడు .. ఆరవ్ వర్మ  కు  కాశీబుగ్గ  సీఐ  రామకృష్ణ,   ఎస్సై  సునీల్ కూడా అండగా నిలిచారని వెల్లడైంది.  అరవ్ హిట్ అండ్ రన్ కేసులో   నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది.  విశాఖపట్నం రేంజ్ ఐజీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.   నిందితుడికి  అనుకూలంగా వ్యవహరించి, కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు.  

అరవ్ హిట్ అండ్ రన్ సంఘటన ఈ నెల 10న జరిగింది. ఆరవ్ వర్మ అతివేగంగా, అజాగ్రత్తగా ద్విచక్రవాహనాన్ని నడిపి. దానయ్య అనే గొర్రెల కాపరిని ఢీ కొనడంతో అతడు  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే..  ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు క్షేత్రస్థాయిలో కనీస విచారణ చేపట్టలేదు. పైగా మాజీ మంత్రి అప్పలరాజు ఒత్తిడికి తలొగ్గిన   పోలీసులు.. అసలు నిందితుడైన ఆరవ్ వర్మను రక్షించేందుకు కేసు  తప్పుదోవ పట్టించారు. ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ వివరాలను సాకుగా చూపి, ఆరవ్ స్నేహితుడైన సిద్ధార్థ్ అనే యువకుడిపై   కేసు నమోదు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు.

 ప్రమాదం జరిగిన  మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ పోలీసులు కనీసం ఘటనా స్థలానికి వెళ్లకపోవడం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించకపోవడంతో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కేసును తప్పుదోవపట్టించి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడిని రక్షంచే ప్రయత్నం చేశారని తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో   ప్రజాందోళన వెల్లువెత్తింది. దీంతో  ఉన్నతాధికారులు, ప్రభుత్వ  ఆదేశాలతో  దర్యాప్తు చేపట్టగా.. సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద లభ్యమైన సీసీటీవీ దృశ్యాలు ఈ కేసులో కీలక సాక్ష్యంగా మారాయి. ఆ సమయంలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతోంది సిద్ధార్థ్ కాదని, మాజీ మంత్రి కుమారుడు ఆరవ్ వర్మ  సాంకేతిక ఆధారాలతో సహా రూఢీ అయ్యింది.

ఈ సాంకేతిక ఆధారాలు పక్కాగా లభించడంతో పోలీసులు వెంటనే ఆరవ్ వర్మను అరెస్టు చేశారు.   పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు సహకరించిన నేరం కింద స్నేహితుడు సిద్ధార్థ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా..  ఈ దర్యాప్తు వ్యవహారం సమయంలో పోలీస్ స్టేషన్ లోని అంతర్గత సమాచారాన్ని స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు మాజీ మంత్రి అప్పలరాజుకు, ఆయన అనుచరులకు చేరవేసినట్లు కాల్ డేటా రికార్డుల  ద్వారా ఉన్నతాధికారులు గుర్తించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి దర్యాప్తును నీరుగార్చడం, నిందితులతో కుమ్మక్కవ్వడంతో  కాశీబుగ్గ సీఐ, ఎస్సైలపై వేటు పడింది.

ప్రమాదం జరిగిన తీరు, ఆ తర్వాత కేసును మభ్యపెట్టేందుకు చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.  స్థానిక ఎమ్మెల్యే  గౌతు శిరీషతో సహా పలువురు తెలుగుదేశం నాయకులు బాధితుడి కుటుంబానికి అండగా నిలబడి, పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలని వారు పట్టుబట్టడంతోనే ఈ కేసులో దాగిన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఎస్సై సునీల్ ను  వీఆర్ కు పంపించారు.  అంతర్గత విచారణలో లోపాలు మరింత స్పష్టంగా బయటపడటం, సీఐ స్థాయి అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతో  ఇద్దరినీ సస్పెండ్ చేశారు.  

Seediri Appalaraju, Kasibugga hit and run case, SKLM News, Telugu One

By
en-us Political News

  
పౌర వాణిజ్య నౌకపై జరిగిన ఈ దాడిని ఇండియా ఖండించింది. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి, అంతర్జాతీయ నౌకాయానానికి విఘాతం కలిగిస్తూ పౌర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్ఘాటించింది.
ఏపీఎస్‌బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డితో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్, రాజ్ కసిరెడ్డిలకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం వచ్చే నెల 3 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది.
శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి వచ్చిన  4 కోట్ల రూపాయల విలువైన   భూమిని అక్రమంగా కాజేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై కేసు నమోదు కావడంతో..  అరెస్టు ఖాయమని నిర్ధారించుకున్న తమ్మినేని సీతారాం తన కుటుంబంతో సహా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.  
ఈ గ్లోబల్ మిషన్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 108 దేశాలకు చెందిన 12 వేల మందికి పైగా విద్యార్థినులకు అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహ ఇంజనీరింగ్, విజ్ఞాన శాస్త్రాలపై ఆన్‌లైన్ ద్వారా ప్రాథమిక శిక్షణ అందించారు. ఈ శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలు, ప్రాజెక్ట్ మూల్యాంకన ఆధారంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 300 మంది బాలికలను తదుపరి దశకు ఎంపిక చేశారు. ఆ తర్వాత చోటుచేసుకున్న తుది ఎంపిక ప్రక్రియలో ఇండియా నుంచి 20 మంది విద్యార్థినులు స్థానం సంపాదించగా, వారిలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి జెస్సీ నిలవడం గర్వకారణం.
సీఐబీటీలో చదివిన ఉదయ్ రుద్రరాజు ఓపెన్ ఏఐ కంప్యూట్ విభాగానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీటీవోగా నియమితులయ్యారు ఒక సాధారణ ప్రాంతీయ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ప్రపంచం గర్వించే స్థాయికి ఎదిగిన తెలుగు తేజం ప్రస్థానం.. అంకితభావం, నైపుణ్యం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది.
ఈ సందర్భంగా కోర్టు వెలుపల జరుగుతున్న రాజకీయ చర్చలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక నేరపూరిత ఉదంతం. దీనిని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని పేర్కొంది.
ఈ తీవ్రమైన ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి స్పందిస్తూ, అవన్నీ అసత్యాలని, బేస్‌లెస్ ఆరోపణలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. తన వద్ద ఉన్న ఆధారాలతో సదరు మహిళా అధికారిణిపై కేసు పెడతానని మీడియాకు మెసేజ్ పంపారు. అయితే ఈ వార్త జాతీయ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం కావడం, తన ప్రతిష్ఠకు భంగం కలిగిందన్న మానసిక ఆందోళనకు ఆయన గురై.. హైదరాబాద్ మోతీనగర్‌లోని తన బంధువుల ఇంట్లో తీవ్ర డిప్రెషన్‌లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా కల్చర్, పొగాకు రంగాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని
ప్రధాని మోడీకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెబుతూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చే నెల మొదటి తేదీన భోగాపురం రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి వేదికగా జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శ్రీకాకుళం సమీపంలోని చాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 900 చదరపు గజాల ఖాళీ స్థలం కబ్జాలక్ష్యంగా.. ఆ భూమి అసలు యజమానులకు సంబంధం లేకుండా, స్థలాన్ని కబ్జా చేసేందుకు, లేని వ్యక్తులను ఉన్నట్లుగా, ఉన్న వారిని మరణించినట్లుగా చూపిస్తూ బోగస్ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. తద్వారా న్యాయబద్ధమైన వారసుల పత్రాలను ఫోర్జరీ చేసి అక్రమంగా యాజమాన్య హక్కులను పొందడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠ భరిత పరిణామాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.