పట్టిసీమపై జగన్ పోరాటం దేనికో?

Publish Date:Apr 15, 2015

Advertisement

 

రాయలసీమ జిల్లాలకు నీరందించేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన పట్టిసీమ ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా వ్యతిరేకిస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ముందుకే సాగాలనుకోవడంతో, జగన్మోహన్ రెడ్డి తన యంపీలను వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి పిర్యాదు చేసారు. అయితే వారు కూడా సానుకూలంగా స్పందించకపోవడంతో, నేటి నుండి మూడు రోజుల పాటు కృష్ణా, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో బస్సుయాత్రకి బయలుదేరారు. ఈ పట్టిసీమ ప్రాజెక్టు వలన రైతాంగం తీవ్రంగా నష్టపోతారని వారికి నచ్చజెప్పి వారి మద్దతు కూడగట్టి దీనిపై ఉద్యమించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్దమవుతున్నారు. ఒకవేళ ఈ పట్టిసీమ ప్రాజెక్టు వలన రాష్ట్రానికి నష్టం తప్ప ఎటువంటి లాభం ఉండదని కేంద్రం భావిస్తే దానిని నిలిపివేయించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ నిలిపి వేయలేదంటే అర్ధం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వంపై పిర్యాదులు చేయడం వలన ఆయన అధికార తెదేపాను రాజకీయంగా దెబ్బతీయలనుకొని ఉండవచ్చును. కానీ ఆ కారణంగా కేంద్రం రాష్ట్రానికి రావలసిన నిధులను త్రొక్కిపెడితే రాష్ట్రం నష్టపోతుందనే ఆలోచన ఆయనకు లేకపోవడం చాలా దురదృష్టకరం.

 

కానీ తెదేపా వాదన మరొకలా ఉంది. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయినట్లయితే వైకాపాకు మంచి పట్టు ఉన్న రాయలసీమ జిల్లాలలో పొలాలకి నీరు అందుతుంది కనుక, అక్కడి రైతాంగం తమకు నీళ్ళు అందించిన తెదేపా వైపు మళ్ళిపోయినట్లయితే ఇక తమ పార్టీ ఉనికి కోల్పోతుందనే భయంతోనే ఈ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారని వాదిస్తోంది. రాష్ట్రంలో ఒక్క వైకాపా మాత్రమే దీనిని ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆలోచిస్తే మాత్రం తెదేపా చేస్తున్న వాదనను నమ్మవలసి వస్తోంది. వచ్చే ఏడాదిలోగా ఎట్టి పరిస్థితులలో కూడా ఈ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారానే రాయలసీమకు నీళ్ళు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చాలా దృడంగా చెపుతున్నప్పుడు వైకాపా వాదనలు అర్ధరహితం అవుతాయి.

 

వైకాపా వాదిస్తున్నట్లు ఒకవేళ ఈ ప్రాజెక్టు వలన రాయలసీమకు ఎటువంటి ప్రయోజనమూ కలుగకపోయినా లేదా దీనివలన కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులకు తీవ్ర నష్టం కలిగినా లేదా ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయినా దాని వలన మొట్టమొదట తెదేపా పార్టీకే ఎదురుదెబ్బ తగిలవచ్చును. ఈ ప్రాజెక్టు విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా వచ్చే ఎన్నికలలో అందుకు తెదేపా మూల్యం చెల్లించక తప్పదు. ఈ సంగతి తెదేపా అధిష్టానానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదనుకోలేము. అంటే ఈ ప్రాజెక్టు వలన రాయలసీమ జిల్లాలకు నీళ్ళు అందించగలమనే పూర్తి నమ్మకం ఉన్నందునే రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేసిందని స్పష్టమవుతోంది. అంటే వైకాపా విషయంలో తెదేపా చేస్తున్న వాదనలు కూడా నిజమేనని భావించవలసి ఉంటుంది.

 

ఇక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇదివరకు రాజధాని ప్రాంత రైతులకు అండగా నిలబడతానని, వారి తరపున తమ పార్టీ ప్రభుత్వంతో అవసరమయితే కోర్టులలో న్యాయపోరాటాలకి కూడా సిద్దమేనని హామీ ఇచ్చేరు. కానీ ఇప్పుడు ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ గెలిచి తను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్లయితే వారి భూములు వారికిచ్చేస్తానని చిన్న మెలిక పెట్టడంతో రైతులు కూడా ఆయనపై నమ్మకం కోల్పోయారు. మళ్ళీ ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రైతుల తరపున ప్రభుత్వంతో పోరాడుతానని జగన్మోహన్ రెడ్డి మరో కొత్త హామీ ఇస్తున్నారు.

 

అయితే రైతన్నల కోసం అంటూ ఆయన చేస్తున్న ఈ పోరాటాలన్నీ తన పార్టీ ఉనికిని కాపాడుకోవడానికేనని అర్ధమవుతున్నప్పటికీ ఆయన అంత నిర్భయంగా ప్రజలకు నమ్మబలకడం గొప్ప విషయమే. తన పార్టీ ఉనికిని, ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఆయన ఈవిధంగా ఆటంకాలు కల్పించేందుకు పూనుకోవడం శోచనీయం. పట్టిసీమ ప్రాజెక్టు వలన రాయలసీమలో వైకాపా ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి కలగవచ్చని తెదేపా నేతలు చేస్తున్న వాదనలు నిజమనుకొన్నట్లయితే, ఇంతకు ముందు హుదూద్ తుఫాను, తరువాత పంట రుణాల మాఫీ, ఆ తరువాత రాజధాని భూములపై పోరాటం చేసి మధ్యలోనే విడిచిపెట్టేసిన జగన్మోహన్ రెడ్డి ఈ పోరాటాన్ని మాత్రం ఆపకుండా కొనసాగించవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.