Publish Date:Aug 10, 2023
కరోనా పేరు చెబితే ఇప్పటికీ వణికిపోయే వారు చాలామంది ఉన్నారు. ప్రపంచం మీద మృత్యు తాండవం చేసిన ఈ వైరస్ దేశదేశాలకు తలపెట్టిన ప్రాణనష్టం అంతా ఇంతా కాదు. ఏకంగా రెండేళ్ల పాటు ప్రపంచం మొత్తం మహమ్మారి దెబ్బకు కుదేలైపోయింది. లాక్ డౌన్ లు, క్వారంటైన్లతో అల్లాడిపోయింది. కరోనా వైరస్ తగ్గిందని అనుకునేలోపు ఓమిక్రాన్ వైరస్ గా తిరిగి ప్రజలమీదకు దండెత్తి వచ్చింది. ఇది కూడా కొన్నిరోజుల పాటు ప్రజలను నానాతిప్పలూ పెట్టింది. ఓమిక్రాన్ వైరస్ తగ్గిపోతోంది కరోనాను ఇక తరిమికొట్టిశాం అని ఊపిరిపీల్చుకునేలోపు ఒమిక్రాన్ కొత్త రూపంలో మానవాళిపై దాడికి రెడీ అయ్యిందన్న వార్తలు వస్తున్నాయి. దాదాపు ప్రపంచం అంతా కోవిడ్, దాని వేరియంట్ల భయం నుంచి బయటపడి ప్రశాంతంగా, స్వేచ్ఛగా గడుపుతున్న సమయంలో ఓమిక్రాన్ కొత్త వేరియంట్ విజృంభణ ఉలిక్కిపాటుకు గురి చేస్తోంది. వివిధ పరిశోధనలలో ఎరిస్ వేరియంట్ ఓమిక్రాన్ కు వారసత్వం అని నిర్ధారణ అయ్యింది. అంటే కరోనా తరువాత ఓమిక్రాన్, ఓమిక్రాన్ తరువాత ఇప్పుడు ఎరిస్ వైరస్ మానవాళిపై దాడికి రెడీ అవుతోందని నిపుణులు అంటున్నారు. ఈ వైరస్ అమెరికాలో కరోనా తరువాత అక్కడివారిని ప్రభావితం చేస్తున్న రెండవ అతి ప్రమాదకమైన వైరస్ గా గుర్తించారు. ఈ వైరస్ ను ఇండియాలో కూడా గుర్తించారు. మహారాష్ట్రలో ఈ వైరస్ బయటపడటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ కొత్త వైరస్ ఎరిస్ వైరస్ బారిన పడినా కొంచం ముందుగా గుర్తించి తగిన చర్యలు, చికిత్స తీసుకోవచ్చు. ఇంతకూ ఎరిస్ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే...
ఎరిస్ వైరస్ లక్షణాలు ఇప్పటివరకు ఓమిక్రాన్ లక్షణాల మాదిరిగానే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకినప్పుడు గొంతునొప్పి, ముక్కు కారటం, తుమ్ములు, శ్లేష్మంతో కూడిన దగ్గు, ఒళ్ళు నొప్పులు, పొడిదగ్గు , వాసన లేకపోవడం మొదలైన లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కరోనాలో ,ఆ తరువాత ఓమిక్రాన్ లో ఆ తరువాత ఇప్పుడు ఎరిస్ వైరస్ సోకినప్పుడు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం అమెరికాను వణికిస్తున్న ఈ వైరస్ ఇక్కడ మహారాష్ట్రలో కనిపించినా దీని ప్రభావం దేశంలో అంతగా ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ విషయం నిజం కావచ్చు, కాకపోవచ్చు కూడా. ఎందుకంటే వైరస్ వ్యాప్తి ఆరోగ్య నిపుణుల చేతుల్లో కాదు ప్రజలు తీసుకునే జాగ్రత్తల్లో, ప్రజల ఆరోగ్య దృఢత్వం మీద ఆధారపడి ఉంటుంది.
ఎరిస్ వైరస్ వ్యాప్తి భారతదేశంలో ఎంత తీవ్రంగా ఉంటుందన్నది పక్కన నెడితే.. కరోనా సమయంలో అందరూ ఎలలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో, అలాంటి జాగ్రత్తలే.. అంటే సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, సానిటైజర్ వాడటం. వ్యక్తిగత శుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ పాటిస్తే ఎరిస్ వైరస్ మాత్రమే కాదు వేరే ఏ వైరస్ వచ్చినా ఎవరినీ ఏమీ చేయదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/omicron-in-new-form-39-159770.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.