ఇకనయినా జగన్ ఆత్మవిమర్శ చేసుకొంటారా?

Publish Date:Jun 12, 2014

Advertisement

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓటమికి కారణాలు కనుగొనేందుకు, విశాఖపట్నంలో నిన్న ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలోనే, అదే జిల్లాకు చెందిన వైకాపా నేత దాడి వీరభద్రరావు, పార్టీ ఓటమికి జగన్మోహన్ రెడ్డే ప్రధాన కారకుడని, ఆయన నిరంకుశ ధోరణి వలననే పార్టీ ఎన్నికలలో ఓడిపోయిందని ఆరోపించడం విశేషం.

 

జగన్ పార్టీలో ఎవరినీ ఖాతరు చేయడని, తనకు తోచినట్లే చేస్తాడు తప్ప పార్టీలో ఎవరి సలహాలు స్వీకరించేందుకు కూడా ఇష్టపడడని, ఆయనొక డిక్టేటర్ అని ఆరోపించారు. షర్మిలకు టికెట్ ఇచ్చి ప్రోత్సహిస్తే ఆమె పార్టీలో రెండో అధికార కేంద్రంగా మారుతుందనే భయంతోనే ఆమెకు బదులు తల్లిని వైజాగ్ నుండి నిలబెట్టారని ఆరోపించారు. జగన్ తన తండ్రి చేప్పట్టిన సంక్షేమ కార్యక్రమాలను కాక, కేవలం తనను చూసే ప్రజలు ఓటేయాలని కోడరడం అతని అహంకారానికి నిదర్శనమని తీవ్రంగా విమర్శించారు.

 

సాధారణంగా పార్టీని వీడేవారు ఇటువంటి ఆరోపణలు చేయడం మామూలే. కానీ, వైకాపాను వీడుతున్నవారిలో చాలా మంది జగన్ తమకు పార్టీ టికెట్ ఇవ్వలేదనో లేకపోతే పార్టీ పదవులు దక్కలేదనో వీడినవారు చాలా తక్కువ. పార్టీని వీడుతున్న వారిలో చాలా మంది జగన్మోహన్ రెడ్డిపై ఇటువంటి ఆరోపణలే చేయడం గమనిస్తే, నిన్న దాడి వీరభద్ర రావు చేసిన ఆరోపణలు నిజమేనని స్పష్టమవుతోంది. దాడి పచ్చి అవకాశవాదే కావచ్చును. కానీ ఆయన మంచి విద్యావేత్త కూడా. ఆయన గత ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డిని చాలా దగ్గర నుండి చూసిన కారణంగా ఆయన ఆరోపణలలో 50 శాతం అయినా వాస్తవం ఉండకపోదు.

 

అయితే లోపం తనలో ఉంచుకొని జగన్ పార్టీ ఓటమికి సమీక్షా సమావేశాలు నిర్వహించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా మనుషులకు పుట్టుకతో వచ్చిన అవలక్షణాలను వదిలించుకోవడం అంత తేలిక కాదు. వాటిని గుర్తించి, వదిలించుకోవడానికి నిరంతరంగా గట్టి ప్రయత్నం చేసినప్పుడే వాటి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ, జగన్ పార్టీ ఓటమికి కారణాలు కళ్ళెదుట సపష్టంగా కనబడుతున్నప్పటికీ, కారణాలు కనుగొనేందుకు సమీక్షా సమావేశాలు నిర్వహించడం చూస్తే, ఆయన మారలేదని, మారబోరని దాడి వీరభద్రరావు అన్నమాటలను నమ్మవలసి వస్తుంది.

 

గత ఐదేళ్ళుగా అధికారం కోసం అలమటించిపోయిన జగన్మోహన్ రెడ్డి, మరో ఐదేళ్ళ వరకు ప్రతిపక్ష బెంచీలకే పరిమితమవవలసి వచ్చినపుడు, ఆయన తీవ్ర అసహనానికి గురవడం ఖాయం. అది పార్టీ నేతలపైనే ప్రదర్శించడం కూడా ఖాయం. పార్టీ నేతలు అది భరించలేనప్పుడు దాడి వీరభద్రరావులాగే బయటపడే ప్రయత్నం చేయడం కూడా తధ్యం. అటువంటప్పుడు ఆయన చెప్పినట్లు వైకాపా ఎంతకాలం మనుగడ సాగించగలదో అనుమానమే.

 

అందువల్ల దాడి వీరభద్ర రావు తనపై చేసిన ఆరోపణలను వైకాపా నేతలందరూ ముక్తకంటంతో ఖండించినప్పటికీ, వాటిని జగన్ సానుకూల దృక్పధంతో స్వీకరించి, ఆయన ఎత్తి చూపిన లోపాలను సవరించుకొనే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డికి, వైకాపాకు కూడా చాల మేలు కలుగుతుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.