ఏపీలో వార్ వన్ సైడే డౌటే లేదు!

Publish Date:Apr 17, 2024

Advertisement

ఏపీలో జనం డిసైడైపోయారు. సాధారణంగా ఏ ఎన్నికలలోనైనా సరే   చివరి నిముషం వరకూ ఎవరికి ఓటు వేయాలన్న నిర్ణయం తీసుకోకుండా వేచి చూసే తటస్థ ఓటర్లు ఉంటారు. సాధారణంగా ఎన్నికల ఫలితాలు ఆ తటస్థ ఓటర్లు మెగ్గు చూపిన పార్టీ లేదా కూటమికే సానుకూలంగా ఉంటాయి. అయితే ఆశ్చర్యకరంగా ఏపీలో ప్రస్తుతం తటస్థ ఓటర్లు అనే వారే లేకుండా పోయారు. జగన్ అరాచక, అస్తవ్యస్థ పాలన కారణంగా తటస్థ ఓటర్లు ఇప్పటికే తాము ఎటువైపు ఉండాలన్న నిర్ణయం తీసేసుకున్నారు.  దీంతో రాష్ట్రంలో పరిస్థితి ఎలక్షన్ వార్ వన్ సైడైపోయిందన్న పరిస్థితి కనిపిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ లో  ఎన్నికల సమరంలో అధికార వైసీపీ చేతులెత్తేసిందా అనిపించేలా రాష్ట్రంలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల హీట్ పీక్స్ చేరిన ఈ సమయంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి బస్సు యాత్రకు జనస్పందన అంతంత మాత్రంగా ఉండటం, అదే సమయంలో విపక్ష నేత ప్రజాగళం సభలకు జనం పోటెత్తుతుండటం చూస్తుంటే జనం మూడ్ ఏమిటన్నది అర్థమైపోతోంది. అదే సమయంలో పలు మీడియా, సర్వే సంస్థలు వెలువరించిన సర్వేలు కూడా ఏపీలో తెలుగుదేశం కూటమి సునామీ ఖాయమని చెబుతున్నాయి. ఒకటి రెండు అని కాదు.. ఇప్పటి వరకూ వెలువడిన దాదాపు అన్ని సర్వేలూ కూడా తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందనే అంచనా వేశాయి. ఒక సర్వేను మించి మరో సర్వే కూటమి గెలిచే స్థానాల సంఖ్య పెచ్చుగా ఉంటుందని చెబుతున్నాయి. ఇప్పటి వరకూ ఏపీ ఎన్నికలకు సంబంధించి దాదాపు పది సర్వేలు వెలువడ్డాయి. అన్ని సర్వేలూ కూడా కూటమి విజయాన్ని ఖరారు చేస్తున్న విధంగానే  ఫలితాలు వెలువరించాయి. 

ఇండియా టుడే సర్వే తెలుగుదేశం కూటమి 17 లోక్ సభ స్థానాలలో  విజయకేతనం ఎగురవేస్తుందనీ, వైసీపీ ఎనిమిది స్థానాలకే పరిమితమౌతుందనీ పేర్కొంది. ఇంొడియా టుడే గతంలో రాష్ట్రంలో వైసీపీ ప్రభంజనం మరోసారి తధ్యమని పేర్కొన్న సంగతి విదితమే. అయితే రాష్ట్రంలో పరిస్థితులపై వాస్తవాన్ని గ్రహించి ప్లేటు ఫిరాయించింది. ఇక సీఎన్ఎన్ న్యూస్ నిర్వహించిన సర్వే తెలుగుదేశం కూటమి  18 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందనీ, అధికార వైసీపీ కేవలం ఏడు స్థానాలకే పరిమితమౌతుందని అంచనా4 వేసింది. ఇక ఇండియా టీవీ నిర్వహించిన సర్వే కూడా ఇండియా టుడే ఫలితాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇండియా టీవీ సర్వే ప్రకారం తెలుగుదేశం కూటమి 17 లోక్ సభ స్థానాలలోనూ, అధికార వైసీసీ 8 స్థానాలలోనూ గెలిచే అవకాలున్నాయని పేర్కొంది.  న్యూస్ ఎక్స్ సర్వే అయితే తెలుగుదేశం కూటమికి 18, వైసీపీకి 7 లోక్ సభ స్థానాలలో విజయం సిద్ధిస్తుందని అంచనా వేసింది. 

ఏబీపీ న్యూస్ అయితే వైసీపీ కేవలం ఐదు లోక్ సభ స్థానాలకే పరిమితమౌతుందనీ, తెలుగుదేశం కూటమి ఇరవై స్థానాలలో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అంచనా వేసింది. జనమత్ పోల్స్ నిర్వహించిన సర్వే తెలుగుదేశం కూటమికి 17, వైసీపీకి 8 లోక్ సభ స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. 

స్కూల్ ఆఫ్ పోలటిక్స్ సర్వేలో తెలుగుదేశం కూటమికి అత్యధికంగా 23 లోక్ సభ స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని తేల్చింది. అధికార వైసీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమౌతుందని పేర్కొంది. పీపుల్స్ రైట్  సంస్థ సర్వే ఫలితం కూడా  సరిగ్గే ఇలానే  ఉంది. అధికార వైసీపీ రెండు స్థానాలకే పరిమితమౌతుందని, తెలుగుదేశం కూటమి 23 లోక్ సభ స్థానాలలో జయకేతనం ఎగురవేయడం ఖాయమని పీపుల్స్ రైట్ సర్వే పేర్కొంది. 

ఇక పయనీర్ పోల్ అయితే తెలుగుదేశం 18 లోక్ సభ స్థానాలను కైవశం  చేసుకుంటుందనీ, వైసీపీ ఏడు స్థానాలకే పరిమితమౌతుందని తేల్చింది. ఇండియా న్యూస్ సర్వే కూడా ఇదే ఫలితం వెలువరించింది. ఇక జీ న్యూస్ అయితే తెలుగుదేశం కూటమికి 17, వైసీపీకి 8 లోక్ సభ స్థానాలు దక్కుతాయని పేర్కొంది. 
ఇలా ఏపీ ఎన్నికల విషయంలో అధికార వైసీపీకి ఎటువంటి అవకాశం లేదని దాదాపు అన్ని సర్వేలూ తేల్చాయి.  ఈ సర్వేలన్నీ రాష్ట్రంలో ప్రజల మూడ్ ఎలా ఉందన్నది పట్టి చూపాయి. అయితే ఐదేళ్ల కిందట అద్భుత మెజారిటీతో ఘన విజయం సాధించిన వైసీనీ కేవలం ఐదేళ్లలో ఇంతటి స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి  ఈ ఐదేళ్లలో జగన్ సర్కార్ సాగించిన ప్రజా వ్యతిరేక పాలనే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో   ఏపీలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది.  గురువారం (ఏప్రిల్ 18) నోటిఫికేష్ వెలువడనుంది.  

గత ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా పోలీసు పాలన సాగిందన్న అభిప్రాయం ప్రజలలో బలంగా వ్యక్తం అవుతోంది.   జగన్ సర్కార్ అభివృద్ధిని విస్మరించి కేవలం బటన్ నొక్కుడు ద్వారా సొమ్ముల పందేరమే పాలన అన్నట్లుగా వ్యవహరించింది. దానికి తోడు అభివృద్ధి గురించి ప్రశ్నించినా, హక్కుల కోసం గళమెత్తినా వారిపై ఉక్కుపాదం మోపింది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోవడంతో  ప్రజలపై విపరీతంగా పన్నుల భారం మోపింది. లబ్ధి అంటూ పావలా పందేరం చేసి... రూపాయిని పన్నుల రూపంలో లాగేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పథకాల లబ్ధి దారులపై కూడా జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది.  అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేయడం, ప్రజల హక్కులను కాలరాయడం వంటి చర్యల కారణంగా సమాజంలోని ఏ వర్గమూ జగన్ పాలన పట్ల సానుకూలంగా లేని పరిస్థితి నెలకొంది. దానినే సర్వేలన్నీ ఎత్తి చూపాయి.  

ఐదేళ్ల పాల‌న‌లో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత‌ పాల‌న సాగించారని, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు కూడా కనిపించడం లేదనీ, జగన్ పాలనలో సమాజంలోకి ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదనీ ఈ సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి. జగన్ అస్తవ్యస్త, అరాచక పాలన పట్ల ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నార‌నీ, అన్ని వ‌ర్గాల వారూ ఏకతాటిపైకి వ‌స్తూ వైసీపీ ప్ర‌భుత్వానికి గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని సర్వేల ఫలితాలు నిర్ద్వంద్వంగా సూచిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష నిదర్శనం  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌కు ప్ర‌జాద‌ర‌ణ క‌రువైంది. వైసీపీ కార్య‌క‌ర్త‌లు సైతం బ‌స్సు యాత్ర‌లో పాల్గొనేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు.  వీటన్నిటినీ బట్టి చూస్తే రానున్న రోజులలో అంటే పోలింగ్ సమయం దగ్గరపడేకొద్దీ వైసీపీ గ్రాఫ్ మరింత దిగజారడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
మనసు ఒక చోట..మనువు ఒకచోట అన్నట్లుగా ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ వైఖరి ఉంది. గత ఐదేళ్లుగా వైసీపీ, బీజేపీల రహస్య మైత్రి ఎంత దృఢంగా కొనసాగిందో తెలిసిందే. అయితే కేంద్రంలో అధికారాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి దక్షిణాది నుంచి కూడా మద్దతు అనివార్యం అన్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ పార్టీ పాతమిత్రులకు ఆహ్వానం పలికింది. ముఖ్యంగా ఏపీలో ప్రజాభిమానం మెండుగా ఉన్న తెలుగుదేశం అవసరం బీజేపీకి తప్పని సరి అయ్యింది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టారు.
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి మేనిఫెస్టో విడుదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్​న్యూస్​.తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.  . రిజల్ట్స్​ కోసం చూస్తున్న వారి ఎదురు చూపులకు తెరదించుతూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు.   ఈ యేడు  విద్యార్థులు పదోతరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. 
జవీధుల్లోనూ, పండితుల చర్చాగోష్టుల్లోనూ, రాజదర్బారుల్లోనూ మాత్రమే వెలుగుతున్న తెలుగు సాహితీ సౌరభాల్ని, సామాన్యుడి చెంతకూ, మట్టివీధుల వరకూ.. తీసుకొచ్చిన మహాకవి శ్రీశ్రీ. అందుకే ఆయన పేరు తెలియని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తికాదు. పేరు తెలుగు భాష, తెలుగు జాతి ఉన్నంత కాలం చరిత్రలో వెలుగుతూనే ఉంటుంది.
భార్య చేసే పనులకు భర్త తిట్లు తినాలి.. భర్త చేసే పనులకు భార్య అక్షింతలు వేయించుకోవాలి.. ఇదీ భార్యాభర్తల మధ్య వుండే విచిత్రబంధం.
కేంద్ర హోం మంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా హెలికాప్టర్‌కి ప్రమాదం తప్పిందని, ఆయన ప్రయాణించిన
పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరిన సమయంలో కూడా చల్లటి వినాదాన్ని పంచగల దిట్ట ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏపాల్ మాత్రమేనని ఇంత కాలం అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏపీ ఎన్నికల ముంగిట అధికార పార్టీ అదినేత వైఎస్ జగన్ పొలిటికల్ కామెడీని పండించడంలో పాల్ ను మించిపోయాడని అంటున్నారు. ఔను వైఎస్ జగన్ ఇటీవలి కాలంలో తన మాటలు, చేతలు, ప్రసంగాలలో కామెడీని బ్రహ్మాండంగా పండిస్తున్నారు.
ఏపీలో ఎన్నికల తేదీ రోజుల్లోకి వచ్చేసింది. కచ్చితంగా చెప్పాలంటే మరో 14 రోజుల్లో ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల హీట్ రోహిణీకార్తె ఎండలను మించిపోయింది. పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలైపోయి ఉన్నాయి. పార్టీల అధినేతలు బహిరంగ సభలు, రోడ్ షోలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత వేరే లెవెల్ లో కనిపిస్తోంది. దీంతో అధికార వైసీపీలో ఓటమి భయం కూడా స్పష్టంగా కానవస్తోంది.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (ఏప్రిల్ 30)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో నాలుగు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే ముందు... నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఈ  ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ  గల్ఫ్ జెఏసి చైర్మన్, గుగ్గిల్ల రవిగౌడ్ బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.