అప్పుడు బూతుల గని.. ఇప్పుడు మౌన ముని

Publish Date:Feb 18, 2025

Advertisement

మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి పూర్తిగా జ్ణానోదయం అయ్యింది. తన మౌనానికి కారణమేంటో ఆయన తనకు మాత్రమే సాధ్యమైన శైలిలో మీడియాకు వివరించారు. అధికారంలో ఉన్నంత కాలం అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై అనుచిత భాషతో ఇష్టారీతిగా రెచ్చిపోయి, పచ్చి బూతులతో విరుచుకుపడిన కొడాలి నాని.. ఓటమి తరువాత నోరెత్తడమే గగనం అన్నట్లుగా మారిపోయారు.

మీడియాకు కనిపించడమే మానేశారు. దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారా అన్నట్లుగా కొడాలి నాని మారిపోయారు. నోటి వెంట బూతుల సంగతి పక్కన పెడితే.. అసలు మాటే రావడం లేదు. 
అయితే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మంగళవారం (ఫిబ్రవరి 18) విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చి, మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా జగన్ వెంట కొడాలి నాని కూడా ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్టు తరువాత తన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి అజ్ణాతంలోకి వెళ్లిపోయిన కొడాలి నాని పార్టీ అధినేత కోసం అనివార్యంగా బయటకు వచ్చారు. జిల్లా జైలు బయట జగన్ మీడియాతో మాట్లాడిన సమయంలో కొడాలి నాని కూడా పక్కనే ఉన్నారు. దీంతో మీడియా ఆయనతో కూడా మాట్లాడించింది. ఆ సందర్బంగా కొడాలి నాని తన మౌనానికి కారణం చెప్పేశారు.

జనం తన ఉద్యోగం ఊడగొట్టేశారనీ, నోరెత్తద్దని ఓటు ద్వారా గట్టి వార్నింగ్ ఇచ్చారనీ కొడాలి నాని అన్నారు. అందుకే మాట్లాడటం లేదనీ చెప్పారు. అంతే తప్ప అరెస్టులకు భయపడననీ, మూడు కాదు ముఫ్ఫై కేసులు పెట్టుకున్నా లేక్క చేయననీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. అధినేత పక్కనుండటంతో ఆ మాత్రం డాబు ప్రదర్శించారు కానీ, వాస్తవానికి వంశీ అరెస్టుతో కొడాలి నాని జావగారిపోయారనీ, ఏ క్షణంలో కటకటాలు లెక్కించాల్సి వస్తుందోనన్న భయంతో ఉన్నారనీ ఆయన సన్నిహితులే చెబుతున్నారు. మొత్తం మీద జగన్  మాటలు విని బూతులతో రెచ్చిపోయిన తనను జనం ఛీకొట్టారని అంగీకరించిన కొడాలి నాని.. ఇకపై జగన్ చెప్పినా తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శించే ధైర్యం చేసే అవకాశాలు ఇసుమంతైనా లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ అధినేత పక్కనుండగా, జనం ఛీకొట్టారనీ, నోరెత్తొద్దని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారనీ అంగీకరించడమే.. కొడాలి నాని చేతులెత్తేసి, చేసిన తప్పులకు చెంపలేసుకుంటున్నారని అర్ధమని విశదీకరిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.