జగన్ సభలకు కి‘రాయి’జనాలే.. రాయిదాడి సొమ్ము ఎగ్గొట్టినందుకే!

Publish Date:Apr 17, 2024

Advertisement

జగన్ మనమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజాదరణ కరవైందని ప్రత్యేకంగా ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రోడ్ షోలకు జనం ముఖం చాటేస్తున్న దృశ్యాలు  మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ యాత్ర సందర్భంగా ఆయన చేస్తున్న ప్రసంగాలు వినేందుకు కిరాయి ఇచ్చి మరీ రప్పించుకున్న జనం కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. పదులు, వందల సంఖ్యలో  బస్సులలో ఇతర ప్రాంతాల నుంచి తరలించిన జనం కూడా జగన్ ప్రసంగం మొదలు కాగానే సభా ప్రాంగణాన్ని ఖాళీ చేసి బస్సుల వద్దకు వెళ్లి పోతున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే  బెజవాడలో సీఎం జగన్‌పై జరిగిన గులకరాయి దాడిపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. జగన్ పై చంద్రబాబు చేసిన హత్యాయత్నంగా ఈ దాడిని అభివర్ణించడానికి వైసీపీ నేల విడిచి సాము చేసింది. స్వయంగా జగన్ కూడా ఈ దాడి వెనుక ఉన్నది చంద్రబాబేనని ఆరోపణలు గుప్పించారు. 
ఒక ముఖ్యమంత్రిపై దాడి కావడంతో ముందువెనుకలు ఆలోచించకుండా  ప్రధాని మోదీ నుంచి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, చివరాఖరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం ఖండించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రకటించి దాడికి పాల్పడిన వారిని పట్టిచ్చిన వారికి రెండు లక్షల రివార్డు కూడా ప్రకటించేశారు.  అలా ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే  పోలీసులు దాడికి సంబంధించి ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ సందర్భంగా ఆ యువకులు వెల్లడించిన వాస్తవాలు బయటకు పొక్కటంతో  జగన్ సభలకు డబ్బులిచ్చినా, మందు పోసినా జనాలు రావడం లేదన్న సంగతి బట్టబయలైంది.  జగన్ పర్యటనకు వస్తే 350 రూపాయలడబ్బు, మందుబాటిల్ ఇస్తామని తీసుకువచ్చారనీ, తీరా వచ్చిన తరువాత క్వార్టర్ మందుబాటిల్ చేతిలో పఃపెట్టి  డబ్బులు ఎగ్గొట్టారనీ, దాంతో  కోపం వచ్చి  జగన్‌పై రాయి వేశాననీ దాడికి పల్పడిన వ్యక్తి పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఈ దాడికి ఏ రాజకీయపార్టీతోనూ సంబంధం లేదని  పోలీసులు చెబుతున్నారు.

అదే సమయంలో జగన్ సభలకు వస్తున్న జనం మొత్తం కిరాయి జనమేనని ఈ దాడి ఘటనతో తేలిపోయిందని పరిశీలకులు పోలీసుల విచారణలో తెలిన అంశాలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు.  అదలా ఉంటే జగన్ పై దాడికి పాల్పడ్డారంటూ ఐదుగురు యువకులను పోలీసులు   పోలీసుస్టేషన్‌కు తీసుకురావడంపై  అక్కడి బడుగువర్గా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాడితో సంబంధం లేని తమ పిల్లలను అన్యాయంగా తీసుకువచ్చారంటూ వడ్డెర కుల స్తులంతా పోలీసుస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. 200రూపాయలిచ్చి తమను జగన్ మీటింగుకు తీసుకువెళ్లి, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదని.. పోలీసులు అదుపులోకి తీసుకున్న సతీష్ అనే యువకుడి తల్లి మీడియా ముందు  చెప్పిన మాటల వీడియో  సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది, వైసీపీ పరువు, జగన్ పరువును రోడ్డు కీడ్చింది.  సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే యువకుడే. ఫుట్‌పాత్ కోసం వేసే టైల్ రాయిని సీఎంపైకి విసిరి గాయపరిచాడన్నది పోలీసులు ఆరోపణ.  అతనితోపాటు ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే  పోలీసుల తీరుకు నిరసనగా డాబా సెంటర్‌లో వడ్డెర కులస్తులు భారీ సంఖ్యలో రాస్తారోకో చేయడం సంచలనం సృష్టించింది. మొత్తం మీద జగన్ పై గులకరాయి దాడి ఘటన జగన్ సభలకు డబ్బులు, మద్యం ఆశచూపి జనాలను తరలించడమే కాకుండా, వచ్చిన వారికి చెప్పిన విధంగా డబ్బులు ఇవ్వకుండా వైసీపీ మోసం చేస్తోందని బట్టబయలైంది.   గత ఎన్నికల్లో కోడికత్తి.. బాబాయ్‌పై గొడ్డలిపోటు సానుభూతి దారిలోనే.. రాయిదాడిని భూతద్దంలో చూపి, దానిని జగన్‌పై హత్యాయత్నంగా మలచి, ఓట్లు ఒలుచుకోవాలన్న వైసీపీ వ్యూహంబెడిసి కొట్టింది.  

By
en-us Political News

  
గాజుగ్లాసు గుర్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలో ఉంది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం ఆ పార్టీ పోటీ చేయని స్థానాలలో మాత్రం ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
60 వేల కోట్ల రూపాయ‌ల‌తో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి రేవంత్ స‌ర్కార్ సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే మూసీలో ప్రతిరోజూ నీటి ప్రవాహం ఉండాలి. అందు కోసం గజ్వేల్ నియోజకవర్గంలోని కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా 15 టీఎంసీల తాగునీటిని హైదరాబాద్​కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో 10 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు సంపూర్ణంగా తీర్చడంతోపాటు , 5 టీఎంసీల నీటిని మురికికూపంగా మారిన మూసీనది ప్రక్షాళనకు ఉపయోగించబోతున్నారు
అది మే నెల 7వ తేదీ... 2014 సంవత్సరం. పులివెందులలో వాతావరణం సందడిగా వుంది. ఆరోజు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది.
విజయవాడలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదండగా మరణించారు.
ఏలూరు లోక్ సభ నియోజకవర్గంలోనూ, ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తెలుగుదేశం కూటమి దూసుకుపోతున్నది. ఏలూరు లోక్ సభ స్థానంతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లన్నిటిలోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
జిల్లాలో ఆ కుటుంబంలో నిట్టనిలువుగా వచ్చిన చీలిక కారణంగా.. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబీకులకు ఎదురు నిలిచి మాట్లాడే పరిస్థితే ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబానికి చెందిన వారితో ఎదురుపడి మాట్లాడటమే కాదు, నిలబెట్టి ప్రశ్నిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.
మనసు ఒక చోట..మనువు ఒకచోట అన్నట్లుగా ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ వైఖరి ఉంది. గత ఐదేళ్లుగా వైసీపీ, బీజేపీల రహస్య మైత్రి ఎంత దృఢంగా కొనసాగిందో తెలిసిందే. అయితే కేంద్రంలో అధికారాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి దక్షిణాది నుంచి కూడా మద్దతు అనివార్యం అన్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ పార్టీ పాతమిత్రులకు ఆహ్వానం పలికింది. ముఖ్యంగా ఏపీలో ప్రజాభిమానం మెండుగా ఉన్న తెలుగుదేశం అవసరం బీజేపీకి తప్పని సరి అయ్యింది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టారు.
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి మేనిఫెస్టో విడుదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్​న్యూస్​.తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.  . రిజల్ట్స్​ కోసం చూస్తున్న వారి ఎదురు చూపులకు తెరదించుతూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు.   ఈ యేడు  విద్యార్థులు పదోతరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. 
జవీధుల్లోనూ, పండితుల చర్చాగోష్టుల్లోనూ, రాజదర్బారుల్లోనూ మాత్రమే వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్ని, సామాన్యుడి చెంతకూ, మట్టివీధుల వరకూ.. తీసుకొచ్చిన మహాకవి శ్రీశ్రీ. అందుకే ఆయన పేరు తెలియని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తికాదు. పేరు తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో వెలుగుతూనే ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.