అంతా మామూలేనా...!
Publish Date:Sep 6, 2012
Advertisement
సందర్భం ఏదైనా.. కొన్ని సందర్లాల్లో ఆయా వ్యక్తులు చేసే పనులు కొంతకాలం గుర్తుండి పోతాయి. అది ఏయే సందర్భాల్లో చేశారన్న విషయం నామమాత్రంగా గుర్తున్నా ఆ చర్య మాత్రం... అలా.. గుర్తుండిపోతుంది. గతంలో ఓసారి ఇండియా అద్భుత విజయం సాధించిన సందర్భంలో... ఆ సమయంలో ఇండియన్ క్రికెట్ టీంకు కెప్టెన్గా వున్న గంగూలీ చొక్కా గాలిలో తిప్పుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సినిమాల్లో అయితే చొక్కా లేకుండా చాలా సార్లు నటించిన నటుడుగా సల్మాన్ఖాన్ గుర్తుండిపోతాడు. చాలామంది సల్మాన్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమయిందంటే చాలు.. అందులో చొక్కా విప్పదీసే సీన్ ఉంటుంది... అని రూఢీ అయిపోయేవారు. అలాగే జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీకి చెందిన ఎం.ఎల్.ఎ. సమరేష్సింగ్ అసెంబ్లీలో తన చొక్కాను చించుకుని ప్రభుత్వానికి తన నిరసనను తెలిపారు. బొకారో నిరాశ్రయులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నిరాశ్రయులైన వారికోసం ఓ కమిషన్ను వేయాలన్న తన డిమాండ్కు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో అందుకు నిరసనగా సింగ్గారు తన చొక్కాచించుకుని వినూత్నరీతిలో తన నిరసనను తెలియజేశారు. ఆ రోజు అసెంబ్లీలో మాత్రం ఈ విషయంపై ఈ సింగ్గారు ఈజ్ కింగ్ అనిపించుకున్నారు. కాకుంటే వచ్చిన చిక్కల్లా ఏంటయ్యా...! అంటే... స్కూల్లో పిల్లలు టీచర్ తను చేసిన హోమ్ వర్క్ను ముందు దిద్దలేదని చొక్కా చించుకున్నాడనో.... రైళ్ళు గంటలతరబడి ఆలస్యంగా వస్తున్నాయంటూ ఎవరైనా చొక్కాలు చించుకున్నారనుకోండి... పరిస్థితి ఏంటీ..! అబ్బే! ఏం కాదు...చినిగిన చొక్కా మళ్ళీ కుట్టిచ్చుకుంటారు అంతే...! అంతా మామూలే...!
http://www.teluguone.com/news/content/jharkhand-assembly-24-17166.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





