Publish Date:Apr 10, 2026
అగ్రరాజ్యం అమెరికా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి.. ఇరాన్, అమెరికాల మధ్య శాంతి నెలకొల్పే చర్చలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కానున్న నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. ఈ చర్చలకు వేదిక అయిన ఇస్లామాబాద్ లో అమెరికా అసాధారణ భద్రతా ఏర్పాట్లకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ టీమ్ అమెరికాకు చేరుకుంది.
శాంతి చర్చల కోసం ఇప్పటికే ఇరాన్ ప్రతినిథుల బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. శాంతి చర్చలు శనివారం (ఏప్రిల్ 11) నుంచి మొదలు కానున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు సమసిపోయేందుకు ఈ చర్చలు అత్యంత కీలకమని భావిస్తున్న నేపథ్యంలో ఇస్లామాబాద్ లో భద్రతా ఏర్పాట్ల వ్యవహారం అంతా అమెరికా చూస్తున్నది. ఇస్లామాబాద్ చేరుకోనున్న అమెరికా ప్రతినిథుల బృందం రక్షణకు సంబంధించి అమెరికా పూర్తి బాధ్యత తీసుకుంది. ఈ చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు కీలక నేతలు ఇస్లామాబాద్ చేరుకోనున్నారు. ఇక ఇరాన్ నుంచి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ బాగెర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి నేతృత్వంలోని బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంది.
శాంతి స్థాపన దిశగా పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న ఈ చర్చలు అత్యంత కీలకమైన నేపథ్యంలో భద్రతా బాధ్యతలను అమెరికాకు అప్పగించిన పాకిస్థాన్.. తమ పోలీసులు, సైనిక దళాలు అమెరికా సెక్యూరిటీ బృందానికి పూర్తి సహకారం అందిస్తారని పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/islamabad-under-the-control-of-america-36-217052.html
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే