జగన్ ఆరాటమంతా రైతన్నల కోసమేనా?

Publish Date:Jun 9, 2014

Advertisement

 

జగన్మోహన్ రెడ్డి తనను తాను విశ్వసనీయతకు నిలువెత్తు సజీవ రూపంగా వర్ణించుకొంటారు. కానీ సరిగ్గా అదే ఆయనలో లోపించింది. ఆ కారణం చేతనే ఓటమి పాలయ్యారు. అయినా దానిని ఆయన అంగీకరించేందుకు సిద్దంగా లేరు. చంద్రబాబు భూటకపు హామీలను ప్రజలు గుడ్డిగా నమ్మడం వలననే తాను ఓడిపోయానని సర్ది చెప్పుకొంటున్నారు. తనను తాను దీనజన బాంధవుడిగా, రైతన్నల నేస్తంగా వర్ణించుకొనే జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయాలని మనస్పూర్తిగా కోరుకొని ఉంటే అందరూ మెచ్చుకొని ఉండేవారు. కానీ ఆయన చంద్రబాబు నాయుడు రుణాలు మాఫీ చేయలేక చేతులెత్తేయాలని, అప్పుడు తను ఆయనను ప్రజల మధ్య నిలబెట్టి చీల్చి చెండాడేసి, తన ఓటమికి ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడిపోతున్నారు.

 

రైతులు సంక్షేమం కోసం రుణాలు మాఫీ అవ్వాలని ఆరాటపడవలసిన జగన్మోహన్ రెడ్డి, ఈవిధంగా చంద్రబాబు నాయుడు విఫలం అవ్వాలని కోరుకోవడం గమనిస్తే ఆయన విశ్వసనీయత ఏపాటిదో అర్ధం అవుతోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రుణాల మాఫీ అంతా ఒక డ్రామా అని తేల్చి చెప్పిన జగన్మోహన్ రెడ్డి, నిన్న చంద్రబాబు మొట్ట మొదట రుణాల మాఫీ ఫైలుపైనే తొలి సంతకం చేయడం, వెంటనే ఒక కమిటీని వేసి 45రోజుల్లో మొత్తం అన్ని రుణాల గురించి పూర్తి వివరాలు, వాటి మాఫీకి విధివిధానాలు చెప్పమని ఆదేశించడంతో కంగు తిన్నారు.

 

ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా రుణాలమాఫీ చేయడానికి కమిటీ ఎందుకని ప్రశ్నిస్తూ చంద్రబాబుకి ఒక బహిరంగలేఖ వ్రాసారు. వెంటనే రైతుల రుణాలన్నీ మాఫీ చేయకపోతే వారు కొత్త రుణాలు తీసుకోవడానికి వీలుపడదని ఆందోళన పడిపోతున్నారు. ఆయన ఈ తపనంతా రైతుల సంక్షేమం కోసమే అయితే నిజంగా అందరూ మెచ్చుకొనేవారు. కానీ అది కేవలం చంద్రబాబుని ప్రజలలో దోషిగా నిలబెట్టేందుకేనని అర్ధమవుతూనే ఉంది.

 

చంద్రబాబు నిన్ననే ప్రమాణ స్వీకారం చేసారు. కానీ ఇంకా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు. మంత్రులకు శాఖలు కేటాయించలేదు. కనీసం ఆర్ధికమంత్రిని కూడా ఇంకా నియమించలేదు. అందువల్ల ఇంకా తొలి మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించలేదు. జగన్మోహన్ రెడ్డికి ఇదంతా తెలిసి ఉనప్పటికీ, తెలియనట్లుగా నటిస్తూ, ఇప్పటికిప్పుడు వెంటనే ప్రభుత్వం రుణాలు మాఫీ చేసేయాలని లేకపోతే ప్రజలను మోసం చేస్తునట్లేనని తేల్చి చెప్పడం చూస్తే ఆయన చంద్రబాబుపై ఎంతగా రగిలిపోతున్నారో, ఆయనను అప్రదిష్టపాలు చేయడానికి ఎంతగా తహతహలాడిపోతున్నారో అర్ధమవుతుంది.

 

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది రైతులు, వివిధ బ్యాంకుల ద్వారా తీసుకొన్న వేలకోట్ల అప్పుల గురించి ఏ వివరాలు తెలుసుకోకుండా వాటిని ప్రభుత్వం మాత్రం ఏవిధంగా మాఫీ చేయగలదు? ఏ ఏ బ్యాంకుకు ఎంత మొత్తం అప్పులు తిరిగి చెల్లించాలి? దాని అసలెంత? వడ్డీ ఎంత? ముందుగా బ్యాంకులు రైతుల రుణాలను మొత్తం మాఫీచేసి, ఆ తరువాత వాటిని ప్రభుత్వం తిరిగి వాయిదా పద్దతుల ద్వారానో లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీ ఇవ్వడం ద్వారానో లేదా ప్రభుత్వ బాండ్లు వంటివి సమర్పించడం ద్వారానో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తాయా? వంటి అనేక వివరాలు సేకరించవలసిన అవసరముంటుంది.

 

 నిరక్షరాస్యులయిన రైతులకు ఇటువంటి సాంకేతిక అంశాలు గురించి తెలియదు గనుక చంద్రబాబు రుణమాఫీ చేయకుండా తప్పించుకోనేందుకే కమిటీ వేసారని టాంటాం చేస్తూ జగన్మోహన్ రెడ్డి రైతన్నలను కూడా తప్పు దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోంది. రైతుల సంక్షేమం కోసం పోరాడుతున్నానని చెప్పుకొంటున్న జగన్మోహన్ రెడ్డి తన మాటలు, చేతల ద్వారా వారికి దైర్యం చెప్పకపోగా వారిలో నిరాశ, నిస్పృహలు కలిగిస్తున్నారు. రైతన్నల సంక్షేమం కంటే, తన రాజకీయ శత్రువు చంద్రబాబుపై పైచేయి సాధించడమే ముఖ్యమనుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణాలో రైతన్నల రుణాలమాఫీపై వెనకడుగు వేసినా ఆయనను పల్లెత్తు మాటనలేదు. పైగా ఆయన అడగకుండానే ఆయన ప్రభుత్వానికి అంశాల వారిగా మద్దతు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ చంద్రబాబు రుణాల మాఫీ చేస్తూ ఫైలుపై సంతకం చేసినప్పటికీ, ఆయనపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఈ ద్వంద వైఖరి గమనిస్తే ఆయన విశ్వసనీయత ఎంత గొప్పదో అర్ధమవుతుంది. బహుశః దీనినే ఆయన విశ్వసనీయత అనుకొంటున్నారేమో!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.