60 వేల కోట్ల రూపాయ‌ల‌తో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు!

Publish Date:Apr 30, 2024

Advertisement

ఒకప్పుడు మూసీ నీరు.. సాగు, తాగు, పాడి, మత్స్య అవసరాలకు ఉపయోగపడేది. దాంతో హైదరాబాద్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రయోజనం కలిగేది. అంత గొప్ప చరిత్ర కల్గిన మూసీ, నేడు కాలుష్యమయంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది.  దేశంలోనే అత్యంత కాలుష్య నదుల్లో ఒకటిగా  మారింది.  మూసీని ప్రక్షాళన చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలోనే పుట్టి, తెలంగాణలోనే ప్రవహించి, తెలంగాణలోనే ముగుస్తున్న మూసీని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప‌ర్యావ‌ర‌ణ వేత్తలు ప‌దే ప‌దే గుర్తు చేస్తున్నారు.  

హైదరాబాద్ లో డెవలప్ మెంట్ పేరుతో చేస్తున్న విధ్వంసమే ఈ పరిస్థితికి కారణమని ప‌ర్యావ‌ర‌ణ వేత్త వేత్త డా. లుబ్నా సార్వత్  ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  మూసీ నదికి ఉన్న బోలెడు ఇన్ లెట్స్ ద్వారా కలుషిత నీళ్లు కలుస్తున్నాయి. హుస్సేన్ సాగర్ నుంచి మూసాపేట వరకు చాలా చోట్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలు మూసీలో కలుస్తున్నాయి.  జీహెచ్ఎంసీ పరిధి దాదాపు 650 చదరపు కిలోమీటర్లు ఉండగా.. హుస్సేన్ సాగర్ క్యాచ్ మెంట్ ఏరియానే 267 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇలా నగరంలోని పలు చోట్ల నుంచి వ్యర్థాలు, కలుషిత నీళ్లు వివిధ ఇన్ లెట్ల ద్వారా మూసీలో కలుస్తున్నాయి.  హైటెక్ సిటీ నుంచి వచ్చే మురుగు నీరు కూడా మూసీలో కలుస్తుంది. 

వర్షపు నీటిని తీసుకెళ్లాల్సిన చానళ్లన్నీ మురుగు నీరు, వ్యర్థాలను తీసుకుని చెరువుల్లో కలుస్తున్నాయి. అక్కడ నుంచి అవన్నీ మూసీలో చేరుతున్నాయి. ఎక్కడ వస్తున్న వ్యర్థాలు, మురుగు నీటిని అక్కడికక్కడ సమర్థంగా నిర్వహించడమే దీనికి ఏకైక పరిష్కారమని ప‌ర్యావ‌ర‌ణ వేత్త వేత్త డా. లుబ్నా సార్వత్ చెబుతున్నారు. 

మూసీలోకి నీటిని తీసుకొచ్చే మార్గాలెన్ని ఉన్నాయి? నీటి నిల్వకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మూసీ ఫ్లడ్‌ లెవల్‌ ఎంతుంది? వరద ప్రభావిత ప్రాంతాలెన్ని?’’.  మూసీ అభివృద్ధికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఎంత భూమి అవసరం అవుతుంది? పరిహారం చెల్లించాల్సి వచ్చే నివాస ప్రాంతాలెన్ని ఉన్నాయి? అనే అంశాల‌పై రేవంత్ ప్ర‌భుత్వం స్ట‌డీ చేస్తోంది. మూసీ ప్రక్షాళనతోపాటు.. తొలి దశ అభివృద్ధి పనులకు సుమారు రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ అవసరం అవుతుందనే ప్రాథమిక అంచనాలను అధికారులు సీఎం ముందు పెట్టారు. 

మొత్తం 60 వేల కోట్ల రూపాయ‌ల‌తో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి రేవంత్ స‌ర్కార్ సిద్ధమవుతోంది.  ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే మూసీలో ప్రతిరోజూ నీటి ప్రవాహం ఉండాలి. అందు కోసం గజ్వేల్  నియోజకవర్గంలోని  కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా 15 టీఎంసీల తాగునీటిని హైదరాబాద్​కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో 10 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు సంపూర్ణంగా తీర్చడంతోపాటు , 5 టీఎంసీల నీటిని మురికికూపంగా మారిన మూసీనది ప్రక్షాళనకు ఉపయోగించబోతున్నారు., దానికి 4 వేల కోట్లకు పైగా వ్యయమయ్యే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు. దీనికి హడ్కో  దాదాపు ఆమోద ముద్ర వేయబోతుందని పురపాలక అధికారులు చెబుతున్నారు. ఏడాదిన్నరలో ప్రాజెక్టును పూర్తిచేయాలన్నది జలమండలి లక్ష్యమని అధికారులు తెలిపారు.

మూసీ నది అనంతగిరి వికారాబాద్ పర్వతాల్లో పుట్టింది.  హైదరాబాద్​ నగరం గుండా ప్రవహిస్తూ వాడేపల్లి మిర్యాలగూడ వద్ద కృష్ణాలో కలుస్తున్నది. హైదరాబాద్ లో 1908 సెప్టెంబర్ 28 న వచ్చిన పెద్ద వరద కారణంగా దాదాపు 15,000 మంది చనిపోయారు. 80,000 మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో దీన్ని ఒక పెద్ద విపత్తుగా పరిగణించారు.   ప్రముఖ ఇంజినీరు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి నైజాం కోరిక మేరకు వరద బాధల నుంచి తప్పించాలని ఆనాడు మూసీనదిపై గండిపేట వద్ద ఉస్మాన్ సాగర్​ రిజర్వాయరును 1920లో,  మూసీ నది ఉపనది అయిన ఈసీ నదిపై హిమాయత్ సాగర్​ 1927 రిజర్వాయర్ ను,  రెండు జలాశయాలను నిర్మించి హైదరాబాద్  ప్రజలకు  తాగునీటి,  మురుగు నీరు వ్యవస్థను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం కనుగొన్నారు. 
 
1997లో  నందనవనం పేరుతో మూసీ సుందరీకరణ కోసం ఉమ్మడి ఏపీ  ప్రభుత్వ కాలంలో..  కులీ కుతుబ్​షా అర్బన్ డెవలప్​మెంట్​అథారిటీ ఒక పథకం రూపొందించింది.  అనంతరం  వాటరు బోర్డు  అబెట్​మెంట్​ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ మూసీ రివర్  పేరుతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో  రూ. 405 కోట్లు నిధులు  ఖర్చు చేశారు . కాలుష్య నియంత్రణకు గ్రేటర్​ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్  రూ .50 కోట్లతో రబ్బరు డ్యామ్ నిర్మించారు. కానీ, నిరుపయోగమైనది.   మూసీ యథావిధిగా దుర్వాసన కలుషితమైన నీరుతోనే కనబడుతున్నది. కలుషితమైన నీటితో పండించిన వ్యవసాయోత్పత్తులు కూడా పూర్తిగా రసాయనాలతో కూడి ఉన్నాయని ఒక స్టడీలో ఉస్మానియా యూనివర్సిటీ తెలిపింది.  పలు సంస్థలు, ఎన్ జీఆర్ఐ శాస్త్రవేత్తలు చేసిన పరీక్షలో  మూసీ పరీవాహకం భూగర్భ జలాలు కాలుష్యంతో నిండిపోయినట్లు తేలింది. 

- ఎం.కె. ఫ‌జ‌ల్‌

By
en-us Political News

  
ఏపీలో అల్లర్లపై 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహిస్తారు.
తెలంగాణ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి, ఆంధ్రులపై వ్యతిరేకతను తిరగదోడి ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగిలాయి. బిఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అయిన సమయంలో హైకోర్టు తీర్పు ప్రకారం బిఆర్ఎష్ ఎమ్మెల్సీ దండె విఠల్ చెల్లదు. కానీ లోకసభ ఎన్నికల తర్వాత మాత్రం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 
శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ ఆశలకు కాంగ్రెస్ భారీ గండి కొట్టింది. దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడి విజయం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అదృశ్యమయ్యారు. వారు కనిపించడం లేదంటూ గన్​మెన్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. అరెస్టు భయంతోనే అదృశ్యమయ్యారనే చర్చ నడుస్తోంది.
ఆనాడు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో ఎలాంటివాడో, ఇప్పుడు రాష్ట్రం అట్టుడికిపోతుంటే పట్టించుకోకుండా విహారయాత్రకు వెళ్తున్న జగన్ కూడా అలాంటివాడే.
పర్యాటకరంగం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి వారధిగా, సాంస్కృతిక వారధిగా వ్యవహరించాలని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.
నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరులో కేరళ తీరం తాకనున్నాయని వెదర్ రిపోర్ట్ వచ్చిన రోజే అంటే గురువారం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షం దంచి కొట్టడంతో ట్రాపిక్ జామ్ అయ్యింది. నేడు రెండో రోజు కూడా వర్షం నగరాన్ని ముంచెత్తనుంది. 
వివేకా హత్య కేసుపై ఎన్నికలు పూర్తయ్యే వరకూ మాట్లాడవద్దంటూ కడప హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కడప కోర్టు తన ఉత్తర్వులలో డాక్టర్ సునీత , షర్మిల సహా కొందరు విపక్ష నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ వారెవరూ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా వివేకా హత్య కేసు విషయాన్ని ప్రస్తావించకూడదంటే ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇలాంటి సందర్భాల్లో సీపీఆర్ అందించగలిగితే ప్రాణాలు నిలబడతాయి. అందుకే అందరికీ సీపీఆర్ మీద అవగాహన వుండాలి. సీపీఆర్ నేర్చుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో మహాభారత యుద్ధాన్ని తలపించిన ఎన్నికల రణం ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ ఎన్నికలలో ప్రధానంగా అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి మధ్యే పోరు జరిగింది. పోలింగ్ పూర్తయిన తరువాత ఆయా పార్టీల నేతల భాష్, బాడీ లాంగ్వేజ్ ని బట్టి గెలుపు ఎవరిది, ఓటమి పాలయ్యేది ఎవరు అన్నది జనాలకు స్పష్టంగా తేలిపోయింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయను స్వంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కలవడానికి పెద్దగా ఆసక్తికనబరచడం లేదు.
ముఖ్యమంత్రిగానే కాదు, ఆపద్ధమర్మ ముఖ్యమంత్రిగా కూడా జగన్ మోసాలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు గతంలో బటన్ నొక్కేశాను, ఆ డబ్బులు ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలలో అర్జంటుగా జమ చేసేయండి అంటూ తనకు తైనాతీగా వ్యవహరిస్తున్న సీఎస్ ను ఆదేశించారు. దీంతో సీఎస్ జవహరర్ రెడ్డి తక్షణం ఆ పని చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీచేసేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.