సినీ పరిశ్రమపై జగన్ సర్కార్ కక్ష సాధింపు!

Publish Date:Aug 10, 2023

Advertisement

ఇంత కాలం జగన్ సినీ ఇండస్ట్రీ పట్ల ఎంత వివక్షతో వ్యవహరించినా.. రాజకీయాలతో మనకెందుకు అనుకున్నారో ఏమో సినీ పరిశ్రమకు చెందిన వారెవరూ పెద్దగా పట్టించుకోలేదు. జగన్ సర్కార్ తీరు పట్ల కనీసంగా కూడా నిరసన వ్యక్తం చేయలేదు.

అదే సమయంలో జగన్ పంచన చేరిన కొందరు పరిశ్రమకు చెందిన నటులు మాత్రం నేల విడిచి సాము చేసిన చందంగా రాజకీయంలో జగన్ కు వ్యతిరేక పార్టీలకు మద్దతుగా నిలిచిన వారిపై విమర్శలతో చెలరేగిపోయారు. అయితే పరిస్థితులు ఎల్లకాలం ఒకేలా ఉండవు అన్నట్లుగా ఇప్పుడు సినీ పరిశ్రమలో గుర్తింపు ఉన్న ఒక్కొక్కరూ ఏపీలో జగన్ సర్కార్ తీరు పట్ల కన్నెర్ర చేస్తున్నారు. నిర్మొహమాటంగా ఇండస్ట్రీ జోలికొస్తే ఊరుకునేది లేదని కుండబద్దలు కొట్టేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల నాటికే ఆయన జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎన్నికలలో ఆయన పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టలేదు. కానీ అప్పటి తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ కూటమి తరఫున ప్రచారం కూడా చేశారు. 2019 ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగారు. జయాపజయాల సంగతి పక్కన పెడితే.. ఆయన సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తే అయినా ఎక్కడా సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా కానీ రాజకీయం చేసిన సందర్భం లేదు.

అయితే అప్పటి ఎన్నికలలో వైసీపీ తరఫున ప్రచారం నిర్వహించిన ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ, పార్టీ టికెట్ ఆశించి.. అన్ని పార్టీల తలుపూ తట్టి చివరికి జగన్ గూటికి చేరిన అలీ, ఇంకా పోసాని వంటి వారు మాత్రం జగన్ మనసెరిగి పవన్ కల్యాణ్ సహా జగన్ ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలు గుప్పించారు. అందుకు ప్రతిఫలమేమిటన్నది ఇప్పుడు అందరూ చూస్తున్నారు. అంతే కాదు స్వయంగా వారు అనుభవిస్తున్నారు కూడా. సరే అదంతా పక్కన పెడితే ఇప్పుడు సినీ ఇండస్ట్రీకీ, అధికార వైసీపీకి మధ్య పెద్ద అగాధమే ఏర్పడినట్లు కనిపిస్తోంది. నాలుగేళ్లకు పైబడి సాగిన జగన్ పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి పెల్లుబుకుతున్న సంగతిని గ్రహించిన వైసీపీ నేతలలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. యధాలాపంగా ప్రభుత్వ విధానాలపై చేసిన వ్యాఖ్యలను కూడా జీర్ణించుకోలేక పోతున్నారు.

అధికార పార్టీ ఎంపీ రాజ్యసభ వేదికగా సినీ నటుల పారితోషకాలపై చేసిన కామెంట్లపై ఓ సినీ ఫంక్షన్ లో హీరో చిరంజీవి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్క సారిగా దూషణలతో విరుచుకుపడటం చూస్తుంటూ అధికార పార్టీలో ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందే అర్ధం చేసుకోవచ్చు. ఇంత కాలం చిరంజీవిని భుజాన మోసిన వారే ఇప్పుడు ఆయనను తూలనాడటం చూస్తుంటే.. చిన్న పాటి వ్యతిరేక వ్యాఖ్యను కూడా సహించలేనంతగా అధికార పార్టీ నాయకులలో  అహం, అసహనం ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం అవుతోందని పరిశీలకులు అంటున్నారు.  పైగా చిరంజీవి ఆ సినిమా ఫంక్షన్ లో విమర్శలు చేయలేదు.. అధికార పార్టీ సినీ పరిశ్రమపై పడి ఏడవడం కాదు.. అంత కంటే పెద్ద పనులు ఉన్నాయి వాటిని చేయాలని హితవు మాత్రమే పలికారు.  

లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం సినీమా హీరోల పారితోషకాల గురించి మాట్లాడటమేమిటని సహజంగానే జన బాహుల్యంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  అలాగే రజనీకాంత్ గతంలో అంటే ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమంలో రెండు ముక్కలు చంద్రబాబు గురించి మంచిగా మాట్లాడినందుకే ఆయనపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆ విమర్శలకు సూపర్ స్టార్ రజనీకాంత్  తన స్టైల్ లో దీటుగా సమాధానం ఇచ్చారు.  సరే అదలా ఉంటే.. ఇప్పుడు చిరంజీవి లేటెస్ట్ మూవీ  భోళా శంకర్ ఆగ‌స్ట్ 11న రిలీజ్‌కి సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఏపీ స‌ర్కార్‌కి టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరారు.  అయితే  భోళా శంకర్ కు ఏపీ ప్ర‌భుత్వం షాకిచ్చింది. టికెట్ ధరల పెంపుకోసం వచ్చిన అనుమతిని కనీసం పరిశీలను కూడా తీసుకోవద్దంటూ ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయని చెబుతున్నారు.

 గతంలో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విషయంలో కూడా జగన్ సర్కార్ ఇదే తీరున వ్యవహరించిన సంగతి తెలిసిందే.  మొత్తం మీద జగన్ సర్కార్ సినీ పరిశ్రమపై కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందన్న మెసేజ్ ఇప్పటికే బలంగా ప్రజలలోకి వెళ్లింది.  ఇది జగన్ సర్కార్ కు ఎంత మాత్రం మేలు చేయదు. సినీ పరిశ్రమ మీద ఆధారపడి జీవించే  లక్షలాది మందే కాకుండా ఆయా హీరోల అసంఖ్యాక అభిమానలను కూడా వైసీపీ దూరం చేసుకున్నట్లేననీ, వచ్చే ఎన్నికలలో ఇది పార్టీపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమనీ అంటున్నారు. 

By
en-us Political News

  
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.