తొమ్మిదో తేదీ రాఖీ పండగ వస్తోంది. అన్నా చెల్లెళ్ల బంధం మరంత పెరుగుతుందేమో అని చూస్తే.. కేటీఆర్ టార్గెట్ గా కవిత మరిన్ని అస్త్రాలు సంధించడంతో గులాబీ దళాలు మరింత నీరసపడ్డట్టు తెలుస్తోంది. జగదీశ్వర్ రెడ్డిలాంటి వారి చేత తనను తిట్టించడం వెనక పెద్ద నాయకుడు ఉన్నాడంటూ ఆమె చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయ్. నేను ఎవరా? నేనెవరో తెలీకుండానే జగదీశ్వర్ రెడ్డి ఇన్నాళ్లూ పార్టీలో ఉన్నడా? అంటూ నిలదీయడమే కాకుండా.. జగదీశ్ రెడ్డిని లిల్లిపుట్ అంటూ సంబోధించి.. తన అక్కసు మొత్తం తీర్చుకున్నారు కల్వకుంట్ల కవిత.
ఇప్పటికే కాళేశ్వరం మీద సిట్ వేస్తారన్న వార్తలు వినవస్తున్నాయ్. అసెంబ్లీలో చర్చకు ఆస్కారముంది. మూడ్రోజుల పాటు సభ పెట్టి సభ్యులందరికీ నివేదిక ఇచ్చి సిట్ వేయడమా? చర్చలకు ఉపక్రమించడమా? అన్నది తేల్చనున్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలను అభిప్రాయం అడిగి తెలుసుకోనున్నారు. అసలేం జరిగిందో ప్రజలకు తెలిసేలా సభలో సమగ్ర చర్చ జరగనుంది.
ఒకపక్క తండ్రి పరువు ఈ స్థాయిలో పోతుంటే.. తనయ దానిని అడ్డుకోవల్సింది పోయి.. రోజుకో రచ్చ. దీంతో ప్రత్యర్ధులు దించే గునపాలన్నా బలమైన గాయాలు తగులుతున్నాయి కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు అంటున్నారు. ఇంటి మనిషైన కవిత వెనక నుంచి అనుకోని సమయంలో అనుకోని విధంగా దించుతున్న ఈ గునపాల నొప్పి మరింత ఎక్కువగా ఫీలవుతున్నారట అధినేత కేసీఆర్.
ఎవరు అవునన్నా కాదన్నా.. తన తర్వాత అంతటి స్థాయిలో తన కొడుకు కేటీఆర్ ఈ పార్టీకి కాబోయే రాజు ప్రస్తుత యువరాజు. అలాంటి యువరాజు పట్ల కనీసం గౌరవ మర్యాదలు చూపకుండా కవిత పరోక్షంగా చేస్తున్న కామెంట్లు కేసీఆర్ కి గట్టిగానే తగులుతున్నట్టు సమాచారం. ఒక సమయంలో చంద్రబాబులా తాను కూడా ఒక్కడ్నే కని ఉంటే ఈ గొడవలే లేక పోయేవని ఫీలవుతున్నారట పెద్ద సారు. అంతగా కవిత సూటి పోటి మాటలు ఆయన గుండెల్లో సలుపుతున్నాయట.
ఇంకో సస్పెన్స్ ఏంటంటే వచ్చే రాఖీ పండక్కి సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుందా కట్టదా? ఇదొక చర్చ నడుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె కేటీఆర్ కేంద్రంగా అనేక కామెంట్లు చేసి ఉన్నారు. ఈ క్రమంలో అన్నకు చెల్లె రాఖీ కడతదా కట్టదా? అన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతున్నట్టు సమాచారం.
ఇక తాజా కబర్ విషయానికి వస్తే తనను కవిత లిల్లీ పుట్ అన్న విషయంపై చర్చించడానికి జగదీశ్వర్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వచ్చారు. తన ఉద్యమ ప్రస్తానం గురించి తెలీకుండా పార్టీని జిల్లాలో నాశనం చేశాడంటూ ఆమె తిట్టడంపై కేసీఆర్ తో కలసి చర్చించేలా తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kalvakuntla-kavitha-comments-hurting-kcr-badly-39-203458.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.