జనంలో  జంకుతున్న జగన్ .. జైల్లో  నిందితుల పరామర్శలకు శ్రీకారం 

Publish Date:Feb 18, 2025

Advertisement

గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైనాట్ 175 అంటూ విర్రవీగిన వైకాపా అధినేత వైఎస్ జగన్  ప్రజల చీత్కారాలతో 11 సీట్లకే పరిమితమయ్యారు. జనంలో రావడానికి భయపడుతున్నజగన్ జైలు యాత్రలకు  మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా శ్రీకారం చుట్టారు. అనేక నేరాల్లో నిందితులుగా ఉన్న వారిని  జగన్ ఠంఛనుగా పరామర్శిస్తున్నారు.   ఎన్నికల ఫలితాల   తర్వాత ఆయన షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది తాజాగా విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైకాపా అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. దళితుడైన  సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన వల్లభనేని వంశీని హైద్రాబాద్ రాయదుర్గంలో ఆయన నివాసంలోనే  ఎపి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే .   గతంలో  రెండుసార్లు టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ పార్టీ ఫిరాయించారు. తనను గెలిపించిన టిడిపి శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆయన అరాచకాలు ఆగలేదు. గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి చేసిన  కేసులో వంశీ   నిందితుడు. దళితుడైన సత్యవర్దన్ ను కిడ్నాప్ చేసిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని  మంగళవారం (ఫిబ్రవరి 18)ములాఖత్ లో పరామర్శించడానికి జగన్ విజయవాడ సబ్ జైలుకు మందీ మార్బలంతో వచ్చారు. జగన్ వెంట వైకాపా నేతలు  కొడాలినాని, పేర్ని నాని  కూడా ఉన్నారు. జైలులో వీరిరువురు రావడానికి అధికారులు నిరాకరించారు. భద్రతాకారణాల రీత్యా నిరాకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం విజయవాడ జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది.  అనేక కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా మాజీ ఎంపీ  నందిగం సురేశ్ ను కూడా గతంలో జగన్  జైలులోనే పరామర్శించారు.  జగన్ విదేశీ పర్యటన ముగిసిన వెంటనే నేరుగా సబ్ జైలులో  రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేశ్ ను పరామర్శించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. జగన్ హాయంలో అరాచకాలు చేసిన నేతలను  రెడ్ బుక్ లో  పెట్టడంతో నందిగం సురేశ్  సత్తెనపల్లి కోర్టులో  లొంగిపోయారు. అమరావతి రాజధాని చేయాలన్న   మహిళలను దూషించిన కేసులో  సురేశ్ లొంగిపోయిన సంగతి తెలిసిందే. 
 మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి  ఈవీఎంల ధ్వంసం కేసులో జైలులో ఉన్నప్పుడు జగన్ పరామర్శించారు. జగన్ పాలనలో అక్రమాలు , అరాచకాలు జరిపిన నేతలు జైలు జీవితం గడుపుతుంటే జగన్ మాత్రం జైలు యాత్రలు ప్రారంభించడం చర్చనీయాంశమైంది. తండ్రి వైఎస్ రాజశేశరరెడ్డి చనిపోగానే అధికారంకోసం జగన్ శవ యాత్రలు చేశారు. 
వైకాపా పాలనలో అరాచకాలు పెట్రేగిపోవడంతో  వరుసగా వైకాపా నేతలు  అరెస్ట్ అవుతున్నారు.  ప్రజా సమస్యల మీద పోరాడుతా అని  మూడుసార్లు తేదీలతో సహా ప్రకటించిన జగన్ జనంలో వెళ్లడానికి  మాత్రం జంకుతున్నారు. గత ఐదేళ్లలో  అనేక నేరాల్లో నిందితులైన వైకాపా నేతలను  జైలులో పరామర్శించడం విమర్శలకు దారి తీసింది. 

By
en-us Political News

  
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.