Publish Date:Jun 17, 2026
దేశంలోనే అత్యంత ఆధునికమైన, అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2 ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కు గురౌతోంది. ఇది నిజంగా అంతర్జాతీయ విమానాశ్రయమా? లేక రైల్వే స్టేషనా? అంటూ నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు. విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్ లోపల ప్రయాణికులు బెంచీలపై, నేలపై నిద్రిస్తున్న షాకింగ్ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎయిర్పోర్ట్ లో మౌలిక వసతుల కొరతపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
అఫ్రీన్ అహెమది అనే ప్రముఖ డిజిటల్ క్రియేటర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో డిపార్చర్ ప్రాంతంలో ప్రయాణికులు అక్కడి సిమెంట్ బెంచీలపై, ఇండోర్ చెట్ల కింద, నేలపై తమ లగేజ్ బ్యాగులను దిండ్లుగా చేసుకుని గాఢనిద్రలో మునిగిపోయిన దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఈ దృశ్యాలు చూసిన నెటిజనులు అది అంతర్జాతీయ విమానాశ్రయమా? లేక రైల్వే స్టేషనా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. విమానాశ్రయంలో కనీస వసతుల కల్పనలో వైఫల్యాలకు ఇది నిలువుటద్దమని అంటున్నారు. విమాన టిక్కెట్లకు వేలాది రూపాయలు, పన్నుల రూపంలో భారీగా వసూలు చేస్తున్నప్పుడు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేదా అని నిలదీస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-it-airport-36-223184.html
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్ఫారమ్ ఇన్స్టాగ్రామ్పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారం రేపుతోంది.
శ్రీ వకుళామాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ‘అక్షర గోవిందం – అన్నప్రాశనం’..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక ముందడుగు వేసింది.
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
లింగంపల్లి పసికందు కిడ్నాప్ కేసును చందానగర్ పోలీసులు ఛేదించారు.