చంద్రునికి పట్టాభిషేకం

Publish Date:Jun 8, 2014

Advertisement

 

దేశంలో, రాష్ట్రంలో ఐదేళ్ళకోసారి ఎన్నికలు వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. అప్పుడు ఏ పార్టీ ఎన్నికలలో గెలిచి అధికారం చేపడుతుందా? అనే ఆసక్తి తప్ప ప్రజలలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలపై ఎటువంటి గొప్ప ఆశలు ఉండేవి కావు. ఎందువలన అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులలో ఎటువంటి మార్పురాదనే ఒక రకమయిన నిరాశ ప్రజలలో నెలకొని ఉండటమే కారణం. కానీ ఈసారి జరిగిన ఎన్నికలలో మాత్రం కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు యావత్ దేశ ప్రజలందరూ కూడబలుకొన్నట్లు, చాలా కసితో, చాలా ఆశతో అవినీతికి అసమర్ధతకు మారుపేరుగా మారిన కాంగ్రెస్ పార్టీని దించి, కేంద్రంలో నరేంద్ర మోడీని, ఆంధ్రాలో చంద్రబాబును, తెలంగాణాలో కేసీఆర్ లకు తిరుగులేని మెజార్టీతో అధికారం కట్టబెట్టారు.

 

గత అరవై ఏళ్లలో రాజకీయ పార్టీలపై, చివరికి ప్రభుత్వాలపై కూడా ఎటువంటి నమ్మకం పెట్టుకోకుండా, ఏమీ ఆశించకుండానే ఓటేస్తూ వచ్చిన భారతీయలు, ముఖ్యంగా తెలుగు ప్రజలు ఈసారి కోటి ఆశలతో బీజేపీ, తెరాస, తెదేపాలకు ఏరికోరి ఓటేసి గెలిపించుకొన్నారు. గత అరవై ఏళ్లుగా దేశప్రజలందరూ ఎటువంటి అభివృద్ధికోసం కళ్ళుకాయలు కాసేలా చూస్తున్నారో, దానిని వారు ముగ్గురు కూడా ప్రజల కళ్ళ ముందు ఆవిష్కరించి చూపడమే కాకుండా దానిని నిజం చేసి చూపుతామని వారు ఇచ్చిన భరోసాయే ప్రజలను వారికి ఓటేయించింది. అందుకే వారి ముగ్గురిపై ప్రజలలో చాలా భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి.

 

ఇక మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు కొలువు తీరి అప్పుడే కార్య రంగంలో దిగాయి గనుక, ఇక అందరి దృష్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు ప్రభుత్వంపై కేంద్రీకృతమయి ఉన్నాయి. ఆయన తమను రుణవిముక్తులను చేస్తారని అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన పాలనను, గాడి తప్పిన ఆర్ధిక వ్యవస్థను ఆయన తిరిగి గాడిలో పెడతారని త్రిశంకు స్వర్గంలో నలిగిపోతున్న మధ్యతరగతి ప్రజలందరూ చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు.

 

రాజధాని కూడా లేని దుస్థితిలో ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అద్భుతమయిన రాజధానిని నిర్మించి ఇస్తారని రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చేతిలో చిల్లి గవ్వ లేదని తెలిసినప్పటికీ, అపార పరిపాలనానుభావం, కృషి, పట్టుదల, కేంద్రంతో సత్సంబందాలు అన్నీ ఉన్న చంద్రబాబు తప్పకుండా ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి, మళ్ళీ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతారని ప్రజలందరూ గట్టిగా నమ్ముతున్నారు.

 

కోటి ఆశల నడుమ, కోటి సమస్యల నడుమ, శత కోటి సవాళ్ళ నడుమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపడుతున్న చంద్రబాబు నాయుడు సమర్ధతకు, సార్యదక్షతకు ఇదొక పెద్ద సవాలు. సమస్యలెదురయినప్పుడు వాటిని చూసి భయపడకుండా వాటిని తన సమర్ధతను నిరూపించుకొనేందుకు వచ్చిన అవకాశాలుగా స్వీకరిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పడం ఆయన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది. ఆ ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పదం, కార్యదక్షతలను చూసే ప్రజలు నేడు ఆయనకు పట్టం కడుతున్నారు.

 

ఆయన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందాలని కోరుకొందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడుగారికి, ఆయన మంత్రివర్గ సభ్యులందరికీ తెలుగువన్ శుభాభినందనలు తెలియజేస్తోంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.