ఐఆర్ 27 ఉంటే.. ఫిట్మెంట్ 23 ఇచ్చారు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తగ్గించడం చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు. ఉద్యోగులు 45శాతం పీఆర్సీ కోరితే.. జగనన్న ఇచ్చింది కేవలం 23శాతం. అంతకుముందు ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి జరిపిన చర్చల్లో నాటకీయ పరిణామాలు జరిగాయని తెలుస్తోంది. ఉద్యోగులను తక్కువ ఫిట్మెంట్కు ఒప్పించేందుకు.. జగన్ తమ ప్రభుత్వ కష్టాలన్నీ చెప్పుకొచ్చారట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలేమాత్రం బాగా లేదని.. దివాళా అంచులకు చేరిందని వేడుకున్నారట. ఇప్పుడు మీరు అడిగినంత పీఆర్సీ ఇస్తే.. ప్రభుత్వం ఆర్థికంగా పతనం అవుతుందని చెప్పారట. అందుకే, ఇచ్చినంతా తీసుకోమని.. అదే మహాభాగ్యమని పండగ చేసుకోమని ఉద్యోగ సంఘాలతో జగన్ చెప్పారని తెలుస్తోంది. అటుఇటూ తిప్పి.. ఆర్థిక దివాళతనాన్ని సాకుగా చూపించి.. ఎట్టకేలకు 23శాతం ఫిట్మెంట్తో పీఆర్సీకి వాళ్లను ఒప్పించారు సీఎం జగన్.
పాపం.. నిజమేననుకున్నారో.. ఇక ఇంతకంటే ఎక్కువ ఇవ్వరని అడ్జస్ట్ అయ్యారో తెలీదు కానీ.. అనేక పెండింగ్ డిమాండ్లతో.. అతితక్కువ ఫిట్మెంట్తో.. ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించేసింది. ఉద్యోగ సంఘాలతో బలవంతపు చప్పట్లు కొట్టించుకుంది.
కట్చేస్తే.. కొన్నిగంటల్లోనే ఉద్యోగ సంఘాలను జగన్ ఎంతగా మభ్యపెట్టిందీ బయటపడింది. సరిగ్గా 10 రోజుల క్రితం జగన్ అధికారిక పత్రిక సాక్షిలో తాటికాయంత హెడ్డింగ్తో పెద్ద ప్రకటన వచ్చింది. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్-2021 ప్రకారం ఆంధ్రప్రదేశ్ సొంత ఆదాయం భారీగా పెరిగిందని.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల వాటా తగ్గిందనేది ఆ యాడ్ సారాంశం.
మరి ఇదేం డబుల్ గేమ్ జగనన్న అంటున్నారు ఉద్యోగులు. మీ పత్రికలనేమో ఆదాయం పెరిగిందని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకున్నారు.. ఉద్యోగ సంఘాలతో భేటీలో మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందంటూ ముసలి కన్నీళ్లు కార్చారా? అని అనుమానిస్తున్నారు. ఈ రెండింటిలో ఏది నిజం? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు పడటం లేదంటే.. ఖాజానా ఖాళీ అనే విషయం తేలిపోతోంది. మరి, సాక్షి పేపర్లో జీజీఐ నివేదిక ప్రకారం ఆదాయం పెరిగిందంటూ గొప్పగా చెప్పుకున్నారు. అంటే.. ఆదాయం పెరగటం నిజమే అయితే.. ఉద్యోగులను అబద్దపు మాటలతో మభ్యపెట్టినట్టేగా అంటున్నారు. మరి, పెరిగిన ఆదాయం అంతా ఏం చేస్తున్నారనే అనుమానం ఇంకోవైపు. లేదంటే.. పెరిగింది గోరంత అయితే చెప్పుకునేది కొండంతనా? అని నిలదీస్తున్నారు. ఇన్కమ్ పెరిగితే జీతాలు మరింత పెంచొచ్చుగా? అంటున్నారు. ఇలా.. ఆదాయం..పీఆర్సీతో జగన్రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారని మండిపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-double-game-over-prc-and-ap-income-39-129857.html
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.